కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి మే 26వ తేదీతో రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మోదీ ప్రభుత్వ వైఫల్యాలను, రాష్ట్రానికి చేసిన అన్యాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఏపీసీసీ బుధవారం నిర్ణయించింది.
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి మే 26వ తేదీతో రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మోదీ ప్రభుత్వ వైఫల్యాలను, రాష్ట్రానికి చేసిన అన్యాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఏపీసీసీ బుధవారం నిర్ణయించింది. ఇందిరా భవన్ లో విలేకరులతో మాట్లాడిన పార్టీ ఉపాధ్యక్షులు శైలజానాథ్ ఆంధ్రప్రదేశ్ పదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని అన్నారు.
దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులంతా పాల్గొని మోదీ ప్రభుత్వ మోసాలను కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేస్తారని వివరించారు.