ఆటో, బైక్ ఢీ.. ఇద్దరి దుర్మరణం | Auto, bike collided .. two killed | Sakshi
Sakshi News home page

ఆటో, బైక్ ఢీ.. ఇద్దరి దుర్మరణం

Mar 3 2014 12:44 AM | Updated on Aug 25 2018 5:41 PM

ఆటో, బైక్ ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి దురాజ్‌పల్లి స్టేజీ వద్ద జరిగింది.

  •      మరో ఇద్దరికి తీవ్రగాయాలు
  •      బైక్‌పై శుభకార్యానికి వెళ్లి వస్తూ హైవే దాటుతుండగా ప్రమాదం
  •       దురాజ్‌పల్లి వద్ద ఘటన
  •  దురాజ్‌పల్లి (చివ్వెంల), న్యూస్‌లైన్ : ఆటో, బైక్ ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి దురాజ్‌పల్లి స్టేజీ వద్ద జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. అర్వపల్లి మండలం కుంచమర్తి గ్రామానికి చెందిన మహంకాళి సోమయ్య (50) తన కుటుంబ సభ్యులతో పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చారు.

    చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి పెద్దగట్టుపై శుభకార్యం నిర్వహించారు. సోమయ్య తన కుమారుడు మహంకాళి వెంకన్న, మనుమరాలు స్పందన (6), అనంతారం గ్రామానికి చెందిన మామిడి సైదులు నలుగురు ఒకే బైక్‌పై వస్తున్నారు. దురాజ్‌పల్లి శివారులో ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లే క్రమంలో హైదరాబాద్-విజయవాడ రహదారి దాటుతుండగా సూర్యాపేట నుంచి హుజూర్‌నగర్ వెళ్తున్న టాటా ఏస్ ఆటో ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమయ్య అక్కడిక్కడే మరణించాడు.

    బైక్‌పై ఉన్న ముగ్గురిని సూర్యాపేటలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ స్పందన మృతిచెం దింది. వెంకన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సైదులు చికిత్స పొందుతున్నాడు. సంఘటన స్థలాన్ని చివ్వెంల ఎస్‌ఐ కె.నర్సింహరావు సందర్శించి రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్రమ బద్ధీకరించారు.
     
    కుటుంబంలో విషాదఛాయలు

    శుభాకార్యంలో అంత వరకు తమ ముందే ఉన్న సోమయ్య, స్పందన మృతిచెందారనే వార్త విన్న బంధువులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరిని కంట తడిపెట్టిం చింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement