వైఎస్‌ జగన్‌తోనే ఉద్యోగుల సమస్యలు తీరుతాయి | AV Patel Praises YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌తోనే ఉద్యోగుల సమస్యలు తీరుతాయి

May 25 2019 2:04 PM | Updated on May 25 2019 2:31 PM

AV Patel Praises YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే ఉద్యోగుల సమస్యలు తీరుతాయని ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరమ్ అధ్యక్షుడు ఏవీ పటేల్ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక హోదా కోసం ఆయన చేస్తున్న పోరాటం అమోఘమన్నారు. ఉద్యోగులు అన్ని విధాలుగా వైఎస్‌ జగన్‌కు అండగా ఉంటారని చెప్పారు.  గత ప్రభుత్వంలో ఉద్యోగులను బానిసలుగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. గెజిటెడ్ అధికారులకు అపాయిట్‌మెంట్‌ ఇవ్వకుండా నారా చంద్రబాబునాయుడు అవమానించారని అన్నారు. అమ్ముడుపోయిన అశోక్ బాబు, బొప్పారాజుతో  ఉద్యోగులను మోసం చేశారన్నారు. అమ్ముడుపోయిన నేతలను నమ్ముకున్న చంద్రబాబుకు ఉద్యోగులు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement