మధుని పరామర్శించిన సీఎం జగన్‌ | YS Jagan Visits CPM Leader Madhu Over his Health Issue - Sakshi
Sakshi News home page

మధుని పరామర్శించిన సీఎం జగన్‌

Nov 7 2019 6:34 PM | Updated on Nov 8 2019 11:49 AM

AP CM YS Jagan Visit CPM Leader Madhu - Sakshi

సాక్షి, తాడేపల్లి: గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు.  ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. గురువారం మధు నివాసానికి వెళ్లిన సీఎం ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మధును పరామర్శించారు. ఈ సందర్భంగా మధుతో వారిద్దరు కాసేపు ముచ్చటించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement