నేను ఒంటరి కాదు...నాతో మరికొందరు | am not alone, many others ready to join congress says aravinda reddy | Sakshi
Sakshi News home page

నేను ఒంటరి కాదు...నాతో మరికొందరు

Jan 25 2014 2:23 PM | Updated on Mar 18 2019 9:02 PM

నేను ఒంటరి కాదు...నాతో మరికొందరు - Sakshi

నేను ఒంటరి కాదు...నాతో మరికొందరు

తాను ఒక్కడినే కాదని.... తనతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరతారని ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల శాసనసభ్యుడు అరవింద్ రెడ్డి తెలిపారు

హైదరాబాద్ : తాను ఒక్కడినే కాదని.... తనతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరతారని ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల శాసనసభ్యుడు అరవింద్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ ఫిబ్రవరి పదో తేదీ తర్వాత మరికొంతమంది తనతో వస్తారని అన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను ఈరోజు కలిసేందుకు ప్రయత్నిస్తామని అరవింద్ రెడ్డి తెలిపారు.

'తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టినందుకే టీఆర్‌ఎస్‌లో చేరిన. తెలంగాణ ఏర్పాటైన తర్వాత  కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ చాలాసార్లు అన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్‌ఎస్ అవసరం ఏమిటి? తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత ఉండొద్దా? కొందరిని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేయడానికే టీఆర్‌ఎస్ పుట్టిందా?’ అని అరవింద్ రెడ్డి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement