ఏపీలో నూతన బార్‌ పాలసీపై ఉత్తర్వులు జారీ | Government of Andhra Pradesh Announces New Bar Policy | Sakshi
Sakshi News home page

ఏపీలో నూతన బార్‌ పాలసీపై ఉత్తర్వులు జారీ

Nov 22 2019 5:45 PM | Updated on Nov 22 2019 7:27 PM

Government of Andhra Pradesh Announces New Bar Policy - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతన బార్‌ పాలసీని శుక్రవారం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలయ్యే ఈ పాలసీ ప్రకారం బార్‌ లైసెన్స్‌ దరఖాస్తు ఫీజును రూ. 10 లక్షలుగా నిర్ణయించారు. ఇది నాన్‌ రిఫండబుల్‌. లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించనుండగా, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వ్యాపార వేళలుగా నిర్ణయించారు. లైసెన్స్‌ గడువు రెండేళ్ల వరకు ఉంటుంది. లైసెన్స్‌ ఫీజులను చూస్తే 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 25 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 75 లక్షలుగా ఫీజును నిర్ణయించారు. మరోవైపు సామాన్యులకు మద్యాన్ని దూరం చేసేందుకు బార్లలో మద్యం అమ్మకాలపై అదనపు పన్ను వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement