పరీక్షలో ఫెయిల్‌.. బీటెక్‌ విద్యార్థి..? | b.tech student commits suicide | Sakshi
Sakshi News home page

పరీక్షలో ఫెయిల్‌.. బీటెక్‌ విద్యార్థి..?

Jul 18 2017 6:06 PM | Updated on Nov 6 2018 8:08 PM

పరీక్షలో ఫెయిల్‌ అయ్యాడని క్షణికావేశంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

విశాఖపట్నం: పరీక్షలో ఫెయిల్‌ అయ్యాడని క్షణికావేశంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్‌ కాలేజీలో యశ్వంత్‌(18) అనే విద్యార్థి బీటెక్‌ చదువుతున్నాడు. బీటెక్‌ సెకండ్‌ సెమిస్టర్‌లో రెండు సబ్జెక్టుల్లో యశ్వంత్‌ ఫెయిల్‌ అయ్యాడు.

దీంతో తీవ్ర మనస్తాపం చెంది అదే కాలేజీ బిల్డింగ్‌ మీద నుంచి కిందకు దూకాడు. వెంటనే కాలేజీ యాజమాన్యం దగ్గరలోని ఆసుపత్రికి తరలించింది. చికిత్సపొందుతూ యశ్వంత్‌ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement