సాక్షి, విశాఖపట్నం: రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావు.. పంచాయితీరాజ్ శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. విశాఖ, మధురవాడ, సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా, హైదరాబాద్లోని శేరిలింగంపల్లిలోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.


