
సాక్షి, ప్రకాశం: ఒంగోలు పట్టణంలో శుక్రవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రెండు సెకండ్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గద్దల కుంట, దేవుడి చెరువు, మామిడిపాలెం ప్రాంతాల్లో భూమి కంపించినట్టు స్థానికులు చెప్పారు.
(చదవండి: అడవిలో తప్పిపోయిన మహిళ)