-
విషాదం: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. నేడు నవ్వుతూ ఇంట్లో ఉండేది
ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఈ పాటికి ఆ అమ్మాయి నవ్వుతూ ఇంటిలో ఉండేది. ఒక్క రోజు గడిస్తే చక్కగా కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు వేడుకలు చేసుకుని ఉండేది. కానీ ఆ విద్యార్థిని సంయమనం చూపలేకపోయింది. తెలివితేటలతో ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థిని తన మనసుకు మాత్రం కరెక్ట్ సమాధానం చెప్పుకోలేకపోయింది. ఒక్క పరీక్షతో జీవితం ఆగిపోదన్న నిజాన్ని అర్థం చేసుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆశలు పెట్టుకున్న అమ్మానాన్నలకు క్షమాపణలు చెబుతూ బలవంతంగా ఊపిరి ఆపుకుంది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో ఏడాది చదువుతున్న భవిరి విశిష్ట రోషిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాక్షి, శ్రీకాకుళం(ఎచ్చెర్ల క్యాంపస్): ‘అమ్మా..నాన్నా.. క్షమించండి. మీ అంచనాలు, ఆశలు అందుకోలేకపోతున్నాను. పరీక్ష మెరుగ్గా రాయలేకపోతున్నాను. తమ్ముడిని బాగా చదివించండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ) ఎస్ఎం పురం క్యాంపస్ విద్యార్థిని భవిరి విశిష్ట రోషిణి (17) బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని క్యాంపస్లో ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) రెండో ఏడాది చదువుతోంది. ప్రస్తుతం రెండో ఏడాది చివరి సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం చివరి పరీక్ష ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఎగ్జామ్ జరిగింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. అయితే ఈ విద్యార్థిని 11 గంటలకే పరీక్ష ముగించేసి వసతి గృహంలోని తన గదికి వచ్చేసింది. పరీక్ష సరిగా రాయలేకపోయాననే భావనతో సూసైడ్ నోట్ రాసి బ్లాక్ 1లో ఉన్న తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది. మిగతా విద్యార్థులు పరీక్ష పూర్తి చేసుకు ని వచ్చే సరికి రోషిణి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. వారు భయపడి కేర్ టేకర్ జి.జయలక్ష్మికి చెప్పగా.. ఆమె అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనకు చేరుకున్న పరిపాలన అధికారి రమేష్నాయుడు, అధ్యాపకులు విద్యార్థినిని కిందకు దించి శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అయితే విద్యార్థిని మృతి చెందినట్లు వై ద్యులు నిర్ధారించారు. వెంటనే విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు ఎచ్చెర్ల పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ టి.సత్యనారాయణ విద్యార్థిని ఫోన్తో పా టు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ వచ్చి సాక్ష్యాలు సేకరించింది. చదువు ఒత్తిడి కారణంగానే విద్యార్థిని క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తెలివైన విద్యార్థిని.. రోషిణి చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిని. పీయూసీ మొదటి ఏడాది, రెండో ఏడాది మొదటి సెమిస్టర్లోనూ 9.3 క్రెడిట్స్ సాధించి మంచి స్థానంలో ఉంది. చివరి పరీక్షకు సైతం శ్రమించి చదివి సన్నద్ధమైంది. అనుకున్న రీతిలో పరీక్ష రాయలేకపోవడంతో అసంతృప్తికి లోనయ్యింది. కోవిడ్ నేపథ్యంలో 10వ తరగతి పాస్ అయినా ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. ప్రారంభంలో మొదటి కౌన్సెలింగ్లో న్యూజివీడు క్యాంపస్ ఎంచుకుంది. సాలూరు శ్రీకాకుళానికి దగ్గర కావటంతో రెండో కౌన్సెలింగ్లో శ్రీకాకుళం క్యాంపస్ ఎంచుకుంది. తల్లిదండ్రులు సైతం తరచూ వచ్చి కలుస్తుండేవారు. నేడు బర్త్డే.. గురువారం రోషిణి పుట్టిన రోజు. సెమిస్టర్ పరీక్షలు బుధవారం ముగియటంతో విశ్రాంతి కోసం మూడు రోజులు ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో కలిసి గురువారం జన్మదినం జరుపుకోవాలనుకుంది. 18వ ఏటలోకి అడుగు పెట్టాల్సిన విద్యార్థిని ఏకంగా లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. ఇది రెండో ఘటన.. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఏడు నెలల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. విజయనగరం జిల్లా నెల్లిమెర్లకు చెందిన పీయూసీ మొదటి సంవత్స రం విద్యార్థిని కొండపల్లి మనీషా అంజు ఫిబ్రవరి 16న ఆత్మహత్యకు పాల్పడింది. విద్యాసంస్థలో చేరిన కొన్ని రోజులకే ఇంటిపై బెంగ (హోం సిక్తో) విద్యార్థిని మృతి చెందగా, ప్రస్తుతం విశిష్ట రోషిణి చదువు ఒత్తిడి కారణంగా చనిపోయింది. కన్నీరుమున్నీరు.. విశిష్ట రోషిణిది మన్యం జిల్లా సాలూరు పట్టణం తట్టికోట వీధి. తండ్రి బ్యాంకులో బంగారు నగల నిర్ధారణ పనిచేస్తుంటారు. తల్లి సౌజన్య గృహిణి. వీరికి 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. కుమార్తె మృతి విషయం తెలియగానే తల్లిదండ్రులు శ్రీకాకుళం రిమ్స్కు చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఇక క్యాంపస్లో విద్యార్థులు ఈ ఘటనతో హడలిపోతున్నారు. పరీక్షలు ముగియటం, మూడు రోజులు ఇళ్లకు వెళ్లే అవకాశం ఇవ్వటంతో తల్లిదండ్రులకు స మాచారం ఇచ్చి దగ్గరలో ఉన్నవారు ఇళ్లకు వెళుతున్నారు. మరోపక్క క్యాంపస్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. -
Kurnool: ట్రిపుల్ ఐటీ విద్యార్థికి రూ.1.3 కోట్ల వేతనం
కర్నూలు సిటీ: కర్నూలు నగర శివారులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీ)కి చెందిన విద్యార్థి ఏడాదికి రూ.1.30 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇటీవల ట్రిపుల్ ఐటీలో అమెజాన్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లలో పాల్గొన్న విద్యార్థుల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన దీపక్ రాథోడ్ (బీటెక్, సీఎస్ఈ) అత్యధిక వార్షిక వేతనానికి ఎంపికయ్యాడని ట్రిపుల్ ఐటీ ప్లేస్మెంట్ సెల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థి దీపక్ రాథోడ్ను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ డీవీఎల్ఎన్ సోమయాజులు అభినందించారు. చదవండి: (Varadapuram Suri: అక్రమాల ‘వరద’పై ఎందుకింత ప్రేమ!) -
Prakasam District: ట్రిపుల్ ఐటీ విద్యార్థికి రూ.22 లక్షల ప్యాకేజీ
సాక్షి, చీమకుర్తి: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని ట్రిపుల్ ఐటీ విద్యార్థి పంతగాని అజయ్ రూ.22 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న సింగపూర్కు చెందిన గోజెక్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకున్న అజయ్.. ఏడాదికి రూ.22 లక్షల జీతంతో ఉద్యోగానికి ఎంపికైనట్లు కంపెనీ వారు ఆఫర్ లెటర్ను పంపారు. దీనిని ట్రిపుల్ ఐటీ కళాశాల డైరెక్టర్ బి.జయరామిరెడ్డి చేతుల మీదుగా విద్యార్థి అజయ్ మంగళవారం కళాశాలలో అందుకున్నారు. కాగా, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ జయరామిరెడ్డి మాట్లాడుతూ.. 2021–22 విద్యాసంవత్సరంలో ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో పలు కంపెనీలు నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్లలో మొత్తం 774 మంది తమ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. మరో 125 మంది విద్యార్థులు ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని, ఆఫర్ లెటర్ల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. చదవండి: (అంతా నారాయణ ఆదేశాలతోనే..) -
ఆ బెంగతో ఏకంగా ప్రాణాలే తీసుకుంది
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్: ప్రతిభావంతురాలైన ఓ విద్యార్థిని ప్రయాణం అర్ధంతరంగా ఆగిపోయింది. పోటీ పరీక్షల్లో సత్తా చాటిన అమ్మాయి జీవితంలో మాత్రం ఆ తెగువ,తెలివి చూపలేకపోయింది. ఇంటిపై బెంగ పెట్టుకుని ఏకంగా ప్రాణాలే తీసుకుంది. ఆలోచనలకు అడ్డుకట్ట వేయలేక, వెంటాడుతున్న మనోవ్యధను భరించలేక, సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో పాలుపోక బంగారు భవిష్యత్తు ఉన్న యువతి బలవన్మరణానికి పాల్పడింది. శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) ఎస్ఎం పురం క్యాంపస్లో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న కొండపల్లి మనీష అంజు(16) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థిని స్వస్థలం విజయనగరం జిల్లా నెల్లిమర్ల. అనారోగ్యం అని చెప్పి.. ఈ ఏడాది టెన్త్ క్లాస్లో కోవిడ్ కారణంగా అందరినీ పాస్ చేసేశారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు పోటీ పరీక్ష నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన మనీష అంజు శ్రీకాకుళం క్యాంపస్లో సీటు సంపాదించింది. ఈమెకు కాలేజీ హాస్టల్లోని ఎస్–4 గదిని మరో ఇద్దరు విద్యార్థినులు అక్షిత, యమునలతో కలిపి కేటాయించారు. యమున ఇంకా రిపోర్ట్ చేయలేదు. అక్షిత మాత్రం ఇదే గదిలో ఉంటూ బుధవారం క్లాసుకు వెళ్లిపోయింది. మనీష తనకు ఆరోగ్యం బాగోలేదని, విశ్రాంతి తీసుకుంటానని కేర్టేకర్కు చెప్పి ఆమె గదిలోకి వెళ్లిపోయింది. ఉదయం అంతా క్లాసులకు వెళ్లిపోయాక 10.30 గంటల ప్రాంతంలో గదిలోని ఫ్యాన్కు తన చున్నీతో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదవండి: (13 మంది విద్యార్థినులపై అత్యాచారం.. టీచర్కు..) మధ్యాహ్నం తోటి విద్యార్థినులు ఆమెను భోజనానికి పిలవడానికి గది వద్దకు వచ్చారు. తలుపులు కొట్టగా ఎవరూ తీయలేదు. దీంతో వారు కేర్ టేకర్కు సమాచారం అందించారు. అనంతరం తలుపులు బద్దలుగొట్టి చూస్తే ఫ్యాన్కు వేలాడుతూ మనీష కనిపించింది. దీంతో కేర్ టేకర్ కంగారు పడి డైరెక్టర్ ప్రొఫెసర్ పెద్దాడ జగదీశ్వరరావు, పరిపాలన అధికారి కె.మోహన్కృష్ణ చౌదరిలకు సమాచారం చేరవేశారు. తర్వాత మనీషను కిందకు దించి అంబులెన్స్లో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ట్రిపుల్ ఐటీ అధికారులు ఎచ్చెర్ల పోలీసులకు, విద్యార్థిని తల్లిదండ్రులు సూరిబాబు, కరుణకుమారిలకు సమాచారం చేరవేశారు. ఎచ్చెర్ల ఎస్ఐ కె.రాము ఆధ్వర్యంలో పోలీసులు, క్లూస్ టీమ్ సభ్యులు విచారణ నిర్వహించి, ఆధారాలు సేకరించారు. తోటి విద్యార్థినులను విచారించారు. ఇంటిపై బెంగ పెట్టుకుందా..? మనీష అంజు చురుకైన విద్యార్థిని. ప్రాథమిక విద్యలో మంచి ప్రతిభ కనబరిచి ట్రిపుల్ ఐటీకి ఎంపికైంది. ఇక్కడ పీయూసీ మొదటి ఏడాది, మొదటి సెమిస్టర్ క్లాస్ వర్క్ సంక్రాంతి పండగ ముందు 15 రోజులు నిర్వహించారు. అనంతరం కరోనా నేపథ్యంలో విద్యాసంస్థకు సెలవులు ప్రకటించారు. మొదటి ఏడాది విద్యార్థులకు క్యాంపస్ అలవాటు చేసేందు ఆఫ్లైన్ క్లాస్వర్క్ను ఈ నెల 14న ప్రారంభించారు. ఈమె రెండు రోజుల పాటు క్లాస్కు హాజరైంది. కానీ ఇక్కడ తనకు నచ్చడం లేదని, ఇల్లు గుర్తుకు వస్తోందని తోటి వారితో తరచూ చెప్పేది. తల్లిదండ్రులతో రోజూ మాట్లాడేది. రెండు రోజుల కింద తల్లి స్వయంగా వచ్చి ఆమెను క్యాంపస్లో దించి వెళ్లారు. సంక్రాంతి ముందు కూడా ఆమె తండ్రి 15 రోజుల్లో రెండుసార్లు వచ్చి చూశారు. విద్యార్థిని ఇంటికి వెళ్లినప్పుడు కూడా తాను కాలేజీకి వెళ్లనని చెప్పినట్లు సమాచారం. తల్లిదండ్రులను విడిచి ఇక్కడ ఉండలేకే విద్యార్థి ఇలా చేసుకుందని తోటివారు భావిస్తున్నారు. ఈ క్యాంపస్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. కూతురు చనిపోయిందన్న వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
విషాదం: బాగా చదవలేక పోతున్నా.. అందుకే
నూజివీడు(కృష్ణా జిల్లా): స్థానిక ట్రిపుల్ ఐటీలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఈవూరి గౌరీష్(16) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాలోని మండల కేంద్రమైన నగరం గ్రామానికి చెందిన గౌరీష్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని ఐ2 హాస్టల్ భవనం ఫస్ట్ఫ్లోర్లోని ఓ గదిలో ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం గౌరీష్కు అతని తల్లి ఫోన్ చేయగా స్పందించలేదు. సాయంత్రం మళ్లీ ఫోన్ చేసినా ఫలితంలేకపోవడంతో అతని స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడించమని చెప్పింది. చదవండి: వ్యభిచారం కేసులో టీడీపీ నేత అరెస్టు పరీక్షలు కావడంతో స్నేహితుల రూమ్లకు వెళ్లి చదువుకుంటూ ఉంటాడేమోనని రాత్రి 8.30 గంటల సమయంలో అన్ని రూమ్లను వెతుకుతుండగా ఒక గది తలుపులు తెరుచుకోలేదు. తలుపులను పగులగొట్టి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని గౌరీష్ కనిపించాడు. ఈ సమాచారం అందిన వెంటనే డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు, పట్టణ ఎస్ఐ తలారి రామకృష్ణ ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. తాను బాగా చదువలేకపోతున్నానని, అందుకే చనిపోతున్నట్లుగా గౌరీష్ సూసైడ్ లెటర్ రాశాడని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పట్టణ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement