కొనసాగుతున్న ఏపీఎస్‌ ఆర్టీసీ ఎన్నికలు

APSRTC Union Elections Started In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీఎస్‌ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు గురువారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి.  సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. దాదాపు 50వేల మంది ఆర్టీసీ కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏపీలోని 128 డిపోల్లో పోలింగ్‌ జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, బస్‌ భవన్‌లలో 26 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ఎన్‌ఎమ్‌యూ, ఈయూల మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తోంది. రాత్రి 10.30 గంటల్లోపు ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top