'చంద్రబాబు ఎట్టకేలకు అంగీకరించారు' | gadikota srikanth reddy, visweswarreddy slam tdp govt | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ఎట్టకేలకు అంగీకరించారు'

Dec 24 2014 2:20 PM | Updated on May 29 2018 4:18 PM

చంద్రబాబును పొగడడానికి, వైఎస్ జగన్ ను దూషించడానికే ఏపీ సర్కారు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్టు కనిపిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి అన్నారు.

హైదరాబాద్: చంద్రబాబును పొగడడానికి, వైఎస్ జగన్ ను దూషించడానికే ఏపీ సర్కారు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్టు కనిపిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. తాము ఎంత పట్టుబట్టినా కరువుపై చర్చకు అధికారపక్షం ఒప్పుకోకపోవడం విచారకరమన్నారు. 560 మండలాల్లో కరువు నెలకొంటే 266 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం శోచనీయమన్నారు.

100 మందిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మానవ హక్కుల సంఘాలే చెబుతున్నాయన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పడంతో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయని చంద్రబాబు ఎట్టకేలకు అంగీకరించారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను గుర్తించడంలో ఏపీ సర్కారు మోసపూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement