27న విశాఖలో సీఐఐ సదస్సు | cii summit will be held in visakha, says chandrababu | Sakshi
Sakshi News home page

27న విశాఖలో సీఐఐ సదస్సు

Jan 25 2017 10:17 PM | Updated on Sep 5 2017 2:06 AM

27న విశాఖలో సీఐఐ సదస్సు

27న విశాఖలో సీఐఐ సదస్సు

విశాఖలో జరిగే భాగస్వామయ్య సదస్సును అరుణ్‌ జైట్లీ ప్రారంభిస్తారని చంద్రబాబు తెలిపారు.

అమరావతి: రెండు రోజులపాటు విశాఖలో జరిగే భాగస్వామయ్య సదస్సును కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఆయన బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. ఎల్లుండి (శుక్రవారం) జరిగే సీఐఐ సదస్సుకు మంత్రి వెంకయ్యనాయుడు సహా పలువురు మంత్రులు హాజరవుతారని ఆయన వెల్లడించారు.
 
గత ఏడాది విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో 328 ఎంవోయూలు కుదుర్చుకుని, రూ.4 లక్షల 62వేల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. ఇందులో 157 ఒప్పందాలకు సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. వీటి కారణంగా వేలాది మందికి ఉపాధి లభించిందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement