పెన్నా బ్యారేజ్‌ పనులను పరిశీలించిన మంత్రి అనిల్‌కుమార్‌

Anil Kumar Yadav Visited Penna Barriage In Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు : నెల్లూరులోని పెన్నా బ్యారేజ్‌ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డితో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ మాట్లాడుతూ ..వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ర్లంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. దివంగత నేత డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరూ బ్యారేజ్‌ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేస్తామని మంత్రి అనిల్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top