'నేనేం ఫోర్ ట్వంటీ ని కాదు. తండ్రికి చెడ్డపేరు తెచ్చిపెట్టేలా ప్రవర్తించను. మీరు పార్టీకి అండగా ఉండండి...మీకు నేను అండగా ఉంటాను'
పార్టీ మండల అధ్యక్షుడు ఉమాపతి నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభకు లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలను ధమ్ముంటే నిరూపించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సవాల్ విసిరారు. తన ప్రసంగంలో కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు జగన్పై ఆరోపణలు చేస్తున్నా కార్యకర్తల నుంచి స్పందన లభించకపోవడం గమనార్హం.