visweswarreddy
-
'నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది'
హైదరాబాద్ : టీడీపీ నేతలు, మంత్రులు వక్రభాష్యాలు మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వై విశ్వేశ్వర్రెడ్డి హితవు పలికారు. సాగునీటి ప్రాజెక్టులకు ఆరాధ్యులుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, వారు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. టీడీపీ నేతలు దిగజారుడు మాటలు మానుకోవాలని మండిపడ్డారు. సాగు నీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమంలో దాదాపుగా జలయజ్ఞం పనులు పూర్తయ్యాయని, రాయలసీమ గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీకి లేదని మండిపడ్డారు. మొదట దఫా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం నీటి హక్కులు కోల్పోయామంటే దానికి కారణం చంద్రబాబేనని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో కర్ణాటకలో నీటి ప్రాజెక్టులు కట్టారని, ఆయన వాటిని కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడుకు వైఎస్ఆర్ వేల కోట్లు ఖర్చు చేశారని, ప్రాజెక్టుకు సామర్ధ్యం పెంచడానికి చంద్రబాబు ఈ మూడేళ్లలో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. హంద్రీనీవాకు ఏం చేశారని మండిపడ్డారు. హంద్రీనీవాపై వైఎస్ఆర్ ఆరున్నర వేల కోట్లు ఖర్చు చేశారని చంద్రబాబు కనీసం 300 ఎకరాలకైనా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. చిన్న డిస్ట్రిబ్యూటరీని కూడా పూర్తి చేయలేదన్నారు. 40 టీఎంసీల హంద్రీనీవాను 5 టీఎంసీలుగా మార్చాలనే జీవో ఇచ్చింది చంద్రబాబు కాదా, ఆ నిజం ప్రజలకు తెలియదా అని మండిపడ్డారు. రాయలసీమపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది'
-
'కంటికి కాంట్రాక్టర్లే కనిపిస్తారా.. బీదవారు కనిపించరా'
-
'కంటికి కాంట్రాక్టర్లే కనిపిస్తారా.. బీదవారు కనిపించరా'
గుంటూరు: ప్రత్యేక హోదా విషయంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అందుకే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని రకాలుగా పోరాడి నిరవధిక నిరాహార దీక్షకు దిగారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ బుధవారం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష నేటికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి దీక్ష వద్ద మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని అన్నారు. కార్పొరేట్ సంస్థలను, బడా కాంట్రాక్టర్లను మాత్రమే చూస్తున్న ప్రభుత్వం రైతులను మాత్రం పక్కకు పెట్టేసిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న బకాయిలకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వబోమంటూ ప్రత్యక్షంగా చెబుతోందని, ఇతర సంస్థలకు ఎలా చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. పరిశ్రమల బకాయిలు చెల్లించేటప్పుడు గుర్తుకు రాని కాంగ్రెస్ ప్రభుత్వం హయాం ఒక్క రైతుల విషయంలో ఎందుకు గుర్తుకువస్తుందని ప్రశ్నించారు. కార్మికులు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారారని ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతుందని చెప్పారు. ప్రతిసారి పరిశ్రమల గురించి, పారిశ్రామిక వేత్తల గురించి మాట్లాడే ప్రభుత్వానికి పేదలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వారికి ఇప్పటి వరకు ఒక్క ఇళ్లయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. -
'చంద్రబాబు ఎట్టకేలకు అంగీకరించారు'
హైదరాబాద్: చంద్రబాబును పొగడడానికి, వైఎస్ జగన్ ను దూషించడానికే ఏపీ సర్కారు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్టు కనిపిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. తాము ఎంత పట్టుబట్టినా కరువుపై చర్చకు అధికారపక్షం ఒప్పుకోకపోవడం విచారకరమన్నారు. 560 మండలాల్లో కరువు నెలకొంటే 266 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం శోచనీయమన్నారు. 100 మందిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మానవ హక్కుల సంఘాలే చెబుతున్నాయన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పడంతో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయని చంద్రబాబు ఎట్టకేలకు అంగీకరించారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను గుర్తించడంలో ఏపీ సర్కారు మోసపూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు.