రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై నేడు ఈసీ సమీక్ష | Election Commission to review on State Elections | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై నేడు ఈసీ సమీక్ష

Dec 23 2013 2:16 AM | Updated on Aug 14 2018 5:45 PM

వచ్చే సాధారణ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఏర్పాట్లపై కసరత్తును ప్రారంభించింది.

 సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఏర్పాట్లపై కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం అన్ని జిల్లా కలెక్టర్లతో కేంద్ర డిప్యుటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్సి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ, పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించడం, రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం, ఈవీఎంల లభ్యత, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement