సినీ రంగానికి పెద్దపీట: మంత్రి పొన్నాల | latest technology very soon for cinema industry:ponnala lakshmaiah | Sakshi
Sakshi News home page

సినీ రంగానికి పెద్దపీట: మంత్రి పొన్నాల

Oct 20 2013 12:14 AM | Updated on Sep 4 2018 5:07 PM

రాష్ట్ర ప్రభుత్వం సినీరంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సినీరంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. శనివారం ఇక్కడి రవీంద్రభారతిలో ఢిల్లీ తెలుగు అకాడమీ 26వ వార్షికోత్సవం, నూరేళ్ల సినిమా సంబరాలు కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రాజధానికి దగ్గరలోని రాయదుర్గంలో యానిమేషన్, గేమింగ్ ట్రైనింగ్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి, రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి, సినీ నిర్మాత డి.రామానాయుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ మోహన్‌కందా తదితరులు పాల్గొన్నారు.
 
 

ఢిల్లీ తెలుగు అకాడమీ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులతో కె.రాఘవ, సినీనటులు కోటా శ్రీనివాసరావులను సత్కరించారు. ఐఏఎస్ అధికారి చందనాఖన్, డాక్టర్ టి.చంద్రశేఖర్, మణిశర్మలకు ఉద్యోగ రత్న అవార్డును, ఎక్సలెన్సీ అవార్డును డాక్టర్ కె.శ్యాంసుందర్, డాక్టర్ జీవీపీ సుబ్బయ్య, డాక్టర్ శరత్‌రెడ్డిలకు అందజేశారు. నూరేళ్ల సినిమా అవార్డును డాక్టర్ డి.రామానాయుడు, మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి, హస్యనటులు గౌతంరాజు, సినీనటులు రాళ్లపల్లి, రావి కొండలరావు, కోట శంకర్‌రావు, సుబ్బరాయశర్మ, ఎన్‌టీ చౌదరి, అశోక్ కుమార్, రచయిత వడ్డేపల్లి కృష్ణలతో పాటు మరికొంత మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ తెలుగు అకాడమీ ప్రధాన కార్యదర్శి ఎన్.వి.ఎల్ నాగరాజు, చైర్మన్ కేఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement