శ్రీకాకుళం ప్రజలకు విద్యుత్‌ శాఖ ఊరట

AP Electricity Department Helps To Srikakulam Titli Victims - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : టిట్లీ తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీకాకుళం జిల్లా ప్రజలకు విద్యుత్‌ శాఖ ఊరటనిచ్చింది. ఈ నెల కరెంట్‌ ఛార్టీలను వచ్చే నవంబరులో కట్టుకునే వెసులుబాటును కల్పించింది. దీనికి ఎలాంటి అపరాద రుసుం వసూలు చేయరని తెలిపింది. టిట్లీ తుఫాను కారణంగా కష్టాల్లో ఉన్న ప్రజలకు భారం కలిగించకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈసీడీసీఎల్‌ కంపెనీకి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top