'వారిని ఎందుకు అరెస్ట్ చేయటంలేదు?' | kurnool mla sv mohan reddy slams tdp government | Sakshi
Sakshi News home page

'వారిని ఎందుకు అరెస్ట్ చేయటంలేదు?'

Nov 29 2014 12:53 PM | Updated on May 29 2018 4:15 PM

'వారిని ఎందుకు అరెస్ట్ చేయటంలేదు?' - Sakshi

'వారిని ఎందుకు అరెస్ట్ చేయటంలేదు?'

టీడీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని కర్నూలు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు.

కర్నూలు : టీడీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని కర్నూలు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ భూమా నాగిరెడ్డిపై ఆగమేఘాల మీద కేసులు నమోదు చేసిన పోలీసులు టీడీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

 

కోర్టు ఆదేశిస్తే తప్ప నంద్యాల మున్సిపల్ చైర్మన్, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తదితరులపై కేసులు నమోదు చేయలేదని ఎస్వీ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసులు నమోదైనా వారిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement