ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ప్రక్రియను ఆరంభించారు.
విశాఖ : ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాలకు సోమవారం వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ప్రక్రియను ఆరంభించారు. నేటి నుంచి ఈ నెల 15 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 9 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 19, 20 తేదీల్లో ఆప్షన్ల మార్పుకు అవకాశం ఉంటుంది. 22న సీట్లు కేటాయింపు, 27 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. కాగా సాంకేతిక లోపం కారణంగా వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది.