9తేదీ వరకూ అనూహ్య ఫోన్కు సిగ్నల్స్ | anuhya phone calls received upto 9th this month,says Railway superintendent of police Syam Prasad | Sakshi
Sakshi News home page

9తేదీ వరకూ అనూహ్య ఫోన్కు సిగ్నల్స్

Jan 17 2014 1:30 PM | Updated on Oct 22 2018 7:50 PM

ముంబయిలో దారుణ హత్యకు గురైన సాప్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య కేసు దర్యాప్తులో రైల్వే పోలీసుల నిర్లక్ష్యం లేదని రైల్వే ఎస్పీ శ్యాంప్రసాద్ స్ఫష్టం చేశారు.

ముంబయిలో దారుణ హత్యకు గురైన  సాప్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య కేసు దర్యాప్తులో రైల్వే పోలీసుల నిర్లక్ష్యం లేదని రైల్వే ఎస్పీ శ్యాంప్రసాద్ స్ఫష్టం చేశారు. ఈ నెల 5న ఆమె ముంబయి లోకమాన్య తిలక్ రైల్వేస్టేషన్లో దిగినట్లు ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లో కేసు దర్యాప్తు వివరాలు కనుగొని ముంబయి పోలీసులకు సమాచారం అందించామన్నారు.

 

మహారాష్ట్ర నుంచి 9వ తేదీ వరకూ అనూహ్య ఫోన్కు సిగ్నల్స్ ఉన్నట్లు సమాచారం ఉందని ఎస్పీ తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన 23 ఏళ్ల సాప్ట్వేర్ ఇంజనీర్ ఈస్తర్ అనూహ్య ముంబైలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement