రజత సింహాసనంపై అక్కినేనికి సత్కారం | akkineni nageswara rao honored | Sakshi
Sakshi News home page

రజత సింహాసనంపై అక్కినేనికి సత్కారం

Sep 29 2013 1:49 AM | Updated on Sep 4 2018 5:07 PM

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్‌ అక్కినేని నాగేశ్వరరావును రజత సింహాసనంపై కూర్చోబెట్టి యాక్టర్లు, డాక్టర్లు కలసి ఘనంగా సత్కరించారు.

హైదరాబాద్‌,న్యూస్‌లైన్‌: దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్‌ అక్కినేని నాగేశ్వరరావును రజత సింహాసనంపై కూర్చోబెట్టి యాక్టర్లు, డాక్టర్లు కలసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం రవీంద్రభారతి ప్రధాన వేదికపై శనివారం రాత్రి జరిగింది. రాజ సప్తస్వరం, టి.సుబ్బిరామిరెడ్డి లలితకళా పరిషత్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అక్కినేని 90వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్లు, యాక్టర్లు పుష్పగుచ్ఛాలు, శాలువలతో అక్కినేని సత్కరించారు.

 

అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీనటి లకిష్మ మాత్రం తన వద్ద పుష్పగుచ్ఛాలు లేవంటూ, ‘ఐ లవ్‌యూ అక్కినేని’ అంటూ ఆలింగనం చేసుకోవడం కొసమెరుపు. సినీనటులు మోహన్‌బాబు, బ్రహ్మానందం, మురళీమోహన్‌, చంద్రమోహన్‌, కోట శ్రీనివాసరావు తదితరులతో పాటు పలువురు డాక్టర్లు, యాక్టర్లు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement