పౌరసత్వం కేసులో తీర్పు అమలు ఆపండి | Citizen case: chennamaneni ramesh moves high court | Sakshi
Sakshi News home page

పౌరసత్వం కేసులో తీర్పు అమలు ఆపండి

Aug 24 2013 5:41 AM | Updated on Aug 31 2018 8:24 PM

పౌరసత్వం కేసులో తీర్పు అమలు ఆపండి - Sakshi

పౌరసత్వం కేసులో తీర్పు అమలు ఆపండి

భారతీయ పౌరసత్వం లేని కారణంగా ఎమ్మెల్యేగా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు.

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో పిటిషన్
 సాక్షి, హైదరాబాద్: భారతీయ పౌరసత్వం లేని కారణంగా ఎమ్మెల్యేగా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు వీలుగా తనకు నెల రోజులు గడువు ఇవ్వాలని కోర్టుకు ఆ పిటిషన్‌లో విన్నవించారు. తన వాదన వినకుండానే ఈ తీర్పు వెలువరించారని, దాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం జర్మనీలో చికిత్స పొందుతున్నానని పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement