త్రిపాఠి నేతృత్వంలోని ప్రతినిధి బృందం చంద్రబాబుతో మంగళవారం లేక్వ్యూ అతిధి గృహంలో భేటీ అయింది.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు, కర్ణాటకలోని తుముకూరు నుంచి నెల్లూరుకు గ్యాస్ గ్రిడ్ పైప్లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం చ ంద్రబాబు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ (గెయిల్) బీసి త్రిపాఠిని కోరారు. త్వరలోనే వీటిని చేపడతామని త్రిపాఠి హమీనిచ్చారు. త్రిపాఠి నేతృత్వంలోని ప్రతినిధి బృందం చంద్రబాబుతో మంగళవారం లేక్వ్యూ అతిధి గృహంలో భేటీ అయింది.