టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పదేళ్ల తర్వాత సచివాలయంలో అడుగు పెట్టనున్నారు.
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పదేళ్ల తర్వాత సచివాలయంలో అడుగు పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఈనెల 19న మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయానికి వెళ్లనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా బాబు సచివాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడనున్నారు.
కాగా సచివాలయంలోని ఎల్ బ్లాక్లోని 8వ అంతస్తును బాబుకు కేటాయించినప్పటికీ అక్కడ మరమ్మత్తులు పూర్తికాకపోవడంతో తాత్కాలికంగా కొన్నిరోజులపాటు ఆయన లేక్ వ్యూ గెస్ట్హౌస్ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నారు. కాగా 19న ఉదయం 8 గంటలకు లేక్వ్యూ అతిధి గృహానికి బాబు అడుగు పెట్టనున్నారు.