భార్యను ముక్కలుగా నరికిన భర్త | Husband murder wife | Sakshi
Sakshi News home page

భార్యను ముక్కలుగా నరికిన భర్త

Apr 12 2014 11:14 AM | Updated on Aug 11 2018 8:48 PM

భార్యను ముక్కలుగా నరికిన భర్త - Sakshi

భార్యను ముక్కలుగా నరికిన భర్త

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జూకల్లో ఓ భర్త తన భార్యను అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశాడు.

హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జూకల్లో ఓ భర్త తన భార్యను అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసినట్లు నమ్మించడానికి ప్రయత్నించాడు. పోలీసుల కథనం ప్రకారం 500 రూపాయలు పోగొట్టిందని  యాదయ్య అనే వ్యక్తి తన భార్యను కర్రలతో అతి దారుణంగా కొట్టాడు. ఆ తరువాత ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు.

మొదటి భార్యను కూడా అతనే  యాదయ్య హత్య చేసినట్లు చెబుతున్నారు. చిన్న కారణంగానే రెండవ భార్యను ఇంత దారుణంగా హత్య చేయడంతో అతని మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement