జగన్‌కు నీరా‘జనం’ | Environmental situation 'People' | Sakshi
Sakshi News home page

జగన్‌కు నీరా‘జనం’

Mar 4 2014 1:36 AM | Updated on Sep 5 2018 2:12 PM

జగన్‌కు నీరా‘జనం’ - Sakshi

జగన్‌కు నీరా‘జనం’

జననేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న జనభేరికి వెళ్తూ...

  • దారిపోడవునా పూల  వర్షం
  •  వెల్లువెత్తిన అభిమానం
  •  పార్టీలో చేరిన పలువురు
  •  సాక్షి, విజయవాడ :  జననేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న జనభేరికి వెళ్తూ గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన  స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయనకు దారిపొడవునా అభిమానులు పూల వర్షం కురిపించారు. పెదవుటపల్లి సెంటరులో జగన్‌కు పూలతో స్వాగతించారు. తేలప్రోలులో  కరచాలనం చేయడానికి పోటీపడ్డారు.

    మహిళలు, వృద్ధులు, విద్యార్థినులు జగన్‌ను కలిసి కర చాలనం చేసి సంతోషపడిపోయారు.  అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళుతూ హనుమాన్‌జంక్షన్‌లోని ఆ పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు నివాసంలో కొద్దిసేపు ఆగారు. జై జగన్, జోహర్ వైఎస్సార్ నినాదాలతో జంక్షన్ హోరెత్తిపోయింది. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, వారితో మాట్లాడారు.  

    నెల్లూరు జిల్లాకు చెందిన సికిందర్‌రెడ్డి గన్నవరం విమానాశ్రయం బయట జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సమయంలో ఆ పార్టీనేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి  ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరుకు చెందిన వైట్ల సత్యనారాయణమూర్తితో పాటు పలువురు నాయకులు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గోసుల శివభరత్ రెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామింగ్  కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మచిలీపట్నం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు కుక్కల విద్యాసాగర్, తోట చంద్రశేఖర్, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, తెల్లం బాలరాజు, విజయవాడ నగర అధ్యక్షుడు జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని),  పేర్ని వెంకట్రామయ్య(నాని), వంగవీటి రాధాకృష్ణ, ఆళ్ల  కాళీ కృష్ణా శ్రీనివాస్(నాని), ముదునూరి ప్రసాదరాజు, జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్‌బాబు, మేకా ప్రతాప అప్పారావు,  నియోజకవర్గ సమన్వయకర్తలు  పి .గౌతంరెడ్డి, ఉప్పులేటి కల్పన, సి.హెచ్.ఆశోక్ గౌడ్, దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్, పటమట సురేష్‌బాబు, ఉప్పాల రాంప్రసాద్, రక్షణనిధి,  పార్టీ నాయకులు తాతినేని పద్మావతి,  తాడి శకుంతల, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి,అప్పన కనకదుర్గా ప్రసాద్  తదితరులు జగన్ వెంట ఉన్నారు.
     
    భారీ వలసలు....

    హనుమాన్‌జంక్షన్ : గన్నవరం  నియోజకవర్గంలోని 25 మంది మాజీ సర్పంచులు, జడ్‌పీటీసీలతో సహా కాంగ్రెస్, టీడీపీలకు చెందిన దాదాపు వెయ్యిమంది కార్యకర్తలు ఆ పార్టీలకు గుడ్ బై చెప్పి పార్టీ నేత దుట్టా రామచద్రరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ముఖ్యనేతలకు జగన్‌పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.

    మల్లవల్లి గారపాడు సర్పంచులు చాకిరి కొండలరావు, కాటూరి విజయలక్ష్మీ, తిప్పనగుంట, దంటగుంట్ల మాజీ సర్పంచులు మొవ్వా రాజారావు, యజ్జవరపు సింహాచలం, వెంకటేశ్వరరావు దంపతులు, బొబ్బా యలమందారెడ్డి, వీరంకి వెంకటేశ్వరరావు, మూదు సాంబశివరావు, కాగితాల శివరాం,  బొగ్గవరపు రాజేంద్రప్రసాద్, కొలుపూరి శ్రీనివాసరావు, గూడపాటి బసవయ్య, కాటూరి సూరిబాబు, పొల్లిమెట్ల మోషే, పైడిముక్కల చార్లిస్, అనియాల మురళి తదితర ముఖ్య నేతలూ వైఎస్సార్‌సీపీలో చేరారు.  సూరపనేని రాధాకృష్ణామూర్తి నేతృత్వంతో కాకులపాడు మాజీ ఉప సర్పంచి చిటికినేని ప్రసాద్, ఇల్లూరి విజయ్, కొండిశెట్టి వీరబాబు సహా మరో వంద మంది పార్టీలో చేరారు.
     
    అభయాంజనేయునికి ప్రత్యేక పూజలు...

     
    ప్రసిద్ధ శ్రీ అభయాంజనేయ స్వామికి జగన్‌మోహనరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు శాస్త్రోస్తకంగా సాదర స్వాగతం పలికారు. అధికసంఖ్యలో తరలివచ్చిన కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో జంక్షన్ సెంటర్ నిండిపోయింది. దేవస్ధానంలో పూజల అనంతరం బయటకు వస్తూ తరలివచ్చిన పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement