'విభజన ప్రక్రియను దేశ విభజనగా మార్చారు' | Congress making issue of division of Andhra Pradesh process, says Peddireddy | Sakshi
Sakshi News home page

'విభజన ప్రక్రియను దేశ విభజనగా మార్చారు'

Sep 6 2013 8:55 AM | Updated on Mar 18 2019 9:02 PM

సాధారణంగా జరగాల్సిన రాష్ట్ర విభజన ప్రక్రియను దేశ విభజనగా మార్చారని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి అన్నారు.

హైదరాబాద్ : సాధారణంగా జరగాల్సిన రాష్ట్ర విభజన ప్రక్రియను దేశ విభజనగా మార్చారని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం ఓ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ సమస్యను పరిష్కరించి విభజనపై ముందుకు వెళ్లాలన్నారు. అలాగే ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు.

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కావాలని మూడు ప్రాంతాల ప్రజలు కోరుకోవటం లేదని పెద్దిరెడ్డి అన్నారు. రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు మాట్లాడుతూ కేబినెట్ నోట్ తయారయిపోతే.... ఇక ఆంటోనీ కమిటీని ఎందుకు వేసినట్లని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement