ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని అదృశ్యం | Idupulapaya IIIT Girl Student Missing | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని అదృశ్యం

Oct 30 2017 11:14 AM | Updated on Oct 30 2017 11:37 AM

 Idupulapaya IIIT Girl Student Missing

వైఎస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది.

సాక్షి, వైఎస్సార్‌ కడప: వైఎస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా ఇరుసుమందకు చెందిన అనిత ట్రిపుల్‌ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతోంది.

ఆదివారం సాయంత్రం నుంచి అనిత కనిపించడం లేదని తోటి విద్యార్థులు తెలిపారు. విద్యార్థి అదృశ్యంతో ట్రిపుల్‌ ఐటీ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆర్కే వ్యాలీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement