దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

Published Sun, Jun 26 2016 11:59 AM

Heavy rush at Indrakeeladri

ఇంద్రకీలాద్రి (విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులుతీరారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు మహామండపం సమీపంలోని ఘాట్‌రోడ్డు మీదుగా భక్తులను అనుమతించారు. ప్రస్తుతం అమ్మవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం ఉదయం నుంచి సుమారు 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement