హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి ఉంటే యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ దిగివచ్చేవారని వైఎస్ఆర్ సిపి సిజిసి సభ్యుడు దాడి వీరభద్రరావు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన రాజీనామా ఇవ్వనిది కాక, మంత్రులను కూడా రాజీనామా ఇవ్వనివ్వలేదన్నారు. ఇచ్చిన వారి రాజీనామాలను ఆమోదించే పరిస్థితి లేదని తెలిపారు. ఇదంతా ఓ పెద్ద డ్రామా అన్నారు.
జీఓఎం ఏర్పాటు, చర్చలు, ప్రక్రియ కొనసాగింపు అన్నీ ఒకటి వెంట ఒకటి జరిగిపోతున్నాయన్నారు. అయినా సీఎం ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా సోనియాకు వ్యతిరేకంగా మాట్లాడే శక్తి అతనికి ఉందా? అని అడిగారు. వ్యతిరేకత నిజమైతే ఆయనను ముఖ్యమంత్రిగా పీకిపారేసేవారన్నారు. సోనియా అడుగుజాడల్లోనే సీఎం నడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్కు నూకలు చెల్లాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ మట్టికొట్టుకుపోతుందనే ఉద్దేశంతో కొత్తపార్టీ పెట్టడానికి సీఎం సిద్దమవుతున్నారన్నారు. . సమైక్యాంధ్రకు అనుకూలంగా ఒక పార్టీ పెట్టి సీట్లు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా సోనియాతో కుమ్మక్కులో భాగమేనన్నారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజుకు కూడా ఎవరికీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా? ఇప్పటికీ చెపడంలేదన్నారు. ఆయన మాటలలో స్పష్టతలేదని తెలిపారు. జాతీయ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే, సమాదానం చెప్పకుండా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారన్నారు. స్పష్టత లేకుండా ఆత్మగౌరవ యాత్ర అంటారు. ఎవరి ఆత్మగౌరవం కోసం యాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టే దమ్ముందా మీకు అని చంద్రబాబుని అడిగారు.
చంద్రబాబు, కిరణ్లు కాకమ్మ కథలు చెబుతున్నారని మండిపడ్డారు. వారిద్దరూ సమైక్య ద్రోహులన్నారు. తెలుగుజాతి వారిని ఎన్నటికీ క్షమించదని చెప్పారు. చంద్రబాబు ఆత్మగౌరవయాత్ర మొదలుపెట్టేముందు విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలన్నారు. కేబినెట్ రద్దు చేయాలని ప్రధానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే తన పదవికి రాజీ నామా చేయాలన్నారు. బ్రదర్ అనిల్పై వచ్చిన ఆరోపణలను తాము ఖండిస్తున్నట్లు దాడి చెప్పారు.
సీఎం రాజీనామా చేసిఉంటే సోనియా దిగివచ్చేవారు: దాడి
Published Mon, Oct 21 2013 3:24 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు
ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్
తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు
ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...
Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!
ఒకరోజు వర్షాకాలం ఉదయాన్నే.. నదికి వెళ్లిన ముని..
బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
నెహ్రూ తర్వాత మోదీనే అంటూ ఢిల్లీ బయల్దేరిన రజనీకాంత్
‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
తప్పక చదవండి
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- 39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- ‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
- ఘోరం: వివాహిత మిస్సింగ్, మూడురోజల తర్వాత..
- ముగిసిన చేప ప్రసాదం పంపిణీ, మిస్ అయిన వాళ్ల కోసం..
- ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష
Advertisement