భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా సీపీఐ నిరసన | cpi protests at kakinada head postoffice | Sakshi
Sakshi News home page

భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా సీపీఐ నిరసన

May 14 2015 11:52 AM | Updated on Sep 3 2017 2:02 AM

కేంద్ర భూసేకరణ చట్టాన్ని నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ హెడ్ పోస్టాఫీసు ఎదుట గురువారం సీపీఐ జైల్భరో కార్యక్రమాన్ని నిర్వహించింది.

కాకినాడ: కేంద్ర భూసేకరణ చట్టాన్ని నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ హెడ్ పోస్టాఫీసు ఎదుట గురువారం సీపీఐ జైల్భరో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యాలయంలోకి ఆందోళనకారులు దూసుకెళ్లేందుకు యత్నించారు. దాంతో పోలీసులు వారిని అడ్డగించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా అధ్యక్షుడు తాటిపాక మధును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు.


అనంతపురం టౌన్: జైలో భరో కార్యక్రమంలో భాగంగా అనంతపురం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు సీపీఐ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్యతో పాటు ఇతర నే తలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

గుంటూరు: గుంటూరులో నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో సీపీఐ నేత నారాయణ పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ప్రకాశం, ఖమ్మం జిల్లాల్లోనూ సీపీఐ నిరసనలు నిర్వహించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement