breaking news
Idupulapaya IIIT
-
ట్రిపుల్ ఐటీ సీట్లకు ఫైనల్ కౌన్సెలింగ్
వేంపల్లె: ట్రిపుల్ ఐటీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి శుక్రవారం చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ) ఏపీ యూజీ అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ అమరేంద్రకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చివరి విడత కౌన్సెలింగ్ను ఇడుపులపాయ (ఆర్కే వ్యాలీ) ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం క్యాంపస్లలో మొత్తం 105 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.ఈ సీట్ల భర్తీ కోసం 1:1 నిష్పత్తిలో ప్రొవిజనల్ సెలక్షన్ జాబితా, 1:4 నిష్పత్తిలో వెయిటింగ్ లిస్ట్ను విడుదల చేశామని వివరించారు. ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ క్యాంపస్లో కౌన్సెలింగ్కు హాజరై ఒరిజినల్ ధ్రువపత్రాలను సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత కూడా సీట్లు మిగిలితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులకు 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందని వివరించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నుంచి మెరిట్ జాబితా అందిన వెంటనే స్పోర్ట్స్ కోటా సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు.ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల ఎంబీబీఎస్, బీడీఎస్ 2026–27 కన్వీనర్ కోటా ప్రవేశాల కౌన్సెలింగ్కు బుధవారం ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నెల 12న రాత్రి 9గంటల వరకు చివరి గడువుగా పేర్కొన్నారు. 13, 14 తేదీల్లో ఆలస్య రుసుంతో రిజిస్ట్రేషన్కు వీలు కల్పించారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.2,400 చొప్పున ఫీజు చెల్లించాలి.గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోనట్లైతే అన్ని వర్గాల విద్యార్థులు రూ.20 వేల అదనపు రుసుంతో దరఖాస్తు చేసుకునే వీలుంది. నిబంధనలపై సందేహాల నివృత్తికి 89787 80501, 79977 10168, దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లైతే 90007 80707, 80082 50842 నెంబర్లను సంప్రదించాలని విద్యార్థులకు వర్సిటీ సూచించింది. https://drntr.uhsap.in/index/లో పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉంచారు. వ్యవసాయ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు సాక్షి, అమరావతి/గుంటూరురూరల్/బాపట్ల: ఆచార్య ఎన్జీరంగా వ్యవ సాయ విశ్వవిద్యాలయం 2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువరించింది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ మణి ఓ ప్రకటనలో కోరారు. సీట్ల వివరాలు బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్) కోర్సులో ఎంపీసీ స్ట్రీమ్ రైతుల కోటా కింద బాపట్లలోని ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్లో 27 సీట్లు (2 ఈడబ్ల్యూఎస్తో కలిపి).మడకశిర కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్లో 47 సీట్లు బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సులో బైపీసీ స్ట్రీమ్ కింద 73 సీట్లు, ఎంపీసీ స్ట్రీమ్ రైతుల కోటా కింద బాపట్ల, పులివెందుల కళాశాలల్లో కలిపి 32 సీట్లు ఉన్నాయి. కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఈఏపీసెట్–2026 ర్యాంకుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్మీడియట్ (ఎంపీసీ/బైపీసీ) పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. దరఖాస్తులను ఈనెల 10వ తేదీ సాయంత్రం 4గంట లలోపు ‘రిజిస్ట్రార్, ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిపాలనా కార్యాలయం, గుంటూరు–522034’ చిరునామాకు చేరేలా రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా నేరుగా అందజేయవచ్చు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ లేదా 81257 29592, 73311 48417, 78935 20988 నంబర్లలో సంప్రదించవచ్చు. అభ్యంతరాల స్వీకరణ సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్)ల ప్రొవిజనల్ ఫైనల్ సీనియార్టీ జాబితాను aphmfw.ap.gov.inలో అందుబాటులో ఉంచినట్టు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యంతరాలు, ఫిర్యాదులున్న వైద్యులు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల్లోపు e6sectionappealdphfw@gmail.comకు పంపాలని స్పష్టం చేసింది. -
వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, ఇడుపులపాయ: ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ బుధవారం ఆవిష్కరించారు. అనంతరం రూ.190 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆర్జీయుకేటీ, ఆర్కే వ్యాలీలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడంలో భాగంగా రూ.139.83 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కొత్త ఎకడమిక్ కాంప్లెక్స్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. (చదవండి: అమ్మ నాన్నను చూసిన విధానమే ఈ పుస్తకం: సీఎం జగన్) 10.10 కోట్ల అంచనాతో నిర్మించనున్న కంప్యూటర్ సెంటర్కు సీఎం శంఖుస్థాపన చేశారు. ఇందులో నాలుగు కంప్యూటర్ ల్యాబ్లు, రెండు లెక్చర్ హాళ్లు ఉంటాయి. 616 మంది కూర్చునే సామర్థ్యంతో 0.75 ఎకరాలలో విశాలమైన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా కంప్యూటర్ సెంటర్ నిర్మాణం చేపట్టబోతున్నారు. 40 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న డాక్టర్ వైఎస్సార్ ఆడిటోరియానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఇది రెండు అంతస్తుల ప్రపంచ స్థాయి ఆడిటోరియం. 1700 మంది విద్యార్థులకు సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మొత్తం ప్లిన్త్ ఏరియా 75,881.00 చదరపు అడుగులలో దీనిని నిర్మించనున్నారు. వీటితో పాటు 3 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. తద్వారా విశ్వవిద్యాలయానికి ఏడాదికి 1.51 కోట్ల విద్యుత్ ఖర్చుని ఆదా చేయబోతున్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం అనంతరం సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయల నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. (చదవండి: ప్రతి పేదోడి గుండెల్లో వైఎస్సార్ చిరంజీవుడే) -
విషాదం: ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. కళాళాలలో మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న మంజునాథరెడ్డి అనే విద్యార్ధి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి స్వగ్రామం మైదుకూరు. అయితే హాజరు తక్కువ ఉండటంతో పరీక్షలకు అనుమతించలేదని మనస్తాపం చెందిన ముంజునాథరెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం
సాక్షి, వైఎస్సార్ కడప: వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా ఇరుసుమందకు చెందిన అనిత ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి అనిత కనిపించడం లేదని తోటి విద్యార్థులు తెలిపారు. విద్యార్థి అదృశ్యంతో ట్రిపుల్ ఐటీ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆర్కే వ్యాలీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె.వి.సత్యనారాయణ, జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణలు సోమవారం పరిశీలించారు. ఈనెల 11వ తేదీ బుధవారం సాయంత్రం 3గంటల నుంచి 5గంటల వరకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జరిగే ద్వితీయ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావులు రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన వేదిక, గ్యాలరీ, హెలీప్యాడ్లను పరిశీలించారు. గతంలో గ్యాలరీ పక్కనే ఎగ్జిబిషన్ స్టాల్స్ను ఏర్పాటు చేశారని... ప్రస్తుతం అలా కాకుండా వేదిక వెనుకవైపున ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని డైరెక్టర్లు భగవన్నారాయణ, విశ్వనాథరెడ్డిలకు వారు సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అన్బురాజన్, ఎస్ఐలు మస్తాన్ బాషా, మధుమల్లేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ట్రిపుల్ ఐటీ లెక్చరర్ దుర్మరణం
వేంపల్లి: వైఎస్సార్ జిల్లా వేంపల్లి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లో పనిచేస్తున్న అకడమిక్ అసిస్టెంట్ లాల్ బహుదూర్ శాస్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘటనలో ఇంగ్లీష్ మేటర్ వెంకటరమణ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వెంకటరమణను కడప రిమ్స్కు తరలించారు. లాల్బహుదూర్శాస్త్రీ, వెంకటరమణ ఇద్దరూ స్వంత పనుల నిమిత్తం శనివారం సాయంత్రం ఇడుపులపాయ నుంచి ద్విచక్రవాహనంలో కడపకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో అర్థరాత్రి సమయంలో చీమలపెంట వద్ద పంది అడ్డంగా రావడంతో ద్విచక్రవాహనం అదుపు తప్పి ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో లాల్ బహుదూర్ శాస్రీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఒంగోలు స్వస్థలం కాగా పులివెందులలో నివాసం ఉంటున్నారు. విధుల్లో చేరిన మూడు రోజులకే శాస్రీ మృతి చెందడంతో కుటుంబంలోను ట్రిపుల్ ఐటీ లో విషాదఛాయలు అలుముకున్నాయి. గాయపడిన వెంకటరమణ ది పీలేరు కాగా ట్రిపుల్ ఐటీ లో ఇంగ్లీష్ మేటర్ గా పని చేస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీలో క్యాంపస్ ఇంటర్వూ ్యలు
వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గురువారం ప్రముఖ బహుళ జాతి సంస్థలలో ఒకటైన టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 21 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. తొలి దశలో 450 మందికి ఆన్లైన్ పరీక్ష నిర్వహించగా.. ఇందులో 117 మంది టెక్నికల్ ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరికి ఎస్ఆర్ నిర్వహించిన ఇంటర్వ్యూలో 21 మంది విద్యార్థులు తమ ప్రతిభతో ఉద్యోగాలు సాధించారు. ఈసీఈ 13 మంది, సీఎస్ఈ 5 మంది, మెకానికల్ 2, సివిల్ ఒకరు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు రూ. 3.40 లక్షల వార్షిక వేతనం లభించనుందని అధికారులు తెలిపారు. ఈ ఎంపిక పట్ల డైరెక్టర్ భగవన్నారాయణ, పరిపాలనాధికారి అమరేంద్ర కుమార్, అధికారులు కేఎల్ఎన్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, అమరనాథరెడ్డి, ప్లేస్మెంటు అధికారులు అశోక్ సుందర్ హర్షం వ్యక్తం చేశారు.


