- నవంబర్ 1 నుంచి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో అమలు
- సాఫ్టెక్ సొల్యూషన్స్కు రూ. 26.06 కోట్లకు టెండర్ ఖరారు
- రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో అమలుకు నిర్ణయం
- విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీటీసీపీ రఘురామ్
సాక్షి, గుంటూరు: నగరపాలక సంస్థలు, పురపాలక సంఘ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా త్వరలో ఆన్లైన్ ద్వారా భవన నిర్మాణాల అనుమతులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ (డీటీసీపీ) జి.వి.రఘురామ్ తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థలోని ప్రత్యేకాధికారి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంటి వద్ద నుంచి భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే.. కొద్ది రోజుల్లోనే ఆన్లైన్లో అనుమతులు పొందే ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాఫ్టెక్ సొల్యూషన్స్కు రూ.26.06 కోట్లకు టెండర్ను ఖరారు చేశామని చెప్పారు.
ముందుగా పెలైట్ ప్రాజెక్ట్ కింద గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరపాలక సంస్థల్లో నవంబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జీఎంసీలో ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 83 బిల్డింగ్ ప్లాన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించామని, అందులో 54 దరఖాస్తు దారుల వద్దే పెండింగ్ ఉన్నాయని వివరించారు.
ఈ ఒక్క రోజులో 11 దరఖాస్తులు పూర్తి చేసి అనుమతులు ఇచ్చామని తెలిపారు. 200 చదరపు గజాల కంటే లోపు ఉన్న వారు దరఖాస్తుతోపాటు డబ్బు మొత్తం కట్టేస్తే రెండు లేదా మూడు రోజుల్లో అనుమతులు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. అనుమతుల మంజూరులో ఆలస్యం చేసిన ఓ బిల్డింగ్ ఇన్స్పెక్టర్కు రోజుకు రూ. 50 చొప్పున పెనాల్టీ వేశామని చెప్పారు. టీడీఆర్ బాండ్లకు కామన్ రిజిస్టర్ లేదని గుర్తించామని, దీని వల్ల ఇప్పటికి ఎన్ని తప్పులు జరిగాయనేది అటుంచితే భవిష్యత్తులో తప్పులు జరిగే ప్రమాదం ఉందని డీటీసీపీ అన్నారు. రోడ్డు, కాలువలు ఏర్పాటు చేయకపోతే అపార్ట్ మెంట్లకు అనుమతిచ్చే సమస్యే లేదు. ఖచ్చితంగా బీటీ రోడ్ ఏర్పాటు చేయాలి. బీపీఎస్ను అందరూ వినియోగించుకోవాలని డీటీసీపీ రఘురామ్ కోరారు.
ఆన్లైన్లో భవన నిర్మాణాల అనుమతులు
Published Sat, Sep 5 2015 3:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి
కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్దు
ఆదరించండి.. అభివృద్ధి చేస్తా
ప్రాణం తీసిన మామిడి కాయల గొడవ
బీజేపీ అనుకూల పార్టీలను ఓడించాలి
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఆర్ఎస్పీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
మెరుగైన వైద్యసేవలు అందించాలి
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement