అప్పుడే నూరేళ్లు నిండాయా..! | 5 years old girl died in road accident | Sakshi
Sakshi News home page

అప్పుడే నూరేళ్లు నిండాయా..!

Feb 18 2018 12:57 PM | Updated on Aug 30 2018 4:20 PM

5 years old girl died in road accident - Sakshi

పోరుమామిళ్ల : ‘అప్పుడే నూరేళ్లు నిండా యా చిట్టి తల్లీ’.. అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు మృత్యువాత పడటంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రౌతుపల్లెకు చెందిన చప్పిడి వెంకటసుబ్బారెడ్డి, సునీత కూతురు తన్విత (5).

ఆ బాలిక గానుగపెంట పాఠశాలలో ఎల్‌కెజీ చదువుతోంది. ఈ క్రమంలో శనివారం తల్లిదండ్రులతో బద్వేలు నుంచి ఆటోలో ఊరికి వచ్చింది. ఆటో దిగి రోడ్డు దాటి ఇంటికి వెళుతుండగా.. క్రిష్ణంపల్లె నుంచి బద్వేలు వెళుతున్న ట్రాక్టర్‌ పసిబిడ్డపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తన్విత అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో తల్లిదండ్రులు కూలబడిపోయారు. క్రిష్ణంపల్లెకు చెందిన ట్రాక్టర్‌ యజమాని చలపతి స్వయంగా డ్రైవింగ్‌ చేస్తుండగా జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement