'నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది'
టీడీపీ నేతలు, మంత్రులు వక్రభాష్యాలు మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వై విశ్వేశ్వర్రెడ్డి హితవు పలికారు. సాగునీటి ప్రాజెక్టులకు ఆరాధ్యులుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, వారు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. టీడీపీ నేతలు దిగజారుడు మాటలు మానుకోవాలని మండిపడ్డారు. సాగు నీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమంలో దాదాపుగా జలయజ్ఞం పనులు పూర్తయ్యాయని, రాయలసీమ గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీకి లేదని మండిపడ్డారు. మొదట దఫా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం నీటి హక్కులు కోల్పోయామంటే దానికి కారణం చంద్రబాబేనని ధ్వజమెత్తారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు