returning officer
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు
జనగామ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై ఎన్నికల నిబంధన ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదైంది . గత ఏడాది నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో చొరబడి ఓటర్లను మభ్యపెట్టారంటూ కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదే రోజు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ పాటు పోలీసులకు కాంగ్రెస్ స్టేట్ యూత్ లీడర్, కాంగ్రెస్అభ్యర్థి పోలింగ్ ఏజెంట్ కొమ్మూరి ప్రశాంత్రెడ్డి ఫిర్యాదు చేశారు. కండువాతో పోలింగ్ బూత్ కి వెళ్లవద్దని ఎంత చెప్పినా వినలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 'బలవంతంగా పోలింగ్ బూత్ లోకి చొచ్చుకు వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సదరు ఫొటో ఆధారాలను జత చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు తాజాగా శనివారం కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ, 130 ఆర్పీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం ఆదివారం బయటకు వచ్చింది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా కేసు నమోదైంది వాస్తవమేనని చెప్పారు. -
బ్యాలెట్పై ‘ఎక్స్’ మార్కు ఎందుకేశారు?
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక సమయంలో బ్యాలెట్ పత్రాలను పాడుచేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు గాను రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. అనిల్ మసీహ్ను ప్రశ్నించడం ద్వారా, రిటర్నింగ్ అధికారిని దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ క్రాస్ ఎగ్జామినేట్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా భావిస్తున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. చండీగఢ్ మేయర్గా ఎన్నికైన మనోజ్ సోంకార్ రాజీనామా, ఆప్ కౌన్సిలర్లు ముగ్గురు ఆదివారం బీజేపీ పంచన చేరినట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. అభ్యర్థులను ప్రలోభ పెట్టడాన్ని తీవ్రమైన అంశంగా పేర్కొంది. తాజాగా ఎన్నికలు జరపటానికి బదులుగా కొత్త రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణంలో మరోసారి ఓట్లను లెక్కించడం మంచిదని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే, మంగళవారం బ్యాలెట్ పత్రాలను పరిశీలించాకే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. నిజాయతీగా సమాధానమివ్వండి సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మసీహ్ను కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘ఇది చాలా తీవ్రమైన వ్యవహారం. నిజాయతీగా సమాధానాలు చెప్పకుంటే ప్రాసిక్యూట్ చేస్తాం. ఆ ఫుటేజీ చూశాం. మీరు బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు పెడుతూ కెమెరా వైపు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు క్రాస్ మార్కులు పెట్టారు?’ అని అడిగారు. ఎనిమిది బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కు పెట్టింది నిజమేనని మసీహ్ అంగీకరించారు. అవి అప్పటికే పాడైపోయి ఉన్నందున, వేరు చేసేందుకే అలా చేశాన’ని చెప్పారు. ‘బ్యాలెట్ పేపర్లపై మీరు కేవలం సంతకం మాత్రమే చేయాలి. అలాంటప్పుడు వాటినెందుకు పాడు చేశారు? బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారులు ఇతరత్రా మార్కులు వేయొచ్చని ఏ నిబంధనల్లో ఉంది?’అని సీజేఐ అడిగారు. ఎన్నికల ప్రక్రియలో కలుగ జేసుకున్నందుకు మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చండీగఢ్ యంత్రాంగం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతానుద్దేశించి సీజేఐ పేర్కొన్నారు. మంగళవారం జరిగే విచారణకు కూడా హాజరుకావాలని అనిల్ మసీహ్ను ఆదేశించారు. ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు. బ్యాలెట్ పత్రాలు, కౌంటింగ్ వీడియో పరిశీలిస్తాం బ్యాలెట్ పత్రాలతోపాటు ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజీని తమకు పంపించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించింది. రికార్డులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఒక న్యాయాధికారికి బాధ్యతలు అప్పగించాలని, పటిష్ట బందోబస్తు నడుమ ఆయన్ను ఢిల్లీకి పంపాలని స్పష్టం చేసింది. ఏం జరిగిందంటే..? జనవరి 30వ తేదీన మేయర్ ఎన్నికలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎనిమిది ఓట్లను చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించడం, బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకార్ చేతిలో ఆప్–కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి నాలుగు ఓట్ల తేడాతో ఓటమిపాలవడం తెలిసిందే. బీజేపీ మైనారిటీ సెల్కు చెందిన అనిల్ మసీహ్ కావాలనే ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని ఆప్ ఆరోపించింది. కెమెరా వైపు చూసుకుంటూ ఆప్ కౌన్సిలర్లకు చెందిన బ్యాలెట్ పేపర్లపై మసీహ్ ‘ఎక్స్’ మార్కువేస్తున్న ఫుటేజీని ఆప్ కోర్టుకు సమర్పించింది. ఈ నెల 5వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. -
చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సీరియస్.. కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశారన్న కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. ఆయన్ను మంగళవారం కూడా విచారణకు రావాలని తెలిపింది. అంతేగాక మేయర్ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను రేపు సుప్రీంకోర్టుకు తీసుకురావాలని ఆదేశించింది. అందుకోసం ఒక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారికి, రికార్డులకు భద్రత కల్పించాలని తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు బ్యాలెట్ పేపర్లు, ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో రికార్డింగ్ను పరిశీలిస్తామని పేర్కొంది. సు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. అయితే రిటర్నింగ్ అధికారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. చదవండి: యూపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది: మోదీ నిజాయితీగా సమాధానాలు చెప్పండి: సుప్రీం చండీగఢ్ మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ అత్యున్నత న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. విచారణ సందర్బంగా సీజేఐ డీవై చంద్రచూడ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అనిల్ మసీహ్ను పలు సూటి ప్రశ్నలు సంధించింది. నిజాయితీగా సమాధానాలు చెప్పకుంటే తనపై విచారణ చేస్తామని హెచ్చరించింది. ఇది తీవ్రమైన విషయమని పేర్కొన్న ధర్మాసనం... ‘మేం వీడియో చూశాము. బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు వేస్తూ కెమెరాను చూసి ఏం చేస్తున్నారు? ఎందుకు మార్కులు వేస్తున్నారు అని ప్రశ్నించింది. ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై క్రాస్ మార్కులు వేసినట్లు అంగీకరించిన రిటర్నింగ్ అధికారి.. చెడిపోయిన బ్యాలెట్ పత్రాలను వేరుచేయవలసి ఉన్నందున తాను అలా చేశానని బదులిచ్చారు. ‘మీరసలు బ్యాలెట్ పత్రాలను ఎందుకు పాడు చేశారు. పత్రాలపై సంతకం మాత్రం చేయడమే మీ బాధ్యత. మీరు బ్యాలెట్ పత్రాలపై ఇతర గుర్తులు వేయవచ్చని నిబంధనలలో ఎక్కడ పొందుపరిచారు’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా వైపు తిరిగి.. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను రేపు మళ్లీ ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకుంటున్నాడని సీజేఐ పేర్కొన్నారు. తాజాగా ఎన్నికలు నిర్వహించే బదులు కొత్త రిటర్నింగ్ అధికారితో ఓట్లను లెక్కించాలని తొలుత ప్రతిపాదించారు బ్యాలెట్ పత్రాలను పరిశీలించిన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. జనవరి 30న జరిగిన మేయర్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎనిమిది ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ ప్రకటించడంతో బీజేపీకి చెందిన మనోజ్ సోంకర్ చేతిలో ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్కుమార్ నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ మైనారిటీ సెల్ సభ్యుడు మిస్టర్ మసీహ్ ఉద్దేశపూర్వకంగా ఓట్లను చెల్లుబాటు చేయలేదని ఆప్ ఆరోపించింది. ఈ క్రమంలోనే రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అతడు కెమెరాను చూస్తూ కొంతమంది ఆప్ కౌన్సిలర్ల బ్యాలెట్ పత్రాలపై ఏదో రాస్తున్నట్లు కనిపిస్తుంది.దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. తొలుత ఈ పిటిషన్పై ఫిబ్రవరి 5న విచారించిన సుప్రీంకోర్టు.. అనిల్ మసీహ్ చర్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని పేర్కొంది. -
27న సింగరేణి ఎన్నికలు
శ్రీరాంపూర్ (మంచిర్యాల), గోదావరిఖని, సింగరేణి (కొత్తగూడెం): హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవా రం హైదరాబాద్లోని డిప్యూటీ సీఎల్సీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యా రు. మొత్తం 13 కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఎన్ని కల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల పర్వం, స్క్రూటి నీ పూర్తయిన విషయం తెలిసిందే. కోర్టుకు వెళ్లిన కారణంగా విడుదల చేయని ఓటరు జాబితాను కంపెనీ విడుదల చేసింది. జాబితా ప్రతుల ను రిటర్నింగ్ అధికారి కార్మిక సంఘాలకు అందజేశారు. 8న తుదిజాబితా ఈనెల 6లోగా అభ్యంతరాలు స్వీకరిస్తారు. 8న తుదిజాబితా ప్రచురించనున్నారు. బీఆర్ఎస్ అను బంధ టీబీజీకేఎస్తోపాటు ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ సహా 13 సంఘాలు బరిలో ఉంటున్నాయి. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం కోసం ఒకే ఓటు పద్ధతి అమలు చేస్తారు. ఎన్నికల నిర్వహణకు ఆరు జిల్లాల కలెక్టర్ల ద్వారా రెవెన్యూ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని కోరా రు. గుర్తులను రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు ఇప్పటికే కేటాయించారు. ఈ ఎన్నికల్లో 39748 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకో నున్నారు. శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఓటు హ క్కు వినియోగించుకుంటారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిన ఈనెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి 7గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ఐఎనీ్టయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ప్రసాద్, హెచ్ఎమ్మెస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, సీఐటీయూ కార్యదర్శి మంద నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. ఏరియాల వారీగా ఓటర్లు బెల్లంపల్లి ఏరియాలో 985 మంది ఓటర్లు, మందమర్రిలో 4876, శ్రీరాంపూర్లో 9124, కార్పొరేట్లో 1192, కొత్తగూడెంలో 2370, మణుగూరులో 2414, ఎల్లందులో 603, నైనీబ్లాక్లో 2, భూపాలపల్లిలో 5350, ఆర్జీ 1లో 5430, ఆర్జీ 2లో 3479, అడ్రియాలాలో 944, ఆర్జీ 3లో 3063 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల ఒకటి నాటికి రిటైర్డ్ అయిన వారు పోనూ మొత్తం 39748మంది ఉన్నారు. -
తెలంగాణ ఎన్నికలు.. సాయుధ బలగం ఎవరివైపో?
ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరగాలంటే రాష్ట్ర పోలీసులతో పాటు సాయుధ దళాల బందోబస్తు కూడా ఎంతో ముఖ్యం. ఆ సాయుధ బలగాల ఓట్లు కూడా అంతే ముఖ్యంగా అభ్యర్థులు భావిస్తున్నారు. అందుకే సర్విస్ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో అభ్యర్థులు వారిని ఆకర్షించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఇక ఈ ఎన్నికలలో మెజారిటీ సర్వీస్ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపిస్తారోనన్న చర్చ కూడా సాగుతోంది. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో... రాష్ట్రవ్యాప్తంగా 15,406 మంది సర్విస్ ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 930 మంది, అత్యల్పంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 98 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. గ్రామీణ నియోజకవర్గాలలో వందల సంఖ్యలో సర్విస్ ఓటర్లు ఉండగా.. అర్బన్ నియోజకవర్గాలలో 10 కంటే తక్కువ మంది ఓటర్లు ఉండటం గమనార్హం. అత్యల్ప సర్వీస్ ఓటర్లు గ్రేటర్లోనే.. హైదరాబాద్లో 404 మంది, రంగారెడ్డి జిల్లాలో 592, మేడ్చల్ జిల్లాలో 732 మంది సర్వీస్ ఓటర్లున్నారు. రాష్ట్రంలో అత్యల్ప సర్వీస్ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్లోనే ఉన్నాయి. బహదూర్పుర, చార్మినార్, మలక్పేటలో ఒక్కో నియోజకవర్గాలలో కేవలం 9 మంది సర్విస్ ఓటర్లు ఉండగా.. సనత్నగర్, గోషామహల్ సెగ్మెంట్లలో 10 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. సర్విస్ ఓటర్లు ఎవరంటే.. భారత సాయుధ దళాలు, అస్సాం రైఫిల్స్ పారామిలటరీ దళం, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీఎఫ్, జీఆర్ఈఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉద్యోగులను సర్విస్ ఓటర్లుగా పరిగణిస్తారు. వీళ్లు పోస్టల్ బ్యాలెట్ లేదా ప్రాక్సీ ఓట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఓటు ఎలా వేస్తారంటే.. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ఆఫీసర్ సర్విస్ ఓటరుకు పోస్టల్ బ్యాలెట్ పంపిస్తారు. ఒకవేళ సర్విస్ ఓటరు విదేశాల్లో ఉంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా పంపిస్తారు. ఆ పేపర్ మీద మీకు నచ్ఛిన అభ్యర్థి పేరుకు ఎదురుగా స్పష్టమైన గుర్తును ఉంచితే ఓటు వేసినట్టు. ఒకవేళ వీరు సూచించిన గుర్తు స్పష్టంగా కనిపించకపోయినా, బ్యాలెట్ పేపర్ మీద సంతకం లేదా ఏదైనా పదాలు రాసినా ఓటు చెల్లదు. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపరుతో పంపిన ‘ఏ’ గుర్తు ఉన్న చిన్న కవర్లో పెట్టి, సీల్ చేసి, రిటర్నింగ్అధికారికి పోస్టులో పంపించాలి. మహిళ సర్విస్ ఓటరైతే.. ఉద్యోగరీత్యా ప్రస్తుతం వేరే చోట నివాసం ఉంటున్నప్పటికీ సర్విస్ ఓటర్లు వారి స్థానిక నియోజకవర్గంలో ఓటు వేయవచ్చు. ఒకవేళ కుటుంబంతో సహా కలిసి పోస్టింగ్ చేస్తున్న ప్రాంతంలోనే నివసిస్తే గనక అక్కడే సాధారణ ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. అయితే సర్వీస్ ఓటర్లుగా నమోదు చేసుకునే కుటుంబ సభ్యుల అర్హత ప్రమాణాలలో ఆసక్తికరమైన అంశం ఒకటుంది. సాధారణంగా సర్విస్ ఓటరు భార్య, కుటుంబ సభ్యులు కూడా సంబంధిత నియోజకవర్గంలో సర్విస్ ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. అయితే ఒకవేళ సర్విస్ ఓటరు గనక మహిళ అయితే మాత్రం భర్తకు ఈ నిబంధన వర్తించదు. -
ఇక పక్కాగా అఫిడవిట్!
సాక్షి, హైదరాబాద్: అభ్యర్థులు తమ ఎన్నికల అఫిడవిట్లోని ప్రతికాలమ్ను ఇకపై తప్పనిసరిగా పూరించాల్సిందే. కుటుంబ సభ్యుల వివరాలు, ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర, విద్యార్హతలు తదితర వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశిత నమూనాలోని అఫిడవిట్లో పొందుపరచాల్సిందే. ఏ ఒక్క కాలమ్ను ఖాళీగా ఉంచినా సంబంధిత అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించనున్నారు. నామినేషన్ల పరిశీలనలో అభ్యర్థి తన అఫిడవిట్లో ఏదైనా కాలమ్ను ఖాళీగా ఉంచినట్టు నిర్ధారిస్తే, సదరు అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి నోటీసు జారీ చేసి ఆ కాలమ్ను నింపాలని కోరుతారు. అయినా కాలమ్ను నింపడంలో విఫలమైతే ఆ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్రాజ్ స్పష్టం చేశారు. అభ్యర్థులు నేరచరిత్రను పత్రికల్లో ప్రకటించాలి రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో అదనపు సీఈఓ లోకేష్కుమార్, పోలీసు నోడల్ అధికారి సంజయ్కుమార్ జైన్, జాయింట్ సీఈఓ సత్యవతితో కలిసి మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులు తమ నేర చరిత్రను పత్రికల్లో ప్రకటించాలని, నేర చరిత్ర గల అభ్యర్థులకు ఎందుకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది అన్న అంశంపై కారణాలు తెలుపుతూ రాజకీయ పార్టీలు సైతం పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇక ఈసీ పరిధిలోకి అధికార యంత్రాంగం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణమే రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చేశారని, వారు ఈసీకి డిప్యుటేషన్పై పనిచేస్తున్నట్టు పరిగణిస్తామని వికాస్రాజ్ స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం 6, ఓటర్ల వివరాల మార్పు కోసం ఫారం 8 దరఖాస్తుల ïస్వీకరణకు గడువు ఈ నెల 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆలోగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఓటర్లకు ఎన్నికల్లో ఓటేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలతో సోమవారం తర్వాత అందనున్న ఫారం–7 దరఖాస్తులను ఎన్నికలు ముగిసే వరకు పెండింగ్లో పెడతామని వివరించారు. వారికి ఇంటి నుంచే ఓటు హక్కు దివ్యాంగులు, 80ఏళ్లు పైబడిన ఓటర్లకు తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు వికాస్రాజ్ తెలిపారు. ఇందుకోసం ఫారం 12డీ దరఖాస్తు చేసుకోవాలని వారికి సూచించారు. పోలింగ్ కేందాల్లో టాయిలెట్లు, తాగునీరు, ర్యాంపులు, వీల్చైర్ వంటి కనీస సదుపాయాలు కల్పిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్లతో పాటు ఈవీఎం బ్యాలెట్లలో సైతం అభ్యర్థుల ఫొటోలు ముద్రిస్తున్నామని తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిశీలన కోసం తొలిసారిగా ఇంటిగ్రేటెడ్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నామని చెప్పారు. మీడియా సర్టిఫికేషన్ కమిటీ నుంచి ధ్రువీకరణ పొందిన తర్వాతే వాణిజ్య ప్రకటనలు జారీ చేయాలని రాజకీయ పార్టీలను కోరారు. లెక్కలు చూపితే నగదు విడుదల... రూ.50వేలకు పైగా నగదు తీసుకెళ్తుంటే తనిఖీల్లో జప్తు చేస్తారని, ఆ నగదుకు సంబంధించిన లెక్కలను చూపిస్తేనే విడిచి పెడ్తారని వికాస్రాజ్ తెలిపారు. రాజకీయ పార్టీలు ముందుగా సమాచారమిచ్చి నగదును తరలిస్తే వారికి అనుమతి జారీ చేస్తామని వెల్లడించారు. పక్కాగా నిబంధనలు అమలు చేయాలి రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాలను నిక్కచ్చిగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులు(డీఈఓ), జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు సీఈఓ వికాస్ రాజ్ ఆదేశించారు. రాష్ట్ర వ్యయ పరిశీలన నోడల్ అధికారి మహేశ్ భగవత్, కేంద్ర సాయుధ బలగాల నోడల్ అధికారి స్వాతి లక్రా, రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి సంజయ్కుమార్ జైన్తో కలిసి సోమవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలపాలని, వెబ్సైట్లలో సైతం ఆలస్యం చేయకుండా మార్పులు చేస్తుండాలని ఆదేశించారు. -
మునుగోడు మాజీ ఆర్వో సస్పెన్షన్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఎంవీ జగన్నాథరావును తక్ష ణమే సస్పెండ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. శుక్రవారం ఉదయం 11గంటల్లోగా సస్పెన్షన్ ఉత్తర్వులను పంపాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని కోరింది. రిటర్నింగ్ అధికారికి సరైన భద్రత కల్పించడంలో విఫలమైనందుకు గానూ స్థానిక డీఎస్పీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో యుగ తులసి పార్టీ అభ్యర్థికి కేటా యించిన రోడ్డు రోలర్ గుర్తును మార్చి బేబీ వాకర్ గుర్తును కేటాయించడా న్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తీవ్రంగా పరిగణించిన విషయం తెలి సిందే. ఈ వ్యవహారంలో బాధ్యుడైన రిటర్నింగ్ అధికారి(ఆర్వో) జగన్నాథ రావుపై వేటు వేసి ఆస్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్సింగ్ను ఆర్వో గా నియమించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థికి తిరిగి రోడ్డు రోలర్ను కేటాయించింది. తాజాగా ఈ ఉదంతంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం జగన్నాథరావును సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. (చదవండి: ఉచితాలతో ఓటర్లను ఆధారపడేలా చేయొద్దు) మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయండి భారత ఎన్నికల చరిత్రలోనే అతి ఖరీదైన ఎన్నిక మును గోడు ఉపఎన్నిక అని, అక్కడ జరుగుతున్న అక్రమాలు, డబ్బు, మద్యం పంపిణీని అరికట్టి ఉపఎన్నికను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు గోనెల ప్రకాశ్రావు వినతి పత్రాలు పంపారు. మునుగోడులో అక్టోబర్ నెలలో దాదాపు రూ.132 కోట్ల మద్యం ఏరులైపారిందని, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మునుగోడులో ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని వివరించారు. భారత రాజ్యాంగంలోని ఆరి్టకల్ 324 ప్రకారం ఎన్నికల రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘంకు ఉందని గుర్తు చేశారు. (చదవండి: మునుగోడు సైన్మా.. టక్కర్లు, ట్విస్ట్లు) -
ఏం చేస్తే.. ఏం జరుగుతుందో! మునుగోడు ఎన్నికల అధికారుల్లో వణుకు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తోంది. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతుండగా, మరోవైపు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఏ క్షణంలో ఏ పొరపాటు జరుగుతుందోనని వణుకుతున్నారు. విధి నిర్వహణలో ఏ చిన్న పొరపాటు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశం ఉండడంతో అధికారుల్లో భయం పెరిగిపోయింది. సరైన అవగాహన లేక ఇద్దరు అధికారులు చేసిన తప్పిదాలపై ఎన్నికల సంఘం తీవ్ర చర్యలు తీసుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తనకు లేని అధికారాలను ఉపయోగించి ఓ అభ్యర్థికి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును మార్చి కొత్త గుర్తును కేటాయించినందుకు గాను మునుగోడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్వో) కేవీఎం జగన్నాథరావుపై ఎన్నికల సంఘం వేటు వేసి కొత్త ఆర్వోను నియమించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జగన్నాథరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు. అలాగే ఓ అభ్యర్థికి సంబంధించిన ఓడ (షిప్) గుర్తుకి బదులు పడవ (బోటు) గుర్తును ముద్రించినందుకు గాను చౌటుప్పల్ తహసీల్దార్పై సస్పెన్షన్ వేటు విధించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మునుగోడు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులుగా బాధ్యతల స్వీకరణకు సైతం అధికారులు ఆసక్తి చూపడం లేదని పేర్కొంటున్నాయి. ఎన్నికల నిర్వహణ అంటేనే తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని కాగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సాధారణ ఎన్నికలకి మించిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని అధికారులు పేర్కొంటున్నాయి. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు సీఈఓ కార్యాలయం అధికారులకు ఫోన్ చేసి సలహాలను అడుగుతున్నారు. -
Munugode Bypoll: రోడ్డురోలర్ ఎఫెక్ట్.. ఆర్వోపై వేటు.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ/చండూరు: మునుగోడు ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి (ఆర్వో) జగన్నాథరావు యుగతులసి పార్టీ అభ్యర్థికి కేటాయించిన రోడ్డురోలర్ గుర్తును మార్చి మరో గుర్తును కేటాయించడంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా మండిపడింది. ఆర్వో తనకు లేని అధికారాలను వినియోగించారని ఆగ్ర హం వ్యక్తం చేసింది. జగన్నాథరావును ఎన్నికల విధుల నుంచి తప్పించి.. రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలను మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్కు అప్పగించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్కు రోడ్డు రోలర్ గుర్తును కేటాయించింది. ఏం జరిగింది? కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఏదైనా ఎన్నికలో తొలుత గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలకు, తర్వాత స్వతంత్ర అభ్యర్థులకు లాటరీ ద్వారా గుర్తులను కేటాయిస్తారు. ఈ క్రమంలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో ఇచ్చిన ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం ఎన్నికల సంఘం చివరిగా 2021 సెప్టెంబర్ 23న ‘ఫ్రీసింబల్స్’ జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 17న జనరల్ అబ్జర్వర్ సమక్షంలో లాటరీ ద్వారా యుగతులసి పార్టీ అభ్యర్థి కె.శివకుమార్కు రోడ్డురోలర్ గుర్తును కేటాయించారు. దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు చండూరులోని ఆర్వో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాయి. టీఆర్ఎస్ గుర్తు అయిన కారును పోలి ఉన్న రోడ్డురోలర్ను ఎలా కేటాయిస్తారని మండిపడ్డాయి. నల్లగొండలోని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నివాసం ఎదుట కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. మరోవైపు 18న విడుదల చేసిన గుర్తుల కేటాయింపు జాబితాలో రోడ్డురోలర్ గుర్తు మాయమైంది. రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు.. రోడ్డురోలర్ గుర్తును మార్చి కొత్తగా బేబీ వాకర్ గుర్తును శివకుమార్కు కేటాయించారు. అదికూడా జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లకుండా/ సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చే ముందు అభ్యర్థికి ఎలాంటి నోటీసు/సమాచారం ఇవ్వలేదు. నామినేషన్ పత్రాల్లో శివకుమార్ ఇచ్చిన ప్రాథమ్యాల్లో బేబీ వాకర్ గుర్తు లేదు. రిటర్నింగ్ అధికారి ఎన్నికల గుర్తును మార్చిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తూ.. జనరల్ అబ్జర్వర్ ఈ నెల 18న లేఖ రాశారు. శివకుమార్ కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ ఈ నెల 19న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నివేదిక తెప్పించుకుంది. సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం ‘కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్, 1961లోని నిబంధన 10(5)’ను ప్రయోగిస్తూ ఆర్వో జగన్నాథరావు ఎన్నికల గుర్తు మార్పు ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఈసీ తప్పుబట్టింది. ఒకసారి అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తులను మార్చే అధికారం కేవలం కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. తనకు లేని అధికారాలను వినియోగించి ఎన్నికల గుర్తు మార్చడానికి దారితీసిన పరిస్థితులపై సంజాయిషీ ఇవ్వాలని జగన్నాథరావును ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రెటరీ సంజయ్ కుమార్ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్కు లేఖ రాశారు. ఈ మేరకు జగన్నాథరావు పంపిన సంజాయిషీని సీఈవో కార్యాలయం గురువారం రాత్రి సీల్డ్ కవర్లో ఈసీకి పంపింది. మారిన గుర్తులతో బ్యాలెట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. సీఈవో కార్యాలయాన్నీ సంప్రదించని తీరు ఎన్నికల గుర్తు మార్పు విషయంలో ఆర్వో జగన్నాథరావు సీఈవో కార్యాలయాన్ని కూడా సంప్రదించలేదని అధికారవర్గాలు తెలిపాయి. ఈసీ ఆదేశాల మేరకు జగన్నాథరావుపై చర్యలకు అవకాశముందని పేర్కొన్నాయి. అయితే ఓ పార్టీ ఒత్తిడితోనే జగన్నాథరావు ఎన్నికల గుర్తును మార్చారని ఈసీ నిర్ధారణకు వచ్చిందని.. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈసీ నల్లగొండ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) అయిన జగన్నాథరావును తప్పించి.. ఆ స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్సింగ్ను నియమించింది. తదుపరి పోస్టింగ్ కోసం రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలని జగన్నాథరావుకు సూచించింది. గుర్తుల తొలగింపుపై టీఆర్ఎస్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈసీ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన అంబాసిడర్ కారును పోలిన ఎనిమిది ఎన్నికల చిహ్నాలు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్నాయని.. వాటిని తొలగించాలని ఆ పార్టీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కెమెరా, చపాతీ రోలర్, డోలీ (పల్లకి), రోడ్డురోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, పడవ గుర్తులు తమ పార్టీ గుర్తును పోలి ఉన్నాయని, ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ పేర్కొంది. అయితే టీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తి సజావుగా లేదని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడినట్టు సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. దీనిపై సీఈవో వికాస్రాజ్ వివరణ కోసం ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. సీరియల్ నంబర్పైనా ఫిర్యాదు ఇక బ్యాలెట్లో తమకు సీరియల్ నంబర్ కేటాయింపు విషయంలోనూ యుగతులసి పార్టీ రిటర్నింగ్ అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. బ్యాలెట్ పేపర్లో మొదట తమకు సీరియల్ నంబర్ 5ను కేటాయించినా.. తర్వాత 14వ నంబర్కు మార్చారని, దీనిని కూడా సరిదిద్దాలని కోరింది. నాకు ఉన్న అధికారాలతోనే గుర్తును మార్చాం: జగన్నాథరావు యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్కు తొలుత రోడ్డురోలర్ గుర్తు కేటాయించింది వాస్తవమేనని.. తర్వాత వచ్చిన వినతుల మేరకు తనకున్న అధికారంతో గుర్తును మార్చానని తొలగింపునకు గురైన రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు చెప్పారు. చండూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసీ నుంచి వచ్చిన తాజా ఆదేశాల మేరకు యుగతులసి పార్టీకి తిరిగి రోడ్డురోలర్ గుర్తును కేటాయించామన్నారు. యుగతులసి అభ్యర్థికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం సీరియల్ నంబర్ 14 వచ్చిందని, 5వ నంబర్ కాదని చెప్పారు. కాగా.. మునుగోడు ఉప ఎన్నిక రిటర్నింగ్ అ«ధికారిగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్సింగ్ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. -
మునుగోడు ఉపఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాజ్యంగ వ్యవస్థలను బీజేపీ ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది మరో తార్కణమన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యస్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘంపై బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమే అని కేటీఆర్ ధ్వజమెత్తారు. గతంలో తమ అభ్యర్థన మేరకు రోడ్డు రోలర్ గుర్తును తొలగించి, మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో ఆ గుర్తును తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందేందేకు బీజేపీ కుటిల ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం చర్య.. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని కేటీఆర్ అన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అఫీసర్ను బదిలీ చేస్తూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: మునుగోడు ఉపఎన్నికలో మరో ట్విస్ట్.. రిటర్నింగ్ అధికారి బదిలీ.. -
మునుగోడు ఉపఎన్నికలో మరో ట్విస్ట్.. రిటర్నింగ్ అధికారి బదిలీ..
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉపఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్నాథరావును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఎన్నికల గుర్తుల వ్యవహారంలో వివాదం నెలకొన్న తరుణంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్కు గుర్తు కేటాయింపు విషయంలో జగన్నాథరావు ఇష్టారీతిగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసీ వేగంగా చర్యలు తీసుకుంది. ఆయన స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్కు మునుగోడు ఉపఎన్నికల బాధ్యతలు అప్పగించింది. మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు ముగిసిన అక్టోబర్ 17న తనకు రోడ్ రోలర్ గుర్తు కేటాయించారని యుగతులసి అభ్యర్థి శివకుమార్ తెలిపారు. అయితే అక్టోబర్ 18న విడుదలైన జాబితాలో మాత్రం బేబీ వాల్కర్ గుర్తు ఇచ్చారని పేర్కొన్నారు. తమ కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్, క్యాప్, చపాతి రోలర్ వంటి గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ పార్టీ 17వ తేదీ రాత్రి ఆందోళన చేసింది. దీంతో తెల్లారేసరికి గుర్తులు మారిపోయాయని, దీనిపై వివరణ కోసం తాను ఎన్నికల రిటర్నింగ్ అధికారిని సంప్రదించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని శివకుమార్ ఎన్నికల సంఘానికి బుధవారం ఫిర్యాదు చేశారు. ఆ మరునాడే రిటర్నింగ్ అధికారిని బదిలీ చేస్తూ కేంద్రం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. శివకుమార్కు రోడ్డురోలర్ గుర్తునే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: మునుగోడులో గుర్తుల కేటాయింపుపై సీఈసీ సీరియస్.. అంతా మీ ఇష్టమా? -
మునుగోడులో గుర్తుల కేటాయింపుపై సీఈసీ సీరియస్.. అంతా మీ ఇష్టమా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తులపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే గుర్తుల విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ ఎన్నికల్లో గుర్తుల విషయంలో తుది నిర్ణయం ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేసింది. కాగా, తాజాగా ఎన్నికల గుర్తు రోడ్ రోలర్ విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి సీఈసీ లేఖ రాసింది. అయితే, మునుగోడు ఉప ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తు మార్చడంపై ఈసీ సీరియస్ అయ్యింది. రోడ్ రోలర్ గుర్తును ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని సీఈసీ కోరింది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గుర్తుల కేటాయింపులో నిబంధనలు పాటించలేదని గుర్తించినట్టు సీఈసీ పేర్కొంది. ఇక, మునుగోడులో యుగ తులసీ పార్టీ అభ్యర్థి శివకుమార్కు రోడ్ రోలర్ గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే. -
మునుగోడు ఉపఎన్నికలో రోడ్ రోలర్ గుర్తు మార్చడంపై ఈసీ సీరియస్
-
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు.. నామినేషన్లో రెండో భార్య పేరు, దాంతో
అమేథీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. అమేథీ బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్పై ఆయన మొదటి భార్య, ఆ పార్టికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గరిమా సింగ్ బుధవారం రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు! ఏమనో తెలుసా? ఎన్నికల అఫిడవిట్లో భార్యగా తన పేరు రాయలేదని! రెండో భార్య అమితా సింగ్ పేరు రాశారని! దీనిపై ఆర్వోకు రాతపూర్వకంగా అభ్యంతరం వెలిబుచ్చినట్టు చెప్పారామె. తన హక్కు కోసం పోరాడేందుకే భర్తపై ఫిర్యాదు చేశానన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తారా అని అడగ్గా, ‘‘ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కానీ పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటా’’ అని చెప్పారు. సంజయ్సింగ్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. అమేథీ టికెట్ కోసం ఆయన భార్యలిద్దరూ పోటీ పడగా వారిని కాదని సంజయ్కి పార్టీ అవకాశమిచ్చింది. -
హుజూరాబాద్లో ప్రజాస్వామ్యం ఖూనీ!
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో నామినేషన్లు వేయకుండా రిటర్నింగ్ అధికారి అడ్డుకుంటున్నారని.. ఆ అధికారిని వెంటనే తొలగించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె గురువారం తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయెల్ను కలిసి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారి సీఎం కేసీఆర్కు అమ్ముడుపోయారని ఆరోపించారు. ఈ క్రమంలోనే రకరకాల కారణాలు చూపుతూ.. నామినేషన్లు వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నామినేషన్ల కోసం రోజుకో రూల్ పెడుతున్నారని ఆక్షేపించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు వేయడానికి వస్తే తిప్పిపంపేస్తున్నారన్నారు. నామినేషన్ల గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరారు. ఈ మొత్తం వ్యవహారం మీద కోర్టుకు వెళ్తామన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం దారుణం పోలీసులు సీఎం కేసీఆర్కు తొత్తులుగా మారారని ఆరోపించారు. హుజూరాబాద్లో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం దారుణమన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
తొలి రోజు మూడు నామినేషన్ల దాఖలు
సాక్షి , కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల సంగ్రామంలో ప్రథమ ఘట్టం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు మూడు నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి సీహెచ్ రవీందర్రెడ్డి తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజునే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్సూరి అలీ నామినేషన్ వేశారు. మరో స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ నామినేషన్ను పలు సాంకేతిక కారణాలతో అధికారులు స్వీకరించలేదు. కాగా.. నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వంద మీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తల్లిదండ్రుల దీవెనలు.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఆశీర్వదించి బీఫారం అందించగా, శ్రీనివాస్ శుక్రవారం ఉదయం కొమురెల్లి మల్లిఖార్జునస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి కమలాపూర్ మండలం ఉప్పల్ చేరుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా 12.40 నిమిషాలకు మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి హుజూరాబాద్లోని ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే గెల్లు శ్రీనివాస్ తల్లిదండ్రుల మల్లయ్య, లక్ష్మి దీవెనలు తీసుకోగా, భార్య శ్వేత శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి 12.55 నిమిషాలకు మొదటి సెట్, 01.16 నిమిషాలకు రెండో సెట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మొదటి నామినేషన్ను మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ప్రతిపాదించగా, రెండో సెట్కు జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ప్రతిపాదించారు. కోడ్ హుజూరాబాద్కే పరిమితం.. హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఆ నియోజకవర్గానికే అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కరీంనగర్, వరంగల్ (హనుమకొండ) నగరపాలక సంస్థలకు వర్తించదని ప్రకటనలో స్పష్టంచేశారు. నామినేషన్ ప్రక్రియ పరిశీలన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ఎన్నికల అధి కారి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నా మినేషన్ల స్వీకరణ సమయంలో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. తుపాకులు వెనక్కివ్వాలని.. కోడ్ వెలువడిన నేపథ్యంలో పోలీసు అధికారులు లైసెన్స్డ్ తుపాకులను సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అనేక మంది తమకు ప్రాణహాని ఉందని వెపన్స్ను తమతోపాటే ఉంచుకుంటామని పోలీసులకు విజ్ఞప్తులు చేశారు. కానీ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరికీ మినహాయింపులు లేవని కరాఖండిగా చెప్పిన పోలీసులు మొత్తానికి దాదాపు 40 మందికిపైగా వ్యక్తుల నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రానికి కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్నికల కోడ్ పరిధిని హుజూరాబాద్కే పరిమితం చేస్తూ ప్రకటన రావడంతో మానకొండూరు, కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లోని పలువురు ప్రముఖులు పోలీస్స్టేషన్లకు పరుగులు తీశారు. చెక్ పోస్ట్ తనిఖీ.. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వరంగల్, హుజూరాబాద్ మధ్యలో స్టాటిక్ సర్వలెన్స్ టీమ్తో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తనిఖీ చేశారు. శుక్రవారం వరంగల్ నుండి హుజూరాబాద్ వచ్చే ప్రధాన రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ను ఎక్స్పెండేచర్ అబ్జర్వర్ జి.ఎలమురుగుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ద్వారా వచ్చే ప్రతీ వాహనాన్ని చెక్ పోస్టు వద్ద తనిఖీ చేయాలని స్టాటిక్ సర్వలెన్స్ టీమ్ను ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా అక్రమంగా డబ్బులు, మద్యం రవాణా చేసే అవకాశం ఉందని, 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చదవండి: BJP: వ్యూహాలు సిద్ధం.. హుజూరాబాద్లో గెలవాల్సిందే.. -
విశాఖలో తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధం
సాక్షి, విశాఖ: జిల్లాలో తొలి విడత ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్టు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినయ్ చంద్ వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాకు సంబంధించి మొత్తం నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయని, అందులో తొలి విడతగా అనకాపల్లి డివిజన్లోని 344 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తొలి విడతలో మొత్తం 9608 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు, అందుకు కావాల్సిన 8122 బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. అనకాపల్లి డివిజన్ లో మొత్తం 240 సమస్యాత్మక కేంద్రాల గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 29 నుంచి 31 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుందని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమీషనర్తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఉన్నతాధికారులతో కలిసి తాను కూడా పాల్గొన్నానని వివరించారు. ఇదిలా ఉండగా జిల్లాలో తొలి విడత ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీలో జోష్ కనిపిస్తుంది. అనకాపల్లి డివిజన్కు సంబంధించి మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో టీడీపీ పోటీ నామమాత్రమే అని తెలుస్తోంది. ఏకగ్రీవాలకు ప్రభుత్వం నజరానాలు ప్రకటించిన నేపథ్యంలో చాలా చోట్ల ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్ధులను గెలిపిస్తాయని పార్టీ అధిష్టానం ధీమా వ్యక్తం చేస్తుంది. -
ధ్రువీకరణ పత్రం అందుకున్న మాణిక్య వరప్రసాద్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన మాజీ మంత్రి డొక్కా మణిక్య వరప్రసాద్ సోమవారం ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఇటీవల శాసనసభ్యుల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో మాణిక్య వరప్రసాద్ ఒక్కరే నామిషన్ దాఖలు చేశారు. నేడు నామినేషన్ ఉప సంహరణ గడువు పూర్తికావడంతో ఆయన గెలిచినట్టు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. దీంతో శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సభ్యుల సంఖ్య 10కి చేరింది. కాగా, శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉండటంతో మాణిక్య వరప్రసాద్ ఎన్నిక లాంచనమైన సంగతి తెలిసిందే. -
కౌంటడౌన్కు వేళాయేరా ..!
సాక్షి, అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరో 24 గంటల సమయమే ఉంది. ఫలితాలపై అభ్యర్థులతోపాటు జిల్లా ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ జిల్లాలో ఎన్నికల వేడిని మరింత పెంచాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, శ్రేణులు గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఎగ్జిట్పోల్స్ తమకు అనుకూలంగా లేకపోవడంతో కౌంటింగ్కు ముందే టీటీపీ అభ్యర్థులు డీలాపడ్డారు. జిల్లాలో ఒక్క సీటు కూడా తమకు వచ్చే పరిస్థితి లేదని తేలడంతో జనసేన పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. మరోవైపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నల్లపాడు లయోలా హైస్కూల్లో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి మరో 24 గంటల గడువే ఉంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ ముగిసింది. పోలింగ్కు, కౌంటింగ్కు మధ్య 40 రోజులకు పైగా గడువు ఉండటంతో ఎన్నికల ఫలితాలపై ఇటు అభ్యర్థులు, అటు జిల్లా ప్రజలు తీవ్ర ఉత్కంఠ అనుభవించారు. రకరకాల సర్వేలు, అంచనాలతోసతమతమయ్యారు. ఎవరికి వారే గెలుపు తమదంటే తమదంటూ ప్రకటనలు గుప్పించారు. పోలింగ్ ముందు నుంచి, అనంతరం గెలుపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ధీమాగానే ఉన్నారు. వారిని ధీమాకు తగ్గట్టే ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో పలు జాతీయ సర్వే సంస్థలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పాయి. ఓటమిని ముందే ఉహించిన టీడీపీ అభ్యర్థులు ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే ఉద్దేశంతో విచ్చల విడిగా డబ్బు, మద్యం పంచి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలకు పసుపు–కుంకుమ అంటూ రూ.10 వేలు వారి ఖాతాల్లో జమ చేయడంతోపాటు, పింఛన్ల పెంపు పేరిట ఓటర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పోలింగ్ ముగిశాక ఓటింగ్ సరళిని పరి శీలించిన టీడీపీ అభ్యర్థులు తమకు వ్యతిరేకంగానే ప్రజలు ఓట్లు వేశారనే అంచనాకు వచ్చారు. ప్రధానంగా టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, టీడీపీ నేతల అవినీతి, దౌర్జన్యాలు, జన్మభూమి కమిటీల అరాచకాలు, మట్టి, ఇసుక మాఫియా దారుణాలు ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపును దెబ్బతీశాయనే భావనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర, ప్రత్యేక హోదాపై చేసిన పోరా టాలు, ఆయన ప్రకటించిన నవరత్నాల వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయి. లగడపాటి సర్వేపై అనుమానాలు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్ల డించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై అనుమానం ఉన్నట్లు టీడీపీ శ్రేణులే పేర్కొంటున్నాయి. దీంతో ఓట్ల లెక్కింపునకు ముందే టీడీపీ అభ్యర్థులు డీలా పడ్డారు. పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఓటమి తప్పదనే అంచనాకు వచ్చిన టీడీపీ నాయకులు ఈవీఎంలు, ఎన్నికల కమి షన్పై ఆరోపణలు చేస్తూ నానాయాగీ సృష్టిస్తున్నారు. లగడపాటితో పాటు, కొన్ని సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ శ్రేణులు నమ్మడంలేదు. కౌటింగ్కు ముందే తమ అభ్యర్థులు చేతులు ఎత్తేయకుండా టీడీపీ అధిష్టానమే కొన్ని సర్వేలు తమకు అనుకూలంగా ఉండేలా చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసినా ఓటమి తప్పదనే భావన టీడీపీ అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. జిల్లాలో జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని తేలడంతో ఆ పార్టీ శ్రేణులను నైరాశ్యం ఆవహించింది. తుది దశకు చేరిన కౌంటింగ్ ఏర్పాట్లు గురువారం జరిగే కౌంటింగ్ సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నల్లపాడులయోలా హైస్కూల్లో ఏర్పాట్లు పూర్త య్యాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర కోన శశిధర్ ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల్లో బుధవారం మాక్ కౌంటింగ్ నిర్వహిస్తారు. బుధవారం సాయంత్రం నుంచే కౌటింగ్ కేంద్రాల వద్ద పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రౌండ్లో సువిధ యాప్ ద్వారా ఫలితాలు వెల్లడిం చేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. సువిధ యాప్లో ఫలి తాలు నమోదుపై ఆర్వోలకు మంగళవారం అవగాహన కల్పించారు. బుధవారం సాయంత్రానికే కౌంటింగ్ ఏజెంట్లు గుంటూరు నగరానికి చేరుకొనేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఫలితాలపై అభ్యర్థులతో పాటు, వారి గెలుపు, ఓటములపై పందెలు కాసిన బెట్టింగ్ రాయుళ్లు నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
కాకినాడ సిటీ: ఈ నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాలతో పాటు, జిల్లాలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం లేకుండా పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో శనివారం పోలీసు సూపరింటెండెంట్లు, రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌంటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అంతర వలయంలో సీఆర్పీఎఫ్ దళాలు, మధ్య వలయంలో ఏపీఎస్పీ దళాలు, బాహ్య వలయంలో స్థానిక పోలీస్ దళాలను మోహరించాలని సూచించారు. అభ్యర్థులు ప్రతిపాదించిన కౌంటింగ్ ఏజెంట్ల ప్రవర్తన, నేర చరిత్రలను పోలీసు శాఖ పరిశీలించి నివేదికను ఆర్వోలకు అందజేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజున గుంపులు, సమూహాలు ఉత్సాహం, నైరాశ్యాలకు లోనై ఎవరూ శాంతిభద్రతలకు కలిగించకుండా కౌంటింగ్ కేంద్రాలతోపాటు అన్ని మండల కేంద్రాల్లో 144 సెక్షన్ విధించాలని ఆదేశించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లతో రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలు వారి వారి నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించేలా కోరాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన తరువాత ఆర్వోలు, డీఎస్పీలు ఈవీఎంలను గోడౌన్కు, స్టాట్యుటరీ పత్రాల ట్రంక్ బాక్సులను కలెక్టరేట్కు సురక్షితంగా తరలించి భద్రపరచాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ విశాల్ గున్ని, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షిమోషి బాజ్పాయ్ మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా 911 మంది పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. కౌంటింగ్ రోజున అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా వ్యాప్తంగా తగిన ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. కలెక్టర్ సూచనల మేరకు జేఎన్టీయూకేలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద మరో 150 నుంచి 200 మంది అదనపు సిబ్బందిని నియమిస్తామని చెప్పా రు. జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున, రంపచోడవ రం ఐటీడీఏ పీవో నిషాంత్ కుమార్, సబ్ కలెక్టర్లు సా యికాంత్ వర్మ, వినోద్కుమార్, చింతూరు ఐటీడీఏ పీవో అభిషిక్త కిషోర్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ సుమీత్కుమార్ గాంధీ, డీఆర్వో ఎం వీ గోవిందరాజులు, సీఆర్పీఎఫ్ దళాల ఇన్చార్జి ము రళీ, రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలు పాల్గొన్నారు. -
12మంది ఉద్యోగులపై ఈసీ క్రమశిక్షణ చర్యలు
-
12మంది ఉద్యోగులపై ఈసీ క్రమశిక్షణ చర్యలు
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన 12 మంది ఉద్యోగులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. విశాఖపట్నం జిల్లా మండపేట, నెల్లూరు జిల్లా కోవూరు, సుళ్లురుపేట, నూజీవీడుల ఆర్వో, ఏఆర్వోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగాను అభియోగాల నమోదుతో పాటు, శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. కాగా, ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్వోలపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మరికొంత మంది అధికారులపై కూడా ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
దొరికిన వీవీ ప్యాట్ స్లిప్పులు.. కలకలం!
సాక్షి, నెల్లూరు : ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో ఈవీంఎలకు అమర్చిన వీవీ ప్యాట్ స్లిప్పులు దొరకడం కలకలం రేపింది. ఎన్నికల్లో ఏ పార్టీ గుర్తుకు ఓటు వేశారో ఓటరకు తెలిపేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మేషిన్ల (ఈవీఎంల)కు వీవీ ప్యాట్లు అమర్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో దాదాపు 200 వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికాయి. ఈ స్లిప్పులను ఆత్మకూరు రిటర్నింగ్ అధికారి సోమవారం పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల వినియోగానికి సంబంధించిన శిక్షణ ఇచ్చినప్పుడు వాడిన స్లిప్పులు ఇవని రిటర్నింగ్ అధికారి తెలిపారు. నిబంధనల ప్రకారం శిక్షణ ఇచ్చినప్పుడు వాడిన వీవీ ప్యాట్ స్లిప్పులను కూడా భద్రపరచాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికిన ఘటనపై అధికారులను వివరణ కోరతామని కలెక్టర్ స్పష్టం చేశారు. -
50 లక్షల సిబ్బంది, 50 వేల కోట్ల ఖర్చు
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలు వచ్చాయంటే మూడు నెలల పాటు సందడే సందడి. సభలు సమావేశాలతో రాజకీయ నాయకులు ఓ పక్క హోరెత్తిస్తుంటే, మరో పక్క మాకేం ఇచ్చావ్? మాకేం ఇస్తాం! అంటూ నిలదీసే ప్రజలు. ఓటర్లను ఆకర్షించడం కోసం ఎన్నికల ప్రచారంలో విందులు, వినోదాలు కూడా చోటు చేసుకోవడంతో ఎన్నికలకు ఓట్ల పండుగ అని కూడా పేరొచ్చింది. సహజంగా ఎన్నికలు వచ్చాయంటే ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు? ఎవరు గెలిచే అవకాశం ఉంది ? ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు ? ఎందుకు? అన్న సమాచారం, విశ్లేషణల వరకే చాలా మంది ఓటర్లము పరిమితం అవుతాం. కానీ ఇంత పెద్ద క్రతువు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎంత పెద్ద కసరత్తు చేస్తుంది ? దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్లో ఎంత మంది సిబ్బంది పని చేస్తున్నారు ? శాశ్వతంగా ఉండే సిబ్బంది ఎంత ? ఎన్నికలకు ఏడాది ముందు వచ్చి తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసే ఉద్యోగులు ఎంత ? మూడు నెలల ముందుగా వచ్చి చేరే ఉద్యోగులు ఎంత మంది ? కేవలం మూడు రోజుల ముందుగానే ఎన్నికల విధుల్లో చేరి పోలింగ్ నిర్వహించే వారు ఎంత మంది ? వారు ఎక్కడ నుంచి వస్తారు ? ఎన్నికల నిఘా విభాగంలో ఎంత మంది పనిచేస్తారు ? వారు ఎక్కడి నుంచి వస్తారు. ? సిక్యూరిటీకి ఎన్ని బటాలియన్ల సైనికులు కావాలి ? దాదాపు ఎన్నికల నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుంది ? తెలుసుకోవాలంటే ఇవన్నీ ఆసక్తికరమైన అంశాలే. ఎన్నికల ప్రక్రియ మూడు నెలలు కేంద్ర ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికలు నిర్వహించాలంటే దాదాపు 45 రోజుల నుంచి 90 రోజుల సమయాన్ని తీసుకుంటుంది. ఈసారి దేశంలో 90 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. వారి కోసం దేశవ్యాప్తంగా 10,35,918 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో దాదాపు 400 మంది అధికారులు ఉన్నారు. రాష్ట్రాల స్థాయిలో ప్రధాన ఎన్నికల అధికారులు ఉంటారు. వారికి ఆ రాష్ట్రంలోని నియోజకవర్గాల సంఖ్యను బట్టి అదనంగా సిబ్బంది ఉంటారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా’లో ఓ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్లు ఉంటారు. సీనియర్ బ్యూరోక్రట్లనే ఈ పదవుల్లో నియమిస్తారు. వారికో సెక్రటేరియట్ ఉంటుంది. అందులో నేరుగా కమిషన్ నియమించుకున్న ఉద్యోగులు ఉంటారు. ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి బదిలీ ద్వారా తెచ్చుకున్న వారు ఉంటారు. కమిషనర్లు ఎన్నికల షెడ్యూల్ను ఖరారు చేయడంతోపాటు వివిధ పార్టీలతో చర్చలు జరిపి ఎన్నికల కోడ్ను నిర్ణయిస్తారు. దేశవ్యాప్తంగా ఓటర్ల నమోదు, వారి ఫిర్యాదుల నుంచి మొత్తం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్ జనరల్ అబ్జర్వర్లను, ఎక్స్పెండీచర్ అబ్జర్లర్లను డిప్యూటీ చేయడంతోపాటు రాష్ట్రాలకు పోలీసు అబ్జర్వర్లను నియమిస్తుంది. అభ్యర్థుల ఖర్చును పర్యవేక్షించే కమిటీలను ఏర్పాటు చేస్తుంది. దేశంలోని 543 లోక్సభ స్థానాలకు ఎన్నికల కోడ్ పర్యవేక్షక సిబ్బంది కూడా నియమిస్తుంది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కేంద్ర ఎన్నికల కమిషన్కు రాష్ట్రాల స్థాయిలో ప్రధాన ఎన్నికల అధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్) ప్రాతినిధ్యం వహిస్తారు. ఆ పదవిలో సీనియర్ బ్యూరోక్రట్ను నియమిస్తారు. ఆయన కింద పలువురు ప్రత్యేక, డిప్యూటీ ఎన్నికల అధికారులు ఉంటారు. వారు డిప్యూటేషన్పై నోడల్ అధికారులను తెచ్చుకుంటారు. వారు ఓటర్ల నమోదు, ఫిర్యాదుల వ్యవహారాలను చూడడమే కాకుండా రాజకీయ పార్టీలకు ఎన్నికల పట్ల అవగాహన కల్పిస్తారు. ఎన్నికల ప్రచార సామాగ్రిని అనుమతించడం దగ్గరి నుంచి ఎన్నికల కోడ్, మీడియా పర్యవేక్షణ చూస్తారు. ఈ నోడల్ ఆఫీసర్లను ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం కంటే ముందే వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యూటేషన్పై తెప్పిస్తారు. ఇక్కడ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వేరు, స్టేట్ ఎన్నికల కమిషన్ వేరు. రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే స్టేట్ ఎన్నికల కమిషన్లు స్థానిక ఎన్నికల నిర్వహణకే పరిమితం అవుతాయి. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారి సాధారణంగా జిల్లా మేజిస్ట్రేట్ లేదా కలెక్టర్ వ్యవహరిస్తారు. తన జిల్లా పరిధిలో పోలింగ్ బూత్లను గుర్తించి అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయడంతోపాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వాహనాలను, ఓటర్లను తరలించడానికి వీల్ చైర్లను, అంబులెన్స్లను ఏర్పాటు చేయడం లాంటి చర్యలు తీసుకుంటారు. రిటర్నింగ్ అధికారి రిటర్నింగ్ అధికారిగా కూడా సాధారణంగా కలెక్టరే వ్యవహరిస్తారు. అయితే ఆయన పార్లమెంటరీ నియోజకవర్గం లేదా అసెంబ్లీ ఎన్నికలకు బాధ్యత వహిస్తారు. అర్హులైన ఓటర్ల జాబితాను ప్రకటించడం నుంచి అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించడం, వాటిని స్క్రూటినీ చేయడం సహా కౌంటింగ్ వరకు అన్ని వ్యవహారాలకు బాధ్యత వహిస్తారు. ఓ పార్లమెంట్ నియోజకం పరిధిలో పలువురు జిల్లా ఎన్నికల అధికారులు ఉండవచ్చుగానీ రిటర్నింగ్ అధికారి మాత్రం ఒక్కరే ఉంటారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఈ బాధ్యతలను సబ్ డివిజనల్ అధికారి లేదా అదనపు మేజిస్ట్రేట్ నిర్వహిస్తారు. అవసరాన్ని బట్టి వీరికి రిటర్నింగ్ అధికారి విధులను, బాధ్యతలను అప్పగిస్తారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి అడిషనల్ లేదా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఉంటారు. ఓటర్ల జాబితాలను రూపొందించడం ఆయన బాధ్యత. అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా స్థానిక తహసిల్దార్ వ్యవహరిస్తారు. ఓటర్ల నమోదు కార్యక్రమం విషయంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి సహకరిస్తారు. వీరు ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి ఒకరు చొప్పున ఉంటారు. ఢిల్లీలో శాశ్వత ప్రాతిపదికపై ఎన్నికల విధులను నిర్వర్తించే వీరు రాష్ట్రాల్లో తాత్కాలిక ప్రాతిపదికపైనే ఎన్నికల విధులు నిర్వర్తిస్తారు. కోడ్ ఉల్లంఘనల పర్యవేక్షణ కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన అన్ని రకాల పర్యవేక్షణా వ్యవస్థలు ‘రిటర్నింగ్ అధికారి’ పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. ఇక్కడ పనిచేసే అధికారులకు రాష్ట్ర, కేంద్ర సిబ్బందితో కూడిన కంట్రోల్ రూమ్లు ఉంటాయి. కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు ఉల్లంఘనలపై చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఓటర్ల నుంచి ఎప్పటికప్పుడు ఫిర్యాదలను స్వీకరించేందుకు ఈసారి ‘మొబైల్ యాప్’ను కూడా ప్రవేశపెట్టారు. జనరల్ పరిశీలకులు ఎన్నికల జనరల్ పరిశీలకులుగా ప్రతి అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజక వర్గానికి ఒకరు ఉంటారు. ఈహోదాలో సీనియర్ బ్యూరోక్రట్నుగానీ, సీనియర్ పోలీసు అధికారినిగానీ నియమిస్తారు. సాధరణంగా వీరిని ఇతర రాష్ట్రాల నుంచి డిప్యూటీపై తెచ్చుకుంటారు. వీరి కింద ఎక్స్పెండీచర్ పరిశీలకులు ఉంటారు. ఎన్నికల కోడ్తోపాటు అభ్యర్థుల ఎన్నికల ఖర్చును పరిశీలించేందుకు ఫ్లైయింగ్ స్కాడ్లు, పర్యవేక్షక కమిటీలు, ప్రత్యక్ష ఖర్చు పరిశీలకు, వీడియో నిఘా కమిటీలు విడి విడిగా పనిచేస్తూ రిటర్నింగ్ అధికారికి జవాబుదారిగా ఉంటాయి. ఇక మైక్రో పరిశీలకులను వారం రోజుల ముందు తీసుకుంటారు. 2014 ఎన్నికల సందర్భంగా 1,51,417 మంది మైక్రో పరిశీలకులను నియమించారు. పోలింగ్ సిబ్బంది ప్రతి పోలింగ్ బూత్లో పనిచేసే పోలింగ్ సిబ్బందిని కేవలం మూడు రోజులు ముందుగా తీసుకుంటారు. వారంతా విధిగా ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారు. స్కూల్ టీచర్లు, జూనియర్ ఇంజనీర్లు, ఆ సమానమైన హోదా కలిగిన ఇతర ప్రభుత్వ సిబ్బందిని తీసుకుంటారు. వారికి హెల్పర్గా ఫోర్త్క్లాస్ ఉద్యోగి ఉంటారు. సాధారణంగా ఐదుగురు ఉండే ఈ బృందంలో టీచర్లనే పోలింగ్ అధికారులుగా నియమిస్తారు. సెక్టార్ అధికారులు ప్రతి పది నుంచి 15 పోలింగ్ బూత్లను పర్యవేక్షించేందుకు సెక్టార్ అధికారులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను నియమిస్తారు. రన్నర్లు కూడా ఉంటారు ఎన్నికల కమిషన్ శాశ్వత ప్రాతిపదికన లేదా తాత్కాలిక ప్రాతిపదికన ఎన్నికల విధుల్లో పనిచేస్తున్న ప్రతి అధికారి పేరు, ఫోన్ నెంబర్ను ముందుగానే వెల్లడిస్తుంది. సమాచార వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు అంటే, మొబైల్, ల్యాండ్లైన్ ఫోన్లు పనిచేనప్పుడు ఒక చోటు నుంచి మరోచోటుకు సమాచారాన్ని చేరవేసేందుకు ‘రన్నర్ల’ను నియమిస్తుంది. 2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ 3,81,572 మంది రన్నర్లను నియమించింది. ఎన్నికల సందర్భంగా శాశ్వత, తాత్కాలిక సిబ్బంది సహా దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తారు. భద్రతా సిబ్బంది 2014లో జరిగిన ఎన్నికల భద్రత కోసం 1155 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను నియమించారు. వారి రవాణా కోసం 234 ప్రత్యేక రైళ్లును నడిపారు. గతంకన్నా ఈసారి ఎక్కువ బలగాలు అవసరం అవుతాయని అంచనా వేశారు. 2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిర్వహణ కు దాదాపు 42 వేల కోట్ల రూపాయలు ఖర్చుకాగా, ఈసారి ఎన్నికలకు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అమెరికా సెనేట్, అధ్యక్ష ఎన్నికల ఖర్చును దాటిపోతోందని విమర్శిస్తున్న వారు ఉన్నారు. -
వివాదస్పదంగా రిటర్నింగ్ అధికారి నిర్ణయం
సాక్షి, కృష్ణా : నామినేషన్ల పరిశీలన సందర్భంగా కృష్ణాజిల్లా మైలవరంలో హైడ్రామా నెలకొంది. నిబంధనల ప్రకారం ఒకరి నామినేషన్ను రద్దు చేయాల్సింది ఉండగా మరొకరి నామినేషన్ రద్దు చేశారు రిటర్నింగ్ అధికారి. వివరాల్లోకి వెళితే.. ప్రజాశాంతి పార్టీ తరపున మైలవరంలో షేక్ షరీఫ్, బోగోలు వెంకట కృష్ణారావు నామినేషన్లు దాఖలు చేశారు. తరువాత బోగోలు వెంకట కృష్ణారావు బీఫారం రద్దుచేస్తూ షరీఫ్కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అధికారిక లేఖను ఇచ్చారు. ఈ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి షరీప్ సమర్పించారు. నిబంధనల ప్రకారం వెంకటకృష్ణారావు భీఫారంను రద్దుచేయాల్సిన రిటర్నింగ్ అధికారి.. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిళ్లతో షరిఫ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు. వెంకట కృష్ణారావు బీ ఫారంని కొనసాగించాలంటూ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిడితో షరీఫ్ను భీఫారంను రద్దు చేసినట్లు సమాచారం. మొదట ఎలాంటి నిర్ణయం తీసుకొని సదరు అధికారి.. బయటకు వెళ్లిపోయి కాసేపటికి తిరిగి వచ్చి వెంకట కృష్ణారావును ప్రజాశాంతి అభ్యర్థిగా గుర్తించినట్లు ప్రకటించారు. దీంతో షరీఫ్ వర్గీయులు ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ అధికారి వైఖరిని నిరసిస్తూ ఎండీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మంత్రి దేవినేని ఆదేశాలతోనే రిటర్నింగ్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. కాగా ఓట్లను చీల్చేందుకై వైఎస్సార్సీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లున్న వ్యక్తులను ప్రజాశాంతి పార్టీ తమ అభ్యర్థులుగా పోటీలోకి దించిన విషయం తెలిసిందే. నామినేషన్ల పర్వం చివరి రోజున ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఇలాంటి తిరకాసుకు పాల్పడ్డారు. మైలవరంలో కూడా వెస్సార్సీపీ అభ్యర్థి వెంకటకృష్ణ ప్రసాద్ పేరును పోలీఉన్న వ్యక్తి వెంకట కృష్ణారావుతో నామినేషన్ వేయించారు. ఈ తతంగం చూస్తే తెలుగుదేశం పార్టీ, ప్రజాశాంతి పార్టీల మధ్య అంతర్గత బంధం ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ గుర్తును తీసుకుంది. హెలికాప్టర్ రెక్కలు వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తును పోలి ఉన్నాయి. ఇక ఆ పార్టీ జెండా రంగుల విషయానికొస్తే వైఎస్సార్సీపీ జెండా రంగులను పోలి ఉండటం గమనార్హం. -
నేటి నుంచి నామినేషన్ల పర్వం
సాక్షి, నల్లగొండ : లోక్సభ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం సోమవారం ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసి ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తిచేసింది. అదే విధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సిబ్బంది నియామకం, శిక్షణ, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, తదితర అవసరమైన అన్ని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా మొదలైంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ చేసినప్పటి నుంచి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 26వ తేదీన నామినేషన్ల స్క్రూట్నీ జరగనుంది. 27, 28 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఉపసంహరణ అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు. కలెక్టరే రిటర్నింగ్ అధికారి.. కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ నల్లగొండ పార్లమెంట్కు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ఆయనే పార్లమెంట్కు సంబంధించి అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సహాయ రిటర్నింగ్ అధికారిని కూడా నియమించారు. వారు అక్కడ ఎన్నికల విధులను నిర్వహించనున్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ రిటర్నింగ్ అధికా రిగా నామినేషన్లను స్వీకరిస్తారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్ 11న పోలింగ్.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా మొదటి విడత తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. అయితే ఓట్లు లెక్కింపు మాత్రం దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఉటుంది. పోలింగ్ జరిగిన తర్వాత ఏడు నియోజకవర్గాల పరిధిలోని ఈవీఎంలన్నింటినీ నల్లగొండలోని దుప్పలపల్లి వద్దగల ఎఫ్సీఐ గోదాములోనే భద్రపర్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దుప్పలపల్లి గోదాముల్లో ఏర్పాట్లు మొదటి విడత పార్లమెంట్ ఎన్నికలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపర్చి మే 23వ తేదీన దేశవ్యాప్తంగా ఒకేసారి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అయితే నల్లగొండ పార్లమెంట్కు సంబంధించి ఓట్ల లెక్కింపును కూడా దుప్పలపల్లి ఎఫ్సీఐ గోదాములోనే చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పేర్కొన్నారు. ప్రధాన పార్టీల్లో ఖరారు కాని అభ్యర్థులు.. నల్లగొండ పార్లమెంట్కు సంబంధించి ప్రధాన పార్టీ అభ్యర్థుల ఖరారు ఇంకా పూర్తికాలేదు. ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పార్టీలోని అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొనసాగుతుంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నందున ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేయడం మాత్రం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. -
ఎన్నికల ప్రచార వ్యయం రూ.70లక్షలు
సాక్షి, హన్మకొండ అర్బన్: లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయం గరిష్టంగా రూ.70 లక్షలుగా ఎన్నికల సంఘం నిర్ణయించిందని కలెక్టర్, వరంగల్ పార్లమెంట్ ఆర్ఓ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఎన్నికల బృందాలతో నిర్వహించిన సమీక్ష సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల విషయంలో ఉద్యోగులు నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. శాఖాపరమైన పనుల పేరుతో ఎన్నికల విధులు విస్మరిస్తే సహించేదిలేదని, అలాంటి వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. సస్పెన్షన్కు గురైన వారు తిరిగి విధుల్లో చేరడం కష్టమని చెప్పారు. సమయ వ్యయ పరిశీలకుల సమన్వయంతో అధికారులు పనిచేయాలని సూచించారు. జేసీ దయానంద్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుని మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రచార సామగ్రి ధరలు ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. ప్రచారం విషయంలో నిఘా బృందాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశం వీడియో చిత్రీకరించి ప్రచార ఖర్చుల నివేదికలు ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు ఆర్ఓకు సమర్పించాలన్నారు. -
ఎన్నికల రథసారథులు..
సాక్షి, ఖమ్మంసహకారనగర్: జిల్లాలో ఎన్నికల వేడి జోరందుకుంది..ఇప్పటికే భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..దీనికి తోడు ఎన్నికల ప్రచారాలు, సన్నాహాలు, నాయకుల విమర్శలు వాతావరణాన్ని మరింత వేడిసెగలు కక్కేలా చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసి అభ్యర్థులు ప్రచారపర్వాన్ని కొనసాగిస్తుండగానే.. వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో ఎన్నికల విధులు నిర్వహించే రథసారధులు వారి బాధ్యతలు సమర్థంగా పూర్తి చేస్తేనే చివరి ఓటరు వరకు ఓటుహక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. ఎన్నికల తంతును విజయవంతంగా ముగించడంలో బూత్స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారుల కృషి విశేషంగా ఉంటుంది. ఏ ఒక్కరూ వారి విధులను సక్రమంగా నిర్వర్తించకున్నా పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాలు వెల్లడించే వరకు ప్రతీ సందర్భాన్ని అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎన్నికల నిర్వహణలో అధికారుల విధులు ఏవిధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ప్రధాన ఎన్నికల అధికారి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించి ప్రధాన ఎన్నికల అధికారిని నియమిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రధాన నిర్ణయాలన్నీ తీసుకునే అధికారం ప్రధాన ఎన్నికల అధికారికి ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణ, నియంత్రణకు లోబడి ప్రతీ జిల్లాకు ఒక ఎన్నికల అధికారి ఉంటారు. సంబంధిత జిల్లా కలెక్టర్ ఈ బాధ్యతను నిర్వహిస్తూ జిల్లావ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలు, ఎన్నికలు నిర్వహించడంలో కీలక భూమిక పోషిస్తారు. రిటర్నింగ్ అధికారి శాసనసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతీ నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తుంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపుతో పాటు తుది అభ్యర్థుల జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది నియామకం, శిక్షణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వంటి అన్ని రకాల పనులు ఆర్ఓ పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. ఆయా నియోజవర్గాల పరిధిలోని రెవెన్యూ డివిజినల్ అధికారి లేదా జేసీ రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తారు. సెక్టోరల్ ఆఫీసర్ ఎనిమిది నుంచి పది కేంద్రాలను పర్యవేక్షించేందుకు ఒక సెక్టోరల్ అధికారిని నియమిస్తారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు, అవసరమైనచోట 144 సెక్షన్ విధించే అధికారం సెక్టోరల్ అధికారికి ఉంటుంది. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ బూత్లు గుర్తించి అక్కడ బందోబస్తు ఏర్పాటుకు సిఫార్సు చేయడం వంటి విధులు నిర్వహిస్తారు. ప్రిసైడింగ్ అధికారి ప్రతీ పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి ఉంటాడు. ఆయన పోలింగ్కు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడం, పోలింగ్ అనంతరం సీల్ వేసి స్ట్రాంగ్రూమ్కు వచ్చే వరకు ప్రిసైడింగ్ అధికారి పూర్తి బాధ్యత వహిస్తారు. ఇతడికి సహాయకుడిగా మరో అధికారి ఉంటారు. పోలింగ్ కేంద్రంలో జరిగే అన్ని కార్యకలాపాలు ఆయన పర్యవేక్షణలోనే నడుస్తాయి. ఫ్లయింగ్స్క్వాడ్ మూడునాలుగు మండలాలకు ఒక ఫ్లయింగ్స్క్వాడ్ బృందం ఉంటుంది. ఈ బృందం తమకు కేటాయించిన మండలాల పరిధిలో మద్యం, డబ్బు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించడం వీరి బాధ్యత. ఓటరు నమోదు అధికారి ఓటర్ల జాబితా తయారు చేయడం ఈ అధికారి ప్రధాన బాధ్యత. ఓటును నమోదు చేసుకునే వారు జాబితాల్లో పేర్లు తప్పుగా ఉన్నవారు ఈ అధికారిని సంప్రదించవచ్చు. ఈయన పర్యవేక్షణలో మరికొందరు అధికారులు ఓటర్ల జాబితాను రూపొందిస్తారు. పోలింగ్ ఏజెంట్లు.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రతీ పోలింగ్ కేంద్రాన్ని నేరుగా పరిశీలించే అవకాశం ఉండనందున ప్రతీ పోలింగ్ కేంద్రంలో తన పక్షాన ఒక ఏజెంట్ను నియమించుకోవచ్చు. ఈయనే పోలింగ్ ఏజెంట్. ఇతను ఓటు వేసేందుకు వచ్చిన వారి వివరాలను ఓటర్ల జాబితాలో సరి చేసుకుని అభ్యంతరాలు ఉంటే అధికారులకు చెబుతారు. దీంతో దొంగ ఓట్లు పడకుండా చూడవచ్చు. పోలింగ్ ఏజెంట్ సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరు అయి ఉండాలి. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల నిర్వహణ జరిగిన తీరుపై నివేదిక రూపొందించి జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులకు పంపించడంలో మైక్రో అబ్జర్వర్లు కీలకంగా వ్యవహరిస్తారు. బూత్లెవల్ అధికారులు కొత్తగా ఓటు నమోదు చేసకునే వారికి దరఖాస్తు ఫారాలు పంపిణీ చేయడం. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడటం. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన గురించి ఉన్నతాధికారులకు తెలియజేయడం. ఓటరు జాబితాల ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పు తదితర అంశాల్లో బూత్లెవల్ అధికారులు సేవలందిస్తారు. -
‘సీ విజిల్ యాప్ను వినియోగించాలి’
సాక్షి, జోగిపేట(అందోల్): ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులు చేసేందుకు సీ విజిల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని జెడ్పీ సీఈవో రవి సూచించారు. శుక్రవారం పట్టణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల అధికారులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు యువత ఈ విషయంలో స్పందించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 13 నుంచి సీ విజిల్ అందుబాటులోకి ఎన్నికల కమిషన్ తెచ్చినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం ప్రతీ నియోజకవర్గం పరిధిలో 24 గంటలు పనిచేసే విధంగా నిఘా బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీ విజిల్ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఫిర్యాదుదారులకు 100 నిమిషాల్లో సమాచారం పంపే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన, యువతీ యువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకొని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో నోడల్ అధికారి బాబూ నాయక్ తహసీల్దారు బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు
సాక్షి, శ్రీకాకుళం : ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఎన్నికల నోడల్ అధికారులతో ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు సమాచారాన్ని 1950 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు. ఇతర అధికారుల ఫోన్ నంబర్లకు పలువురు ఫోన్ చేస్తున్నారని, ఓట్ల వివరాలు అధికారుల వద్ద తక్షణం అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 1950 నంబరుకు డయల్ చేయడం, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా వివరాలు సులువుగా తెలుసుకోవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు ఓటు హక్కు లేని వారు కూడా కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఓటరు హెల్ప్లైన్ యాప్ ద్వారా ఓటు వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. పోలింగు కేంద్రాల వద్ద దివ్యాంగులకు ప్రత్యేకంగా ర్యాంపులు, త్రిచక్ర వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫ్లైయింగ్ స్కాడ్స్, వీడియో సర్వేలియన్స్ బృందాలు, ప్రవర్తనా నియమావళి అమలు అధికారులు, సెక్టార్ అధికారులు తక్షణం రంగంలోకి దిగాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలతో షెడ్యూలు వచ్చిన వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసి విధివిధానాలు తెలియజేయాలని ఆదేశించారు. సమావేశాలకు, ప్రచారం చేసుకొనే వాహనాలకు అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. సువిధ యాప్ ద్వారా రిటర్నింగు అధికారులకు దరఖాస్తు చేయవచ్చని సూచించారు. పోస్టల్ బ్యాలెట్లపై స్పష్టమైన సమాచారం అందించాలని రిటర్నింగు అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ వేసే విధానంపై శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణకు వినియోగించే ఈవీఎంలను సైతం స్ట్రాంగ్రూమ్లలో పెట్టాలని సూచించారు. స్ట్రాంగ్రూమ్, రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు ఉండాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు మాట్లాడుతూ ఎన్నికలకు అవసరమైన సామగ్రి పూర్తి స్థాయిలో ప్రతి విభాగం కలిగి ఉండాలన్నారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన అనంతరం అభ్యర్థులు, పార్టీల నుంచి వచ్చే ఎస్ఎంఎస్, ఐవీఆర్ ఎస్ కాల్స్, ఎఫ్ఎం రేడియో, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తదితర విధాలుగా వచ్చే సమాచారాన్ని పరిశీలించాలని ఆదేశించారు. స్థానికంగా రిటర్నింగు అధికారులు ప్రింటింగ్ ప్రెస్లు, కేబుల్ ఆపరేటర్లతో సమావవేశాలు నిర్వహించి విధివిధానాలు తెలియజేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్–2 పి.రజనీకాంతారావు, ఏఎస్పీ టి.పనసారెడ్డి, రిటర్నింగు అధికారులు లోతేటి శివశంకర్, ఎం.వి.రమణ, గణపతి, మహాలక్ష్మి, భాస్కరరెడ్డి, దొర, పి. అప్పారావు, రఘురాం, జయదేవి, ఎస్డీ అనిత, నోడల్ అధికారులు టి.కైలాష్ గిరీశ్వర్, ఎ.కళ్యాణ చక్రవర్తి, హెచ్.కూర్మారావు, ఎల్.రమేష్, ఎం.మోహనరావు, వి.వి.లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
ఓపనైపోయింది బాబూ!
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ స్థానాలకు పోటీ పడే అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఆదిలాబాద్ అసెంబ్లీకి వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణ, బోథ్ అసెంబ్లీకి వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారి కృష్ణ ఆదిత్యతోపాటు సహాయ రిటర్నింగ్ అధికారులు ఆయా నామినేషన్ కేంద్రాల్లో మంగళవారం పరిశీలించారు. ఆయా రాజకీయ పార్టీల సమక్షంలో నామినేషన్ పత్రాల పరిశీలన కొనసాగింది.ఈ నెల 12 నుంచి 19 వరకు జరిగిన స్వీకరణ ప్రక్రియకు రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు కలిపి మొత్తం 30 మంది నామినేషన్లు దాఖలు చేయగా, పరిశీలనలో తొమ్మిది మంది అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాల వల్ల అధికారులు తిరస్కరించారు. తిరస్కరించిన వాటిలో వివిధ పార్టీల అభ్యర్థుల నామినేషన్లు ఆరు ఉండగా, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల దాఖలు చేసిన నామినేషన్లు ఉన్నాయి. కాగా, పరిశీలన అనంతరం కరెక్ట్గా ఉన్న ఆయా అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 22 వరకు గడువుంది. అదే రోజు పెద్ద మొత్తంలో నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశాలు ఉండడంతోపాటు బరిలో నిలిచే అభ్యర్థులను కూడా అధికారులు ప్రకటించనున్నారు. ఆదిలాబాద్లో తిరస్కరణ ఇలా.. ఈ నెల 12 నుంచి 19 వరకు కొనసాగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ద్వారా ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానానికి మొత్తం 21 మంది నామినేషన్లు వేశారు. ఇందులో వివిధ కారణాల వల్ల ఐదుగురి నామినేషన్లను అధికారులను తిరస్కరించారు. తిరస్కరణకు గురైన వాటిలో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులకు చెందినవి కాగా, ఇద్దరు వివిధ పార్టీల అభ్యర్థుల నామినేషన్లు ఉన్నాయి. బీజేపీ తరఫున నామినేషన్ వేసిన బోడకుంట శరణ్య, గోండ్వానా గణతంత్ర పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన వెడ్మ లక్ష్మి, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన కెల్లేటి దినేష్, కిరణ్కుమార్ వైద్య, మోరే హరిష్చంద్ నామినేషన్లు తిరస్కరణకు గరయ్యాయి. బోథ్లో ఇలా.. బోథ్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 12 నుంచి వారం రోజులపాటు జరిగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ద్వారా మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులోంచి నలుగురు అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాల వల్ల అధికారులు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన అనిల్జాదవ్, కుమ్రం కోటేశ్వర్రావు, నయా భారత్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన సుభాష్ రాథోడ్, రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ నుంచి బరిలో దిగి నామినేషన్ వేసిన ఉయిక హిరాజీ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కాగా, అనిల్ జాదవ్, కుమ్రం కోటేశ్వర్రావు స్వతంత్రంగా కూడా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయడంతో వారు బరిలో నిలిచే అభ్యర్థుల్లో ఉన్నారు. అసెంబ్లీ బరిలో నిలిదెవరో..? జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు ప్రస్తుతం 23 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపసంహరణ బరిలో 16 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 12 మంది వివిధ పార్టీల అభ్యర్థులు ఉండగా, స్వతంత్ర అభ్యర్థులు నలుగురు ఉన్నారు. బోథ్ అసెంబ్లీకి ఉపసంహరణ బరిలో ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతుండగా, ఐదుగురు వివిధ పార్టీల అభ్యర్థులు, ఇద్దరు స్వతంత్రలు ఉన్నారు. కాగా, ఉపసంహరణ బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్లను వెనక్కి తీసుకునేందుకు ఈ నెల 22 వరకు గడువుంది. అదే రోజు సాయంత్రం వరకు అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. -
పోలింగ్ బూత్లలో వెబ్ కాస్టింగ్
వేములవాడ: అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు రిటర్నింగ్ అధికారి ఖిమ్యానాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ 54 సమస్యాత్మక బూత్లను అధికారులు గుర్తించారని తెలిపారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సమస్యాత్మక బూత్లతోపాటు సాధారణ బూత్లలో సైతం ఇలాంటి చర్యలు చేపట్టాలని సూచిస్తే తప్పకుండా నియోజకవర్గంలోని 235 కేంద్రాల్లో వెబ్క్యాస్ట్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులచే వెబ్ క్యాస్టింగ్కు నియమిస్తున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని, ల్యాప్టాప్ కలిగిన యవతరం వెబ్ క్యాస్టింగ్కు అర్హులని ఆయన తెలిపారు. అలాగే బూత్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించినట్లు చెప్పారు. ఇప్పటికే ప్రతీ బూత్ల వద్ద ర్యాంప్ల నిర్మాణం చేపట్టాలని, అనేక ప్రాంతాల్లో ర్యాంప్ల నిర్మాణాలు దాదాపు పూర్తయినట్లు ఆయన తెలిపారు. అలాగే విద్యుత్ సరఫరా, నీటి సౌకర్యం, వృద్ధులు, వికలాంగులకు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నట్లు చెప్పారు. దీంతో అధికారులు, సిబ్బంది గ్రామగ్రామాన ప్రతీ పోలింగ్ స్టేషన్లో సరైన ఏర్పాట్లు చేసేందుకు పనులు ప్రారంభించారు. పౌరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా రిటర్నింగ్ అధికారిని సంప్రదించవచ్చని, లేదా వేములవాడ నియోజకవర్గం టోల్ఫ్రీ నంబర్ 1800 425 3465 కాల్ చేసి చెప్పవచ్చన్నారు. ఆదివారం నామినేషన్లకు సెలవు... ఈనెల 12న నోటిఫికేషన్ వెలువడటంతోపాటు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈనెల 19 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించారు. అయితే మధ్యలో ఆదివారం సెలవు దినం రావడంతో ఆ రోజు నామినేషన్లు వేసేందుకు లేదని ఆయన తెలిపారు. 19తో ముగియనున్న నామినేషన్ల పర్వం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 12 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభించిన రిటర్నింగ్ అధికారులు ఈనెల 19 మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకోనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లు దాఖలు చేసే వాళ్లు తమ కార్యాలయానికి రావచ్చని, ఎన్నికల నిబంధనల మేరకు తమ నామినేషన్ పత్రాలు అందజేయవచ్చని సూచించారు. 20న నామినేషన్ల పరిశీలన, 22 వరకు విత్డ్రాలు, వచ్చేనెల 7న ఉదయం 7 గంటల నుచి సాయంత్రం 8 గంటల వరకు పోలింగ్,11న సిరిసిల్ల మండలం బద్దెనపల్లిలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వచ్చేనెల 13తో ఎన్నికల బాధ్యతలు పూర్తవుతాయని ఆయన తెలిపారు. -
ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
సాక్షి,కోదాడ : అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా సోమవారం ప్రారంభమయ్యింది. అధికారులు దీని కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంగా మార్చారు. కోదాడ అసెంబ్లీ ని యోజకవర్గానికి చెందిన నామినేషన్లను ఇక్కడే స్వీకరించనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కోదాడ ఆర్డీఓ కిషోర్కుమార్ను నియమించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట పట్టణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం కోదా డ డీఎస్పీ సుదర్శన్రెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాసుల రెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. తొలిరోజు ఒక నామినేషన్ దాఖలు.. కోదాడ అసెంబ్లీకి తొలిరోజు ఒక నామినేషన్ దాఖలయ్యింది. పట్టణానికి చెందిన ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన వర్గాల ఐక్యవేదిక నాయకుడు పంది పెదతిరపతయ్య సోమవారం ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. -
రాజ్యసభకు ముగ్గురు ఆప్ అభ్యర్థులు ఎన్నిక
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభ సభ్యులుగా పోటీ లేకుండా ఎన్నికయ్యారు. సంజయ్ సింగ్, సుశీల్ గుప్తా, ఎన్.డి.గుప్తాలు సోమవారం రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల కమిషన్ తరపున రిటర్నింగ్ అధికారి నిధి శ్రీవాత్సవ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. -
రిటర్నింగ్ అధికారిపై వేటు
సాక్షి, చెన్నై: తమిళనాడు ఆర్కే నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు పడింది. ప్రముఖ నటుడు విశాల్ కృష్ణ నామినేషన్ వ్యవహారంలో వివాదాస్పదంగా వ్యవహరించిన ఆ అధికారిపై ఎన్నికల కమిషన్ సీరియస్గా స్పందించింది. విశాల్ నామినేషన్ ఉదంతంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. నామినేషన్ పత్రాలను తిరస్కరించిన అధికారి వేలుస్వామిని ఎన్నికల సంఘం వెనక్కి పిలిచింది. ఈయన స్థానంలో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ పీ నాయర్ని నూతన రిటర్నింగ్ అధికారిగా నియమించింది. హీరో విశాల్ నామినేషన్ తిరస్కరణపై ప్రతిపక్ష డిఎంకె నేత స్టాలిన్ తీవ్రంగా ప్రతిస్పందించిన విషయం తెలిసిందే. విశాల్ నామినేషన్ను తిరస్కరించే విషయంలో భారత ఎన్నికల కమిషన్ పాలక పార్టీతో కుమ్ముక్కయిందని ఆయన ఆరోపించారు. రిటర్నింగ్ అధికారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారులు అధికార పక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కాగా ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశాల్ సమర్పించిన నామినేషన్ అసంపూర్తిగా ఉందని రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం విదితమే. అయితే కొంత సమయం అనంతరం నామినేషన్ అంగీకరిస్తున్నట్టు, మళ్లీ తిరస్కరించినట్టు ప్రకటించడం తీవ్ర గందరగోళానికి తెరతీసింది. విశాల్ అభిమానుల మితిమీరిన ఒత్తిడి మూలంగానే నామినేషన్ను ఆమోదించినట్లు అధికారి చెప్పడం మరింత వివాదానికి తెర తీసింది. -
విశాల్,దీప ఇద్దరికీ ఈసీ బిగ్ షాక్!
-
ఆర్కే నగర్ బైపోల్.. విశాల్ నామినేషన్ తిరస్కరణ
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికపై రిటర్నింగ్ అధికారి వరుస షాకులు ఇస్తున్నారు. నటుడు విశాల్ నామినేషన్ను కూడా తిరస్కరించినట్లు ఆయన ప్రకటించారు. కాసేపటి క్రితం ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు. నామినేషనల్ లో తప్పిదాలు ఉండటంతోపాటు, వివరాలు సరిగ్గా లేవని రిటర్నింగ్ ఆఫీసర్ పేర్కొన్నారు. కాగా, స్వతంత్ర్య అభ్యర్థిగా సోమవారం విశాల్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు జయలలిత మేనకోడలు దీప జయకుమార్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. సాంకేతిక కారణాలతో ఆమె నామినేషన్ను తిరస్కరించినట్లు అధికారి తెలిపారు. విశాల్ అరెస్ట్... నామినేషన్ తిరస్కరణపై విశాల్ తీవ్రంగా స్పందించాడు. ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించారంటూ రోడ్డుపై ధర్నాకు దిగగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయమై విశాల్ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
దీప జయకుమార్కు బిగ్ షాక్
సాక్షి, చెన్నై : జయలలిత మేనకోడలు దీప జయకుమార్కు ఊహించని షాక్ తగిలింది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం ఆమె దాఖలు చేసిన నామినేషన్ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం ఆమె స్వతంత్ర్య అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందులో ఆమె పేర్కొన్న అంశాలు అసంపూర్తిగా ఉన్నాయంటూ తెలిపారు. జయ మృతి తర్వాత ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై పేరిట ఓ పార్టీని స్థాపించిన ఆమె.. ఆ సమయంలో జయకు అసలైన వారసురాలిని తానే అని ప్రకటించుకున్నారు. ఆపై ఆర్కే నగర్ ఉప ఎన్నికలో గెలుపొంది తీరతానని ధీమా వ్యక్తం చేశారు కూడా. కాగా, ఈసీ నిర్ణయంతో ఆమె ఎన్నికకు దూరమైనట్లయ్యింది. ప్రస్తుతం ఆర్కే నగర్ కు పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీ అభ్యర్థులతోపాటు నటుడు విశాల్, ముఖ్యంగా బహిష్కృత నేత దినకరన్ ఈ ఎన్నికను సవాల్ గా తీసుకోవటంతో రాజకీయ వర్గాలు పోటీని ఆసక్తిగా తిలకించబోతున్నాయి. ఎన్నికల సంఘం డిసెంబర్ 21న ఎన్నిక, 24 న కౌంటింగ్ నిర్వహించనుంది. -
ఉపఎన్నికల కోసం భారీ భద్రత ఏర్పాటు చేశాం
-
నంద్యాల రిటర్నింగ్ అధికారిపై టీడీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : అధికారంలో ఉన్నామనే అహంకారంతో బెదిరింపులు, కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ ఏకంగా ఎన్నికల సంఘంపైనే యుద్ధానికి దిగింది. నంద్యాల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై టీడీపీ ఫిర్యాదు చేసింది. సర్వేలు వద్దంటూ రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధాన అధికారికి శుక్రవారం టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ‘నంద్యాలలో సర్వేలు వద్దని రిటర్నింగ్ అధికారి ఎలా చెబుతారు. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు సర్వే చేయొద్దని ఎలా అంటారు. ఒపీనియన్ పోల్స్, సర్వేలు నిషేధించే అధికారం ఈసీకి లేదు. సర్వేలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసే పరిధి రిటర్నింగ్ అధికారికి లేదు. నంద్యాల రిటర్నింగ్ అధికారి ఆదేశాలు చట్ట వ్యతిరేకం.’ అంటూ టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని ఈ సందర్భంగా లేఖ ఇచ్చారు. మరోవైపు నంద్యాలలో అధికారపార్టీ అక్రమాలకు పాల్పడుతోందని.. ఎన్నికల ప్రధాన అధికారి అనూప్ సింగ్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బహిరంగంగానే డబ్బులు పంచారని ఫిర్యాదు చేశారు. టీడీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని.. స్థానిక డీఎస్పీని విధుల్లో నుంచి తప్పించి.. ఎన్నికల పరిశీలకుడిగా ప్రత్యేక అధికారిని నియమించాలని వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ ఎన్నికల ప్రధాన అధికారి అనూప్ సింగ్ను కోరారు. -
నంద్యాల రిటర్నింగ్ అధికారిపై టీడీపీ ఫిర్యాదు
-
నంద్యాల ఉప ఎన్నిక కసరత్తు
–నంద్యాల రిటర్నింగ్ అధికారిగా పీఏ టు స్పెషల్ కలెక్టర్ – తహసీల్దార్లు, పోలీసు అధికారుల వివరాలు కోరిన ఎన్నికల కమిషన్ కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ఉప ఎన్నికకు కసరత్తు మొదలైంది. పీఏ టు శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ నంద్యాల నియోజక వర్గానికి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. అయితే పీఏ టు స్పెషల్ కలెక్టర్ పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. పీఏ టు స్పెషల్ కలెక్టర్గా వెంకటకృష్ణుడు పదవీ విరమణ చేసిన తర్వాత ఈ పోస్టులో ఎవ్వరిని నియమించలేదు. ఇన్చార్జ్ నియామకం కూడా జరగలేదు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఈ పోస్టులో నంద్యాల తెలుగు గంగ ప్రాజెక్టు భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యంను ఇన్చార్జ్ పీఏ టు స్పెషల్ కలెక్టర్గా నియమించారు. ఉప ఎన్నిక ఉన్నందున రెగ్యులర్ పీఏ టు స్పెషల్ కలెక్టర్ను నియమించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఇన్చార్జిగా నియమితులైన సత్యం నంద్యాల అసెంబ్లీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా ఈ నియోజక వర్గ పరిధిలో తహసీల్దార్లు, పోలీసు అధికారుల వివరాలు పంపాలని ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్లాల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఎంత కాలం నుంచి నియోజక వర్గంలో పనిచేస్తున్నారు... వారి స్థానికత ఏది తదితర వివరాలను ప్రత్యేక ఫార్మెట్లో పంపాలని సూచించారు. నంద్యాల అసెంబ్లీ ఓటర్లు 2,09,612 నంద్యాల నియోజక వర్గంలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,09,612 మంది ఉండగా ఇందులో మహిళలు 1,06,223 మంది ఉన్నారు. పురుషులు 1,03,328 ఉన్నారు. ఇతరులు 61 మంది ఉన్నారు. పురుష ఓటర్లతో పోలిస్తే 2895 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. -
ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం
హైదరాబాద్సిటీ: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఆదివారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో 82.38శాతం ఓట్లు నమోదయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైత కుమార్ సింగ్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్తో పాటు ఒక్కో పోలింగ్ స్టేషన్కు ఇద్దరు వీడియో కెమెరామెన్లతో వీడియోగ్రఫీ చేయించినట్లు తెలిపారు. హైదరాబాద్ అంబర్పేట్ ఇండోర్స్టేడియం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించామని పేర్కొన్నారు. ఏ పోలింగ్ స్టేషన్లోనూ ఏవిధమైన సమస్యలు తలెత్తలేదని ఆయన తెలిపారు. అంబర్పేట్ స్టేడియంలో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల నుండి బ్యాలెట్ బాక్సులను బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తున్నారు. ఈ నెల 22న ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని అద్వైత కుమార్ సింగ్ తెలిపారు. -
తప్పు మార్కర్ పెన్నుదా? పార్టీ సభ్యులదా?
న్యూఢిల్లీ: భారత పార్లమెంట్లో ప్రజాస్వామ్యం ఓ బూటకమని, రాజకీయ పార్టీలు ఆడే నాటకమని తెల్సిందే. ఈ బూటకపు నాటకంలో పార్టీ అధిష్టానం చేతుల్లో పార్లమెంట్ సభ్యులు జవసత్వాలు లేని పాత్రలుగా వ్యవహరించడం మనం ఇంతకాలం చూశాం. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికే షాకిచ్చిన పార్టీలోని ఓ వర్గం ఆడిన సరికొత్త నాటకం ఇప్పుడు తెరపైకి వచ్చింది. హర్యానాలోని రెండు సీట్లతో సహా దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ సీట్లకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ రెండు సీట్లను బీజేపీ కైవసం చేసుకున్నాయి. అసెంబ్లీలో ఆ పార్టీకున్న బలం ప్రకారం ఒక్క సీటు మాత్రమే బీజేపీకి దక్కాలి. మరోసీటు కాంగ్రెస్-ఇండియన్ నేషనల్ లోక్దళ్ కూటమికి వెళ్లాలి. బీజేపీ అధికార అభ్యర్థిగా కేంద్ర మంత్రి వీరేందర్ సింగ్తోపాటు బీజేపీ మద్దతిచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఈస్ట్ గ్రూప్, జీ మీడియా చైర్మన్ సుబాస్ చంద్ర అనూహ్యంగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 ఓట్లు చెల్లకుండా పోవడమే కాంగ్రెస్ కూటమి బలపర్చిన స్వతంత్య్ర అభ్యర్థి ఆర్కే ఆనంద్ ఓటమికి కారణమని రిటర్నింగ్ అధికారితోపాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాదిస్తోంది. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే తన బ్యాలెట్ పత్రాన్ని తోటి సభ్యుడికి బహిరంగంగా చూపించినందుకు ఒక ఓటు, ఎన్నికల నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి సూచించిన వయలెట్ మార్కర్ పెన్నును ఉపయోగించక పోవడం వల్ల 12 ఓట్లు చెల్లకుండా పోయాయి. మరో ఓటరు ఎవరికి ఓటు వేయకుండా ఖాళీగా వదిలేశారు. దీంతో కాంగ్రెస్ కూటమి బలపర్చిన ఆనంద్కు దక్కాల్సిన 14 ఓట్లు రాకుండా పోయాయి. దీనికి రిటర్నింగ్ అధికారి బీజేపీ పార్టీతో అక్రమాలకు కుమ్మక్కు అవడం వల్లనే ఇలా జరిగిందని, సూచించిన మార్కర్ పెన్నుకు బదులుగా ఓటేసేటప్పుడు మరో పెన్నును ఎలా పెడతారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాదిస్తోంది. ఈ విషయమై ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా వర్గానికి చెందిన 14 మంది శాసనసభ్యుల ఓట్లే చెల్లకుండా పోయాయని, వారే ఇందులో కుట్రపన్ని తప్పుడు పెన్నుతో ఓటేశారని ఓడిపోయిన స్వతంత్య్ర అభ్యర్థి ఆనంద్ ఆరోపిస్తున్నారు. ఆయన వాదనలో వాస్తవం లేకపోలేదు. బీజేపీతో అంటకాగే ఇండియన్ నేషనల్ లోక్దళ్తో పొత్తు పెట్టుకోవడం భూపేందర్ సింగ్ హూడాకు ఏమాత్రం ఇష్టం లేదు. పార్టీ అధిష్టానంకు ఆయన ఓ షాక్ ఇవ్వాలనుకున్నారు. ఇచ్చారు. పార్టీ అంతర్గత కుమ్ములాటల గురించి, అవిధేయత గురించి బహిరంగంగా మాట్లాడడం ఇష్టంలేని కాంగ్రెస్ అధిష్టానం నెపాన్ని రిటర్నింగ్ అధికారిపైకి నెట్టేస్తోంది. ఇందులో పూర్తిగా రిటర్నింగ్ అధికారి తప్పిదమేననుకుంటే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సరైన మార్కర్తోనే ఓట్లు ఎలావేశారన్న ప్రశ్న వస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో రిటర్నింగ్ అధికారి హస్తం ఉన్నా, లేకున్నా హూడా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కుమ్మక్కు కాకపోతే ఇలా జరగదనే విషయం సుస్పష్టం. ఎమ్మెల్యేలు డబ్బులకు అమ్ముడుపోయి పార్టీ అధిష్టానం ఆదేశాలకు విరుద్ధంగా క్రాస్ ఓటింగ్కు పాల్పడరాదనే ఉద్దేశంతో రాజ్యసభ ఎన్నికల్లో 2003 నుంచి ఏజెంట్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి ప్రకారం పార్టీ నియమించిన ఏజెంట్కు చూపించి పార్టీ సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది. హర్యానా నుంచి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్గా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బీకే హరిప్రసాద్ వ్యవహరించారు. ఓట్లు చెల్లకుండా పోయిన 13 మంది శాసన సభ్యులు సహా పార్టీ సభ్యులంతా తనకు చూపించే ఓటు వేశారని హరిప్రసాద్ ఓటింగ్ అనంతరం మీడియా సమక్షంలో ప్రకటించారు. అందరు కూడా ఆనంద్కే ఓటేశారని చెప్పారు. ఎవరికి ఓటు వేశారన్న విషయాన్ని గ్రహించిన ఆయన ఏ పెన్నుతో ఓటు వేశారన్న విషయాన్ని గమనించలేకపోయారు. ఎన్ని కొత్త పద్ధతులు తీసుకొచ్చిన క్రాస్ ఓటింగ్ జరుగుతోందన్నది నిర్వివాదాంశం. ఏదేమైతేనేం! మరో పారిశ్రామికవేత్త, ధనవంతుడు రాజ్యసభకు ఎన్నికయ్యారు. -
ప్రతి డివిజన్కూ రిటర్నింగ్ అధికారి
గచ్చిబౌలి: జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, ఇందులో భాగంగా ఈవీఎంల పనితీరుపై అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎన్నికలకు ముందు అన్ని పోలింగ్ స్టేషన్లలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ జనార్దన్రెడ్డి తెలిపారు. ఎన్నికలను పకడ ్బందీగా నిర్వహించేందుకు ప్రతి డివిజన్కు ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం రాత్రి శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్కు గంట ముందు అన్ని పోలింగ్ స్టేషన్లలో ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంల పనితీరుపై అనుమానాలను నివృత్తి చేస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం థర్డ్ సప్లిమెంట్ ఇచ్చిందని అందుకు అనుగుణంగా తొలగించిన ఓట్లు, కొత్తగా వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకుని ఓటర్ లిస్ట్కు జత చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జీహెచ్ంఎసీ పరిధిలో 7,751 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటి సంఖ్య 8 వేలకు పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో రెండు, మూడు డివిజన్లకు ఒక రిటర్నింగ్ అధికారి ఉండగా, ప్రస్తుతం ప్రతి డివిజన్కు ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్ నిర్వహణకు రిటర్నింగ్ అధికారులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. సరైన కారణం లేకుండా ఏక పక్షంగా ఎన్నికల విధులకు గైర్హాజరైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 5 జిల్లాల నుంచి సిబ్బందిని రప్పిస్తున్నట్లు తెలిపారు. 28 మంది సాధారణ పరిశీలకులు, 24 మంది వ్యయ పరిశీలకులతో సహా 46 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారన్నారు. పోలింగ్ నిర్వహణపై అధికారులకు శిక్షణ ఇస్తామని, పోలింగ్కు కొద్ది గంటల ముందే పే స్కేల్, హోదాను బట్టి ఎవరు ఎక్కడ విధులు నిర్వహించాలో తెలియజేస్తామన్నారు. స్లిప్లను ఇంటింటికీ పంపిణీ చేస్తామని, వెబ్ సైట్లో ఎపిక్ నెంబర్ ఎంటర్ చేస్తే మూడు సెకన్లలో ఓటరు వివరాలు వస్తాయని, వారే స్లిప్ తయారు చేసుకునే వీలుందన్నారు. 12 వేల ఈవీఎంలు సిద్ధం.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు 12 వేల వీఎంలు సిద్ధం చేసినట్లు జీహెచ్ంఎసీ కమిషనర్ స్పెషల్ ఆఫీసర్ జనార్దన్రెడ్డి వివరించారు. ఇతర జిల్లాలు, మహరాష్ట్ర నుంచి ఈవీఎంలను తెప్పించామన్నారు. సమావేశంలో వెస్ట్ జోన్ కమిషనర్ బి.వి.గంగాధర్ రెడ్డి, సర్కిల్-11 డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్, ఏఎంసీ సురేందర్రెడ్డి, ఈఈ మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొరపాట్లకు వారిదే బాధ్యత ఎన్నికలకు ముందు మాక్పోలింగ్ విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు 8 వేలకు పెరగనున్న పోలింగ్ స్టేషన్లు సిద్ధంగా 12 వేల ఈవీఎంలు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి -
ఎంపీటీసీల కొనుగోలు పై వైఎస్ఆర్సీపీ సీరియస్
ప్రకాశం: ఎంపీటీసీల కొనుగోలు వ్యవహారం పై వైఎస్ఆర్సీపీ నేతలు సాక్ష్యాధారాలతో కాసేపట్లో(మంగళవారం) రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయనున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన సభ్యులను టీడీపీ ప్రలోభ పెట్టి అపహరించిందని ఫిర్యాదు చేయనున్నారు. ఎంపీటీసీ సభ్యులను వెతికి తీసుకురావాలని రిటర్నింగ్ అధికారిని కోరనున్నారు. కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేయనున్నారు. -
ప్రచారానికి డూసూ రేడియో సిద్ధం
న్యూఢిల్లీ: యూనివర్సిటీ రేడియోను ప్రచారం నిమిత్తం విద్యార్థి సంఘాలు వాడుకోవచ్చని ఢిల్లీ యూనివర్సిటీ తెలిపింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు వర్సిటీతోపాటు అనుబంధ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను సైతం కలుసుకోవాల్సి ఉంది. అయితే వీరు ఆయా కళాశాలలకు వెళ్లి విద్యార్థులందరినీ ముఖాముఖి కలిసేందుకు ఉన్న అవకాశాలు తక్కువనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు రేడియో ద్వారా విద్యార్థులకు చేరువయ్యేందుకు అనుమతిస్తున్నట్లు డూసూ ప్రధాన ఎన్నికల కమిషనర్ డీఎస్ రావత్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కమ్యూనిటీ రేడియో 90.4 ఎంహెచ్జెడ్ను అభ్యర్థులు తమ ప్రచారానికి వాడుకోవచ్చని ఆయన తెలిపారు. ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా 5 నిమిషాలు సమయం ఇస్తామని చెప్పారు. ముఖ్య ఎన్నికల అధికారి, ముఖ్య రిటర్నింగ్ అధికారి, రిటర్నింగ్ అధికారి సభ్యులుగా ఉన్న కమిటీకి సదరు అభ్యర్థుల ప్రసంగాలను ఎడిట్ చేసే హక్కు ఉంటుందన్నారు. కాగా రేడియో ద్వారా తమ ప్రసంగాన్ని వర్సిటీ విద్యార్థులందరికీ వినిపించడం అభ్యర్థులకు చాలా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, కమ్యూనిటీ రేడియో ద్వారా తమ ప్రసంగం వినిపించడానికి అభ్యర్థులకు కేటాయించిన 5 నిమిషాల సమయం చాలా తక్కువని ఎన్ఎస్యూఐ అధికార ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే అభిప్రాయపడ్డారు. ‘అభ్యర్థులు వర్సిటీ అనుబంధ కళాశాలన్నింటికీ వెళ్లి విద్యార్థులను కలిసి ప్రచారం చేయడం కొంత కష్టంతో కూడుకున్న పనే.. అలాగే ప్రైవేట్ ఎఫ్ఎం చానళ్ల ద్వారా ప్రచారానికి నిబంధనలు ఒప్పుకోవడం లేదు.. ఇటువంటి సమయంలో కమ్యూనిటీ ఎఫ్ఎం ద్వారా అభ్యర్థులకు ప్రచారానికి అవకాశం కల్పించడం మంచిదే..’ అని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి రోహిత్ చహల్ అన్నారు. ఇదిలా ఉండగా, అభ్యర్థులనుంచి వచ్చే అభ్యర్థనలబట్టి వారికి కేటాయించే సమయంలో కొంత మార్పులుచేర్పులు చేసే అవకాశముందని సీఈవో స్పష్టం చేశారు. కాగా, కమ్యూనిటీ రేడియో 2007లో ప్రారంభమైంది. విద్యార్థి సంఘాల ఎన్నికల ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి. డూసూ నామినేషన్లు పూర్తి ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(డూసూ) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో పూర్తయినట్లు ప్రధాన ఎన్నికల అధికారి డి.ఎస్.రావత్ తెలిపారు. నాలుగు పదవులకు గాను మొత్తం 144 నామినేషన్లు దాఖలయ్యాయని ఆయన చెప్పారు. వీటిలో అధ్యక్ష పదవికి 37, ఉపాధ్యక్ష పదవికి 32 దరఖాస్తులు చెల్లుబాటయ్యాయని రావత్ తెలిపారు. అలాగే కార్యదర్శికి 41, సంయుక్త కార్యదర్శి పదవికి 34 దరఖాస్తులు చెల్లుబాటయ్యాయని చెప్పారు. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని రావత్ తెలిపారు. -
సర్వం సిద్ధం
పాలకొండ, న్యూస్లైన్ : పాలకొండ అసెంబ్లీ, అరకు పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు పాలకొండ ఏఎంసీ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తయ్యూయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. లెక్కింపు కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకుడు బల్వీందర్ సింగ్, రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో తేజ్భరత్లు గురువారం పరిశీలించారు. పాలకొండ నియోజకవర్గంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికకు మొత్తం1,68126 మంది ఓటర్లుండగా 1,20,728 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 246 పోలింగ్ స్టేషన్ల నుంచి 498 ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను నేడు లెక్కించనున్నారు. ఈ మేరకు స్థానిక ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలో మొత్తం 18 రౌండ్లలో లెక్కింపు చేయనున్నారు. ఈ కేంద్రంలో అసెంబ్లీ లెక్కింపునకు 14 టేబుల్స్, ఎంపీ ఓట్ల కోసం 14 టేబుల్స్ను సిద్ధం చేశారు. వీటి పర్యవేక్షణ తదితర విధుల కోసం 84 మంది ప్రత్యేక సిబ్బంది, అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రౌండ్ల వారీగా ఓట్ల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భవిత తేలేది నేడే..! పాలకొండ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థులుగా విశ్వాసరాయి కళావతి (వైఎస్సార్ సీపీ), నిమ్మక సుగ్రీవులు (కాంగ్రెస్), నిమ్మక జయకృష్ణ (టీడీపీ), పత్తిక కుమార్ (సీపీఎం), కూరంగి ముఖలింగం(సీపీఐ), సవర పులిపుట్టి పెంటడు (స్వతంత్ర), బిడ్డిక వెంకయ్య (స్వతంత్ర) అభ్యర్థులు, అలాగే అరకు ఎంపీ అభ్యర్థులుగా కొత్తపల్లి గీత (వైఎస్సార్సీపీ), కిషోర్చంద్రదేవ్ (కాంగ్రెస్), గుమ్మిడి సంధ్యారాణి (టీడీపీ), మిడియం బాబూరావు (సీపీఎం)లు బరిలో ఉన్నారు. నేడు విడుదల కానున్న ఎన్నికల ఫలితాలు వీరి భవిష్యత్ను తేల్చనున్నాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి, టీడీపీకి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. -
ఇంత రాద్ధాంతమా?
కొన్ని పాత్రలు కొందరికి నప్పవు. వారణాసిలో బీజేపీ ‘బాధితపక్షం’గా గురువారం నిర్వహించిన ధర్నా అలాంటిదే. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీచేస్తున్న ఆ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న ప్రాంజల్ యాదవ్ పట్టణంలో పార్టీ నిర్వహించతల పెట్టిన కార్యక్రమాల్లో ఒకదానికి అనుమతి నిరాకరించడం ఈ ధర్నాకు ప్రధాన కారణం. నగరంలోని బేనియాబాగ్ ప్రాంతంలో పార్టీ ర్యాలీని ఆయన కాదన్నారు. మిగిలిన పార్టీలను అనుమతించిన ప్రాంతంలో తమను ఎందుకు వద్దంటున్నారన్నది బీజేపీ సంధిస్తున్న ప్రశ్న. ఇలా ప్రశ్నించడం, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంలో అసంగతమేమీ లేదు. కానీ, బీజేపీ చేసింది వేరు. సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే కాచుక్కూర్చున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, అమిత్ షాల ఆధ్వర్యంలో బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్యూ) దగ్గర భారీ ధర్నా నిర్వహించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్ని కల సంఘం కార్యాలయం వద్దకూడా నిరసన ప్రదర్శన చేశారు. అంతేకాదు... నరేంద్ర మోడీ బీహెచ్యూ వద్ద హెలికాప్టర్లో దిగగా అక్కడినుంచి అయిదు కిలోమీటర్ల దూరంలోని బీజేపీ ప్రధాన ఎన్నికల కార్యాలయం వరకూ అనుమతి లేకుండానే, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంతో పాలనానుభవం ఉన్న బీజేపీ వంటి పార్టీ నిజానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. బీజేపీ అడిగిన అయిదు కార్యక్రమాల అనుమతుల్లో ఎన్నికల సంఘం కాదన్నది ఒక్క బేనియా బాగ్ ర్యాలీని మాత్రమే. అనుమతించినవాటిలో ‘గంగాహారతి’ కార్యక్రమం ఉన్నా దాన్ని కూడా ఎన్నికల సంఘం ఒప్పుకోలే దని మోడీ ఎందుకు అనాల్సివచ్చిందో తెలియదు. పార్టీ నేతలు ఆయనకు సరైన సమాచారం ఇచ్చి ఉండకపోవచ్చేమోగానీ బేనియా బాగ్ ర్యాలీని నిరాకరించాక బీజేపీయే గంగాహారతితో సహా అన్నిటినీ రద్దుచేసుకుని నిరసన ప్రదర్శనకు దిగింది. ర్యాలీని నిరాకరించడంలో ప్రాంజల్ యాదవ్ పొరపాటు చేసివుం డొచ్చు. అంతకుముందు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ వగైరాలను అనుమతించినప్పుడు మోడీని కాదనడం వివక్ష చూపడమే కావొచ్చు. కానీ, అందుకు దారితీసిన పరిస్థితులగురించి ఆయన చెబుతున్న కారణాలు వేరుగా ఉన్నాయి. బేనియాబాగ్లో అల్లరి జరిగే అవకాశమున్నదని గుజరాత్ ఇంటెలిజెన్స్ విభాగం అందజేసిన సమాచారమూ, 1991లో అదే ప్రాంతంలో బీజేపీ సమావేశం జరిగాక ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులనూ దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నానన్నది ప్రాంజల్ యాదవ్ వాదన. పైగా 25,000 మంది పట్టే ఆ మైదానం వద్ద బీజేపీ లక్షమందితో కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నదని ఆయన చెబుతున్నారు. ఆయన అభిప్రాయం ఎలావున్నా బీజేపీకి తన నిర్ణయాన్ని తెలియజేయడంలో ప్రాంజల్ యాదవ్ జాప్యంచేశారు. ఈ జాప్యంపై బీజేపీ వెనువెంటనే ఢిల్లీలోని తమ నేతల ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసివుండొచ్చు. తమకు న్యాయం జరిగేలా చూడమని డిమాండ్ చేయవచ్చు. కానీ, ఫిర్యాదు మార్గాన్ని వదిలిపెట్టి బీజేపీ ఆరోపణలకూ, ‘రోడ్ షో’కూ దిగింది. కేవలం ‘రాజకీయ ఒత్తిళ్ల’పర్యవసానంగానే తమ పార్టీకి అనుమతి నిరాకరించారని చెప్పడమే కాక ‘భద్రత కల్పించలేకపోతే ఎన్నికలు నిర్వహించడం మానేయండ’ని అరుణ్ జైట్లీ అంతటి సీనియర్ నాయకుడు ఎన్నికల సంఘానికి సలహా ఇచ్చారు. కేవలం ఒక ఉదంతం ఆధారం చేసుకుని తమ పార్టీకి తీరని అన్యాయమేదో జరిగిపోయిందని చిత్రించడం మంచిది కాదు. వ్యక్తులుగా కొందరు అధికారులు రాగద్వేషాలతో ఉండొచ్చుగానీ మొత్తంగా ఎన్నికల సంఘం వ్యవహారశైలి మొదటినుంచీ తటస్థంగా ఉంటున్నది. ఏ చిన్న పొరపాటు ఎక్కడ జరిగిందని తేలినా అది తగిన చర్యలకు ఉపక్ర మిస్తూనే ఉన్నది. తన సచ్చీలతను నిరూపించుకుంటున్నది. ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా నిర్వహించడానికి అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నది. ఇంకా చేయాల్సింది ఎంతో ఉన్నదని గుర్తించి, ప్రతి అనుభవంనుంచి ఆ సంస్థ కొత్త కొత్త పాఠాలు నేర్చుకుని తన పనితీ రును మెరుగుపరుచుకుంటున్నది. ఎన్నికల సంఘంవంటి రాజ్యాం గపరమైన సంస్థలను ఏదైనా అనేముందు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలి. బీజేపీ అతిగా స్పందించిన తీరు చూస్తే ఆ పార్టీ మదిలో బేనియాబాగ్ వివాదంకంటే ఇతరేతర అంశాలు...ముఖ్యంగా మోడీపై ఎన్నికల సంఘం రెండు ఎఫ్ఐఆర్లు దాఖలు చేయించడంవంటివి ఉన్నాయనిపిస్తుంది. ఎన్నికల్లో ఎదుటి పక్షాన్ని అధిగమించి తామే విజేతగా నిలవాలన్న తహతహతో నాయకులు ఒకరిని మించి మరొకరు ఆరోపణలు చేసుకోవడం, పరస్పర నిందలకు దిగడం రాను రాను పెరుగుతున్నది. ఈ ఎన్నికల్లో అది కొట్టొచ్చినట్టు కనబడింది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపైగానీ, రాజకీయపక్షాల ఆర్ధిక విధానాలపైగానీ సరైన చర్చ జరగలేదు. ఈ దుస్థితిని సరిదిద్దడమెలాగో తెలియక అందరూ ఆందోళనపడుతుంటే బీజేపీ వంటి బాధ్యతగల పార్టీ ఎన్నికల సంఘా న్ని అప్రదిష్టపాలు చేయాలని చూడటం సరికాదు. ప్రాంజల్ యాదవ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టకుండానే, దాన్ని చేరేయడంలో జరిగిన జాప్యంపై ఎన్నికల సంఘం కూడా అసంతృప్తి వ్యక్తంచేసింది. అంతే కాక, వారణాసికి ప్రత్యేక పరిశీలకుణ్ణి నియమించడం ద్వారా ఆయనను దాదాపు పక్కనబెట్టింది. ఇప్పటికైనా బీజేపీ ‘బాధితపక్షం’గా తనను తాను చిత్రించుకోవడాన్ని, ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలకు దిగడాన్ని విరమించుకోవాలి. మోతాదుకు మించి చేస్తే ఏదైనా వికటిస్తుందని గుర్తుంచుకోవాలి. -
పకడ్బందీగా నిర్వహించాలి.
ఇందూరు,న్యూస్లైన్ : జిల్లాలో ఈ నెల 13న నిర్వహించే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా, రీకౌంటింగ్కు తావు లేకుండా నిర్వహించాలని మండలాల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు జడ్పీ రిటర్నింగ్ అధికారి, డీపీఓ సురేశ్బాబు సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్వో,ఏఆర్వోలకు ఓట్ల లెక్కిం పుపై ప్రొజెక్టర్ ద్వారా శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ... మొత్తం 36 జడ్పీటీసీ , 583 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మూడు కేంద్రాలలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్ డివిజన్లో ధర్మారం(బి) శివారులోని తిరుమల ఇనిస్టిట్యూట్, బోధన్ డివిజన్లో రాకాసిపేట్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కామారెడ్డి డివిజన్లో సదాశివనగర్ మండలం మర్కల్ విలేజ్లోని విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బ్యాలెట్ బాక్సులు భద్ర పరిచిన దగ్గరి ప్రాంతాల్లోనే కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటర్లు వేరు వేరుగా ఏర్పాటు చేసి ప్రతి కౌంటింగ్ రూంలో బల్లలు సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం ఒక అభ్యర్థి ఒకే ఏజెంట్ను నియమించుకోవాలని, ఒక టేబుల్పై ఒక్క ఏజెంట్ను మాత్రమే నియమించాలన్నారు. ఎలాంటి సమస్యలకు తావులేకుండా సమయానికి ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభం కావాలన్నారు. అలాగే ప్రతి కౌంటర్కు ఒక సూపర్వైజర్, ముగ్గురు అసిస్టెంట్లను నియమిస్తున్నామన్నారు. అధికంగా ఓట్లు ఉంటే అదనంగా మరో ఇద్దరు అసిస్టెంట్లను కూడా ఇస్తామన్నారు. అయితే ప్రతి ఒక్క ఓటును క్షుణ్ణంగా లెక్కించాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా రౌండ్ల వారీగా వివరాలను మీకిచ్చిన షీట్లలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి వరకు కౌంటింగ్ చేయకూడదని, రీ కౌంటింగ్ కాకుండా అన్నీ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సెల్ఫోన్లకు అనుమతిలేదు ఏజెంట్గా వ్యవహరించే వారు ఒక్క సారి కౌటింగ్ కేంద్రంలోకి వస్తే మళ్లీ బయటకు వెళ్లాలంటే ఆర్వో అనుమతి తీసుకోవాలన్నారు. ఒక్క ఆర్వోకు తప్ప కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు, ఎవరిని కూడా సెల్ ఫోన్లతో లోనికి అనుమతిబోమని స్పష్టం చేశారు. నీళ్లు, చాయ్ లాంటివి కూడా లోనికి అనుమ తి ఉండదనే విషయాలను గుర్తుంచుకోవాలన్నారు. గెలిచిన అభ్యర్థుల వివరాలు, వారు ఎన్ని ఓట్లతో గెలుపొందిన వివరాలు కూడా కచ్చితంగా నోట్ చేసుకొని ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయాలన్నారు. ఇక్కడి శిక్షణలో విన్న సూచనలు, నిబంధనలను బుధవారం అభ్యర్థులతో మండల కార్యాలయాల్లో సమావేశం ఏర్పాటుచేసి, తెలియజేయాలని ఆర్వో, ఏఆర్వోలకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రాజారాం, డ్వామా పీడీ శివలింగయ్య పాల్గొన్నారు. -
కీలకం
- అత్యధిక మందికి అందని పోస్టల్ బ్యాలెట్లు - దరఖాస్తు చేయనివారూ ఎక్కువే సాక్షి, సిటీబ్యూరో : హోరాహోరీ పోరు.. పోటాపోటీ ప్రచారం.. ఒకే స్థానం-అభ్యర్థులు అధికం.. స్వపక్షంలోనే విపక్షం.. తిరుగుబాట్లు.. వెన్నుపోట్లు.. వెరసి ఈసారి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రతి ఓటూ కీలకమే. ఈ నేపథ్యంలో నేతల రాతలు మార్చే బుల్లెట్గా మారనుంది పోస్టల్ బ్యాలెట్. ఈసారి అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో దీని పాత్ర కీలకం కానుంది. కానీ గ్రేటర్ పరిధిలో దరఖాస్తు చేసుకున్న పలువురికి పోస్టల్ బ్యాలెట్లు అందకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గ్రేటర్ పరిధిలో 28 వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే సుమారు 18 వేల మం దికే అందినట్లు సమాచారం. దీంతో దరఖాస్తు చేసుకున్నా తమకు నేటికీ పోస్టల్ బ్యాలెట్ అందలేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. తాము ఓటు హక్కు వినియోగించుకోవద్దా? అని ప్రశ్నిస్తున్నారు. అసలు దరఖాస్తే చేసుకోని వారు కూడా తక్కువేమీ లేరు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఎన్నికల విధుల్లోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కావాలని తాము ఏ రిటర్నింగ్ అధికారి పరిధిలో ఎన్నికల విధుల్లో ఉంటారో వారికి ఫారం-12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును ఉద్యోగి ఓటు హక్కు ఉన్న నియోజకవర్గ రిట ర్నింగ్ అధికారికి పంపిస్తారు. ఓటరు జాబితాలో పేరు తదితరమైనవన్నీ నిర్ధారించుకొని సంబంధిత ఉద్యోగికి పోస్టు ద్వారా ఈ పోస్టల్ బ్యాలెట్ను పంపిస్తారు. పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేసే ఉద్యోగి తిరిగి దానిని పోస్టు ద్వారా గాని.. లేక సంబంధిత రిటర్నింగ్ అధికారికి నేరుగా గాని అందజేయవచ్చు. ఈ నెల 16న ఓట్ల లెక్కింపు జరగనుండగా, 15లోగా కానీ.. లేదా 16న ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి గం ట ముందు గాని అందజేయవచ్చు. అయితే గత నెల 30న పోలింగ్ జరగ్గా.. 28లోగా దరఖాస్తు చేసుకున్న అందరికీ పోస్టల్ బ్యాలెట్లు పంపించామని అధికారులు చెబుతున్నారు. నిర్ణీత వ్యవధిలోగా దరఖాస్తు చేసుకున్నా.. తమకింకా పోస్టల్ బ్యాలెట్ అందలేదని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. దరఖాస్తే చేయని తీరు... కొన్ని నియోజకవర్గాల్లో ఓటు హక్కున్న ఉద్యోగులు చాలామంది అసలు దరఖాస్తే చేసుకోలేదు. ఉదాహరణకు ముషీరాబాద్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్కు అర్హులైనవారు దాదాపు 3 వేల మంది ఉద్యోగులుండగా.. వారిలో 400 మంది మాత్రమే దరఖా స్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన కొన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పుడు నాలుక్కరచుకుంటున్నారు. గడువున్నప్పుడే వారు పోస్టల్ బ్యాలెట్లకు దరఖాస్తు చేసుకోమని చెప్పలేకపోయామని వాపోతున్నారు. గ్రేటర్ పరిధిలో 28 వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో దాదాపు 18 వేల మంది నుంచి ఓటు చేసిన బ్యాలెట్లు అందాయని సంబంధిత అధికారులు చూచాయగా చెబుతున్నారు. కచ్చితమైన సంఖ్య మాత్రం చెప్పలేకపోతున్నారు. దరఖాస్తు చేసినా.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అటమిక్ ఎనర్జీలో పనిచేస్తున్న నాకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు అప్పగించారు. గతనెల 25న ఫారం-12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇంకా అందలేదు. గతంలో దరఖాస్తు చేసుకున్న చోట వెంటనే ఇచ్చేవారు. ఇప్పుడు అలా ఇవ్వలేదు. పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఇంకా అందకపోవడంతో కొంత ఆందోళనగా ఉంది. - సీవీకే మోహన్ వర్మ -
11న టీ ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
వరంగల్ సిటీ, న్యూస్లైన్ : తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికల షెడ్యూల్ను రిటర్నింగ్ ఆఫీసర్, వర్ధన్నపేట ఎస్పీహెచ్ఓ డాక్టర్ ఎ.సాంబశివరావు ఆదివారం విడుదల చేశారు. ఈనెల 6, 7వ తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 8న నామినేషన్ల పరిశీలన, 9న నామినేషన్ల ఉపసంహరణ, 10న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్న ట్లు తెలిపారు. 11వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీఎంహెచ్ఓ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
కలెక్టరేట్,న్యూస్లైన్: అదనంగా వచ్చి న ఈవీఎంలను సోమవారం జిల్లాకేంద్రంలోని రెవెన్యూ సమావేశపు హాల్లో ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల వారీ గా పోలింగ్ బృందాల ఎంపికకు నిర్దేశించిన జాబితా ప్రకారం మూడోదశ ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టామన్నారు. జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలో 213 పోలింగ్ బృందాలు, నారాయణపేటలో 219 , గద్వాలలో 251, మహ బూబ్నగర్లో 250, జడ్చర్లలో 215, దేవరకద్రలో 244, మక్తల్లో 236, వన పర్తిలో 252, అలంపూర్లో 242, నాగర్కర్నూల్లో 235, అచ్చంపేటలో 247, కల్వకుర్తిలో 238, షాద్నగర్లో 215, కొల్లాపూర్లో 214 పోలింగ్ బృందాలను ర్యాండమైజేషన్ ద్వార నిర్ధారించామన్నారు. ర్యాండమైజేషన్ వివరాలను రిటర్నింగ్ అధికారులకు సమాచారం అందించనున్నామని చె ప్పారు. అదనంగా15 శాతం ఈవీఎంలను అందుబాటులో ఉంచినట్లు తెలి పారు. కార్యక్రమంలో ఎస్పీ నాగేంద్రకుమార్, సాధారణ ఎన్నికల పరిశీ లకులు వేద ప్రకాష్సింగ్, హృదయ్ శంకర్తివారీ, అబ్రహం, ట్రైనీ కలెక్టర్ విజయరామరాజు, డీఆర్ఓ రాంకిషన్, తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ రోజు సెలవు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పో లింగ్ జరగనున్న బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి గిరిజాశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ గెజిట్ 165ను విడుదల చేస్తూ 30వ తేదీ సెలవు ప్రకటించినట్లు పే ర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు మే 1న ప్రత్యేక క్యాజువల్ సెల వును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. వెబ్ కాస్టింగ్కు హాజరుకావాలి లైవ్ వెబ్ కాస్టింగ్ శిక్షణ పొందిన ఇంజనీరింగ్ విద్యార్థులు, మీసేవ ఆపరేటర్లు ల్యాప్టాప్, పాస్ఫోటోతో మంగళవారం ఉదయం 9 గంటలకు వారివారి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నోడల్ అధికారిని (డిస్ట్రిబ్యూషన్ సెంటర్) సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. -
మోగిన సార్వత్రిక భేరి
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ తొలిరోజు ఐదు నామినేషన్లు పత్తికొండ నుంచి వైఎస్సార్సీపీ తరఫున కోట్ల హరిచక్రపాణిరెడ్డి నామినేషన్ దాఖలు కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల భేరీ మోగింది. జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సి.సుదర్శన్రెడ్డి, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి, జేసీ కలెక్టర్ కె.కన్నబాబు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు జారీ చేశారు. నోటిఫికేషన్ జారీతోనే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. అయితే మొదటిరోజు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకోలేదు. తిథి, నక్షత్రం తదితర వాటిని చూసుకుని నామినేషన్లు వేయాలనే ఉద్దేశంతో పలువురు అభ్యర్థులు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి రోజు పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్.ఎం.డి.ఫరూక్ తరఫున ఆయన కుమారులు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కన్నబాబుకు అందజేశారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్.కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తంగా ముగ్గురు అభ్యర్థులు ఐదు నామినేషన్లు దాఖలు చేశారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం సహా మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు మొదటిరోజు నామినేషన్లు బోణీ కాలేదు. అయితే ఈ నెల 13వ తేదీ ఆదివారం, 14న అంబేద్కర్ జయంతి కావడంతో సెలవుగా ప్రకటించారు. 15వ తేదీ నుంచి నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఊపందుకునే అవకాశం ఉంది. నామినేషన్ దాఖలుకు వచ్చే అభ్యర్థులు ఖచ్చితమైన పత్రాలతో రావాలని కలెక్టర్ సి.సుదర్శన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసేవారు ఫారం-2ఎ, అసెంబ్లీకి పోటీ చేసేవారు ఫారం-2బిలో నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. నామినేషన్ దాఖలు చేసే వ్యక్తి అదే నియోజకవర్గానికి చెందిన వారైతే ఓటరు లిస్ట్ జతపరచాలి. వేరొక నియోజకవర్గానికి చెందినవారైతే సదరు నియోజకవర్గపు ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ధృవీకరించిన ఓటరు జాబితాను సమర్పించాలని పేర్కొన్నారు. ప్రతిపాదకులు మాత్రం అదే నియోజకవర్గానికి చెందినవారై ఉండాలని తెలిపారు. డిపాజిట్ సొమ్మును నగదు లేదా చలానా రూపంలో మాత్రమే స్వీకరిరిస్తామని, చెక్కులు, డీడీలు చెల్లవని స్పష్టం చేశారు. -
బ్యాలెట్ పేపర్ల ముద్రణ తనిఖీ
కరీంనగర్ సిటీ, న్యూస్లైన్: వివిధ ప్రింటింగ్ ప్రెస్లలో ముద్రిస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలను గురువారం కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తనిఖీ చేశారు. ముద్రణ ఎప్పటివరకు పూర్తవుతాయని అడిగి తెలుసుకున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, జెడ్పీ డెప్యూటీ సీఈవో సత్యవతి ఉన్నారు. కోడ్ ఉల్లంఘిస్తే నేరుగా తెలపండి : ఎన్నికల అధికారి ఉషారాణి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తున్నట్లు భావిస్తే తమకు నేరుగా తెలపాలని ఎన్నికల రాష్ట్ర పరిశీలకులు వి.ఉషారాణి పేర్కొన్నారు. వి.ఉషారాణి సెల్ నంబర్ 81796 75804, సి.పార్థసారథి సెల్ నంబర్ 81790 24803 కు సమాచారం ఇవ్వొచ్చన్నారు. 29న జెడ్పీటీసీ అభ్యర్థులకు అవగాహన జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీచేస్తున్న జగిత్యాల, పెద్దపల్లి, మంథని డివిజన్ అభ్యర్థులకు ఈ నెల 29న ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించనున్నట్లు రిటర్నింగ్ అధికారి విజయ్గోపాల్ తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం ఉంటుందన్నారు. -
సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్
జెడ్పీసెంటర్, న్యూస్లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం కావటంతో కలెక్టర్ ఉదయం జిల్లా పరిషత్ కార్యాలయలంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించి, నామినేషన్లు వేసేందుకు అవసరమయ్యే డాక్యుమెంట్లు, ఇతర అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం, సంబంధిత ఫారాలని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే మండల స్థాయిలో స్వీకరించే ఎంపీటీసీ నామినేషన్లకు సైతం ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ రవీందర్, జిల్లా రెవెన్యూ అధికారి రాంకిషన్, తదితరులున్నారు. -
రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై నేడు ఈసీ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఏర్పాట్లపై కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం అన్ని జిల్లా కలెక్టర్లతో కేంద్ర డిప్యుటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్సి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ, పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించడం, రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం, ఈవీఎంల లభ్యత, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించనున్నారు.