జంతువులతో జాగ్రత్త సుమా... | be careful with Animals | Sakshi
Sakshi News home page

జంతువులతో జాగ్రత్త సుమా...

Jul 5 2015 1:40 AM | Updated on Sep 3 2017 4:53 AM

జంతువుల నుంచి మనుషులకు సుమారు 280 రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఇందులో ఇందులో ప్రధానంగా రేబిస్,

 జంతువుల నుంచి మనుషులకు సుమారు 280 రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఇందులో ఇందులో ప్రధానంగా రేబిస్, బ్రూసెల్లోసిస్, ఆంత్రాక్స్, స్వైన్‌ప్లూ, టీబీ, బర్డ్‌ప్లూ ప్రమాదకరమైనవి.
 
 రేబిస్ వ్యాధి:
 రాబిస్ వ్యాధి కుక్క కాటు ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కుక్కల లాలాజలంలో ఉండే రాబిస్ అనే వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని కోసం ప్రతీ సంవత్సరం వ్యాధి నిరోధక టీకాలు పెంపుడు జంతువులకు తప్పని సరిగా ఇప్పించినట్లైయితే మనుషులకు ఈ వ్యాధులు సోకకుండా ఉంటాయి.
 
 ఆంత్రాక్స్:
 ఈ వ్యాధి ఆంత్రాక్స్ బ్రూసెల్లోసిస్ అనే సూక్ష్మక్రిమి వల్ల వ స్తుంది. ఇది ఎక్కువగా గొర్రెలకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఉన్న గొర్రెపొటేళ్ళ మాంసం తిన్న మనుషులకు వస్తుంది.
 
 బర్డ్‌ప్లూ:
 ఈ వ్యాధి అవయిన్‌లూప్లెంజా అనే సూక్ష్మక్రిమివల్ల వస్తుంది. ఇది గాలి ద్వారా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి వచ్చేటప్పుడు కోళ్ళుచాలా ఎక్కువగా చనిపోతాయి. ఈ వ్యాధితో ఉన్న కోళ్ళ మాంసం, రెట్టల ద్వారా మనుషులకూ వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా చలి కాలంలో వస్తుంది.
 
 టీబీ...
 దీనిని ట్యూబోలలోసిస్ అంటారు. ఇది బ్యాక్టిరీయా ద్వారా మనుషులకు, పశువులకు వచ్చి ప్రతీ సంవత్సరం అనే మంది చనిపోతున్నారు. టీబీతో ఉన్న పశువుల పాలు బాగా మరిగించకుండా తాగినట్లైయితే మనుషులకు, చిన్న పిల్లలకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement