గోకులపాడు బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది.
విశాఖపట్నం : గోకులపాడు బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. బాణాసంచా పేలుడులో గాయపడ్డ లక్ష్మీ అనే మహిళ సెవన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన ఘటనలో ఎనిమిదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే.