పేకాట స్థావరంపై దాడి.. 21 మంది అరెస్ట్ | gamblers arrested in police raids in west godavari district | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై దాడి.. 21 మంది అరెస్ట్

Jan 9 2017 10:18 AM | Updated on Sep 17 2018 6:26 PM

పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించిన పోలీసులు 21 మందిని అదుపులోకి తీసుకున్నారు.

కొవ్వూరు(పశ్చిమ గోదావరి): పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించిన పోలీసులు 21 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 89 వేల నగదు, 18 సెల్‌ఫోన్లు, 14 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం నందమూరులో పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు దాడులు నిర్వహించి పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో పలువురు టీడీపీ నేతలు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement