కడప జిల్లా పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెల్ల గ్రామంలో ఓ వ్యక్తిపై గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఎలుగుబంటి దాడి చేసింది.
కడప (పోరుమామిళ్ల): కడప జిల్లా పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెల్ల గ్రామంలో ఓ వ్యక్తిపై గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఇండ్లరామయ్య(48) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు కి.మీల దూరంలో ఉన్న తన మామిడితోటకి రామయ్య కాపలాగా వెళ్లినప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎలుగుబంటి మీదపడి దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డ రామయ్యను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.