తిరుమలలో మరో చిన్నారి కిడ్నాప్‌ | Another kid kidnapped at tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో మరో చిన్నారి కిడ్నాప్‌

Jul 26 2017 3:14 AM | Updated on Sep 5 2017 4:51 PM

తిరుమలలో మరో చిన్నారి కిడ్నాప్‌

తిరుమలలో మరో చిన్నారి కిడ్నాప్‌

తిరుమలలో మరో చిన్నారిని కిడ్నాప్‌ చేశారు. శ్రీకాళహస్తికి చెందిన ఏడేళ్ల నందినిని గుర్తుతెలియని మహిళ ఆదివారం కిడ్నాప్‌ చేసింది.

సాక్షి,తిరుమల: తిరుమలలో మరో చిన్నారిని కిడ్నాప్‌ చేశారు. శ్రీకాళహస్తికి చెందిన ఏడేళ్ల  నందినిని గుర్తుతెలియని మహిళ ఆదివారం కిడ్నాప్‌ చేసింది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపం లోని అమ్మపాళెంకు చెందిన సురేష్‌ తిరుమ లలో ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. భార్య దాక్షాయిణి, ఇద్దరు కుమార్తెలు నందిని (7), మహాలక్ష్మి(4)తో కలసి తిరుమలలోనే నివా సం ఉంటున్నాడు. ఈ నెల 23న స్థానిక యాత్రిసదన్‌–4 వద్దకు  పెద్దకుమార్తె నందిని తాగునీటికోసం వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు గాలించినా ఆచూకీ లభించక పోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు సేకరించారు. ఆదివారం మధ్యాహ్నం 3.33కు నందిని ని ఓ మహిళ వెంట తీసుకెళ్తున్నట్లు అక్కడి ఏటీఎం సెంటర్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. 3.50 గంటలకు తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్, సాయంత్రం 5 గంట లకు తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద కూడా సీసీ కెమెరాల్లో నందిని, గుర్తుతెలి యని మహిళ నడిచివెళుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనను టీటీడీ సీవీఎస్‌వో ఏ.రవికృష్ణ, తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్‌పి అభిషేక్‌ మహంతి తీవ్రంగా పరిగణించారు. చిన్నారి గాలింపునకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. కిడ్నాప్‌కు పాల్పడిన మహిళ ఫొటోలతో విస్తృత ప్రచారం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement