వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని సూర్యపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పుట్లూరు నుంచి సూర్యపల్లి వెళ్తున్న ఆటో గ్రామం సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పెద్దిరాజు(55) మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.