ఏం.. తమాషా చేస్తున్నారా

Agriculture Department Officer Fired on Women Officers - Sakshi

వ్యవసాయ శాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేడీ చంద్రనాయక్‌

విజయనగరం  ,కొమరాడ: ఉద్యోగం చేస్తారా..? మానేస్తారా..? అంటూ వ్యవసాయాధికారులపై ఆ శాఖ జేడీ  చంద్రనాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో లేకపోతే ఇంటికెళ్లిపోవాలని ఘాటుగా హెచ్చరించారు.

ఎట్టి పరిస్థతుల్లోనూ  రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఎన్నికల విధులు మీకే కాదు.. మాకూ ఉన్నాయి... ఆ విధులతో పాటు శాఖపరమైన పనులు కూడా చేయాలని ఆదేశించారు. అలాగే ప్రధానమంత్రి కిసాన్‌ స మ్మాన్‌ నిధిపై రైతులకు అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖాధికారి విజయభారతి, తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top