మాదిగపల్లిలో పిచ్చికుక్కల స్వైరవిహారం | mad dog bites two children | Sakshi
Sakshi News home page

మాదిగపల్లిలో పిచ్చికుక్కల స్వైరవిహారం

Aug 23 2015 6:07 PM | Updated on Apr 4 2019 4:44 PM

వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం దిగువమాదిగపల్లిలో ఆదివారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేసి ఇద్దరు చిన్నారుల్ని గాయపర్చాయి.

సుండుపల్లి: వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం దిగువమాదిగపల్లిలో ఆదివారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటోన్న ఇద్దరు చిన్నారులను కుక్కలు తీవ్రంగా గాయపర్చి కొంతదూరం పాటు ఈడ్చుకెళ్లాయి.

గాయపడిన  ఇద్దరు చిన్నారులు మోహిత్ కుమార్ (ఏడాదిన్నర వయసు), బబ్లూ (ఏడాది వయసు)లను సుండుపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా..అక్కడి వైద్యుల సూచనమేరకు తిరుపతికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement