బంతి బంతికీ బెట్టింగ్! | IPL cricket betting | Sakshi
Sakshi News home page

బంతి బంతికీ బెట్టింగ్!

May 25 2015 4:09 AM | Updated on Aug 21 2018 5:46 PM

చెన్నై సూపర్‌కింగ్స్ గెలుస్తుంది.. నా పాట లక్ష ముంబై ఇండియన్స్ ఓడితే నేను రెండు రెట్లు అధికంగా ఇస్తాను బౌలర్...

ఐపీఎల్ తుది పోరుపై పందేల జోరు
చేతులు మారిన కోట్ల రూపాయలు
కర్నూలు నగరంలో బెట్టింగ్‌రాయుళ్లు
హోటళ్లు, లాడ్జిల్లో కొనసాగిన దందా
మేము సైతం అన్న గ్రామీణులు

 
 సాక్షి, కర్నూలు : చెన్నై సూపర్‌కింగ్స్ గెలుస్తుంది.. నా పాట లక్ష ముంబై ఇండియన్స్ ఓడితే నేను రెండు రెట్లు అధికంగా ఇస్తాను బౌలర్ నెహ్రా 3 నుంచి 5 వికెట్లు తీస్తాడు.. లక్ష రూపాయల బెట్.. ..ఇవీ ఆదివారం జరిగిన ఐపీఎల్ టీ20 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్‌రాయుళ్లు ఇచ్చిన ఆఫర్లు. కర్నూలు నగరంలోని లాడ్జిలు, హోటళ్లలో ఈ దందా యథేచ్ఛగా సాగింది. జిల్లా పోలీసులు దీనిపై దృష్టి సారించక పోవడం బెట్టింగ్ రాయుళ్లకు వరంగా మారింది. కర్నూలు నగరంలో కనీసం రూ. 5 కోట్ల వరకు బెట్టింగ్ సాగినట్లు ఒక అంచనా.

ఇక్కడి వారికి ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోని ప్రధాన బుకీలతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. గతంలో పందేలు కాస్తూ పలువురు పోలీసులకు పట్టుబడ్డారు. ముంబై-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బంతికీ బెట్టింగులు నడవడం గమనార్హం. కొందరు అనుమానం రాకుండా నివాస గృహాల్లోనే ఈ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది.  కర్నూలు నగరంతోపాటు జిల్లాలోని నంద్యాల, కోవెలకుంట్ల, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, డోన్, ఆత్మకూరు, పత్తికొండ తదితర పట్టణాలకూ ఈ బెట్టింగ్ దందా పాకింది.

జిల్లాలో జరిగే వ్యవస్థీకృత బెట్టింగ్‌కు కర్నూలు నగరం ప్రధాన కేంద్రంగా ఉండడం గమనార్హం. చిరువ్యాపారుల నుంచి బడాబాబుల దాకా ఈ వ్యవహారం డబ్బులు పోగొట్టుకొని చేతులు కాల్చుకున్న వారే. పందేల కోసం కొందరు యువకులు ఏకంగా నేరాలకు సైతం పాల్పడుతున్నారు. చెన్నై-ముంబై జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌పై గ్రామీణ ప్రాంతాల్లో సైతం జోరుగా పందేలు సాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement