ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

IPS Officers Transfer In Andhra Pradesh - Sakshi

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర రోడ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా కేఆర్‌ఎమ్‌ కిషోర్‌ కుమార్‌, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కుమార్‌ విశ్వజిత్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

బదిలీల వివరాలు..

  •  రోడ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా కేఆర్‌ఎమ్‌ కిషోర్‌ కుమార్
  • హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కుమార్‌ విశ్వజిత్‌
  • రైల్వేస్‌ అడిషనల్‌ డీజీగా బాలసుబ్రహ్మణ్యం
  • సీఐడీ డీఐజీగా సునీల్‌ కుమార్‌ నాయక్‌
  • గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండెంట్‌గా అభిషేక్‌ మహంతి
  • ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌ (అదనపు బాధ్యతలు)
  • ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌ హరికుమార్‌, కృపానంద త్రిపాఠిని డీజీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top