మద్యం తాగుతూ వ్యక్తి మృతి | man dies while drinking alcohol | Sakshi
Sakshi News home page

మద్యం తాగుతూ వ్యక్తి మృతి

Dec 12 2015 5:35 PM | Updated on Oct 9 2018 5:43 PM

మద్యం తాగుతూ వ్యక్తి మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని అద్దంకి బస్టాండ్ సెంటర్ వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

ఒంగోలు : మద్యం తాగుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని అద్దంకి బస్టాండ్ సెంటర్ వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానిక సూర్యా వైన్స్ ముందు మద్యం తాగుతున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడి వివరాలు సేకరిస్తున్నారు. వైన్స్ లోని మద్యాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement