'సీఎంగా తొలిసారి చేసిన సంతకమే చెల్లలేదు' | farmers protest against debt relief scheme | Sakshi
Sakshi News home page

'సీఎంగా తొలిసారి చేసిన సంతకమే చెల్లలేదు'

Dec 16 2014 1:38 PM | Updated on Oct 1 2018 2:00 PM

గ్రామాల్లో నిర్వహిస్తున్నరైతు సాధికారి సదస్సు పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు: గ్రామాల్లో నిర్వహిస్తున్నరైతు సాధికారి సదస్సు పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెట్‌ల ద్వారా వచ్చిన సమాచారాన్ని పత్రంలో చేర్చి రైతులకు అందజేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఆ రుణ విముక్తి పత్రాల వల్ల పైసా కూడా ఉపయోగం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పిడుగురాళ్ల మండలం కోనంకిలో రైతు సాధికార సదస్సు నిర్వహించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఈ సదస్సు తమకొద్దంటూ బ్యానర్లు చించివేశారు.

 

'సీఎం తొలిసారి చేసిన సంతకమే చెల్లలేదని.. ఇక మీరిచ్చి బాండ్లు ఎలా చెల్లుతాయంటూ' రైతులు అధికారులను నిలదీశారు. దీంతో చేసేది లేక అర్ధాంతరంగా కార్యక్రమాన్ని ముగించుకుని అధికారులు వెనుదిరిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement